Tirumala: భక్తకోటికి కొండంత కష్టం
తిరుమల వేంకటేశ్వరస్వామిని కళ్లారా దర్శించి తరించాలని సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు... తితిదే అధికారుల ఘోర వైఫల్యంతో మంగళవారం నరకం కనిపించింది. వేలసంఖ్యలో భక్తులు వస్తారని తెలిసీ కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో శ్రీవారి
అయిదుగురికి గాయాలు
అధికారుల నిర్వాకంపై విమర్శలు
ఎట్టకేలకు టోకెన్లు లేకుండా దర్శనానికి తితిదే అనుమతి
ఈనాడు-తిరుపతి, తిరుమల, న్యూస్టుడే: తిరుమల వేంకటేశ్వరస్వామిని కళ్లారా దర్శించి తరించాలని సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు... తితిదే అధికారుల ఘోర వైఫల్యంతో మంగళవారం నరకం కనిపించింది. వేలసంఖ్యలో భక్తులు వస్తారని తెలిసీ కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో శ్రీవారి ఉచిత దర్శన టోకెన్ల జారీకేంద్రాల వద్ద భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. గోవిందరాజస్వామి సత్రాల వద్ద టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాటలో అయిదుగురు గాయపడ్డారు. పలువురు భక్తులు స్పృహ కోల్పోయారు. వారిని అంబులెన్సులలో రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. భూదేవి కాంప్లెక్స్ వద్ద కూడా తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. వృద్ధులు, మహిళలు, పిల్లలు ఊపిరాడక విలవిల్లాడిపోయారు. కొందరు సొమ్మసిల్లిపోయారు. వారిని 108లలో ఆస్పత్రులకు తరలించారు. నిప్పులు చెరుగుతున్న ఎండలో, దాహంతో తడారిపోతున్న గొంతులతో, ఏడుస్తున్న పిల్లా, పాపలతో గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి ఉండాల్సి రావడం... అంతసేపు ఎదురుచూసినా టోకెన్లు దొరుకుతాయో లేదో తెలియని సందిగ్ధత భక్తుల్ని తీవ్ర అసహనానికి గురిచేసింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే వేలకొద్దీ భక్తులు క్యూలైన్లలో వేచి చూస్తున్నా, తీరిగ్గా ఉదయం 6 గంటలకు టోకెన్ల జారీ ప్రారంభించారు. చూస్తుండగానే భక్తుల రద్దీ బాగా పెరిగిపోయింది. వారు వేచి ఉండేందుకు తగిన ఏర్పాట్లు లేవు. ఎంతసేపటికీ క్యూలైన్లు తరగక సహనం కోల్పోయిన భక్తులు తోసుకురావడంతో... తితిదే భద్రతా సిబ్బంది వారిని నియంత్రించలేకపోయారు. పోలీసులు వచ్చేసరికే పరిస్థితి అదుపు తప్పింది.
రెండు రోజుల నుంచీ వేచి ఉన్నారని తెలిసినా..
తిరుపతిలోని శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల్లో ఉచిత దర్శన టోకెన్లు జారీచేస్తున్నారు. రేపటి దర్శనానికి ముందురోజు టోకెన్లు ఇస్తున్నారు. భక్తుల సంఖ్య ఎక్కువ ఉంటే... ఎల్లుండి దర్శనానికీ ఈరోజు అర్ధరాత్రి నుంచే టోకెన్లు ఇస్తున్నారు. అలా సోమవారం వరకూ టోకెన్లను శనివారమే ఇచ్చేశారు. ఆది, సోమవారాల్లో టోకెన్ల జారీ నిలిపివేశారు. ఆ విషయాన్ని తితిదే ప్రకటించినా... విషయం తెలియని చాలామంది భక్తులు ఆది, సోమవారాల్లో తిరుపతికి చేరుకున్నారు. వారంతా టోకెన్ల కోసం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్తో పాటు గోవిందరాజస్వామి సత్రాల వద్ద వేచి ఉన్నారు. రెండు రోజులపాటు టోకెన్లు జారీ చేయకపోవడంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. మంగళవారం ఉదయం టోకెన్లు జారీ చేస్తారని తెలిసి.. మరింతమంది తిరుపతి వచ్చారు. ఇలా మూడు రోజుల్లో వచ్చిన భక్తులతో తిరుపతి మంగళవారం కిటకిటలాడిపోయింది. టోకెన్ల జారీ కేంద్రాలకు జనం పోటెత్తారు. చూస్తుండగానే క్యూలైన్లు కిలోమీటర్ల మేర పెరిగిపోయాయి. భక్తులు తీవ్ర అసహనానికి గురయ్యారు. అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద ప్రవేశమార్గం పూర్తిగా కూలిపోయే పరిస్థితికి చేరింది. పోలీసులు తాడు సాయంతో పడిపోతున్న ఆ ప్రవేశమార్గాన్ని నిలబెట్టారు. భక్తులు ఆగ్రహంతో బారికేడ్లు పీకేశారు. జాలీల్ని తొలగించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచీ టోకెన్లు జారీచేయాల్సి ఉండగా, ఉదయం 6 గంటల నుంచి మొదలుపెట్టారు. భక్తులు వేల సంఖ్యలో ఉన్నారని తెలిసినా, తొక్కిసలాట జరగొచ్చని ఊహించడంలో తితిదే అధికారులు విఫలమయ్యారు. బందోబస్తు కోసం పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వలేదు. పరిస్థితి చేయి దాటుతుండటంతో టోకెన్లు లేకుండానే భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఉదయం 11.30 గంటలకు తితిదే ప్రకటించింది. దాంతో క్యూలైన్లలో ఉన్న భక్తులు బస్సులు, సొంత వాహనాలు, టాక్సీల్లో కొండపైకి వెళ్లారు.
అనూహ్య రద్దీతో స్లాటెడ్ విధానం రద్దు
శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం తిరుపతిలో మంగళవారం అనూహ్య రద్దీ నెలకొనడంతో స్లాటెడ్ టోకెన్లను రద్దుచేసి నేరుగా సర్వదర్శనానికి అనుమతించామని తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనూహ్య రద్దీతో 2020కి పూర్వం ఉన్న విధానంలోనే టోకెన్లు లేకుండా వైకుంఠం క్యూకాంప్లెక్స్లోకి భక్తులను అనుమతించామని తెలిపారు. దర్శనానికి 20-30 గంటల పాటు వేచి ఉండాల్సి ఉంటుందని, తదనుగుణంగా భక్తులు తిరుమలకు రావాలని సూచించారు.
ఆదివారం వరకు బ్రేక్ దర్శనాలు రద్దు
శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో పాటు తిరుపతిలో సర్వదర్శనం కౌంటర్ల వద్ద భక్తుల రద్దీతో తోపులాటలు చోటుచేసుకున్న నేపథ్యంలో తితిదే బుధవారం నుంచి ఆదివారం వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దుచేసింది. తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసి కొవిడ్కు పూర్వం ఉన్న విధానాన్ని పునరుద్ధరించింది. మంగళవారం మొదట టోకెన్లు ఉన్నవారిని, వారి తర్వాత టోకెన్లు లేనివారిని కంపార్ట్మెంట్లలోకి అనుమతించారు. టోకెన్ల విధానం తీసేసిన నేపథ్యంలో తిరుమలకు పెద్దసంఖ్యలో చేరుకునే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు తితిదే అధికారులు చర్యలు చేపట్టారు. క్యూలైన్లోని వారికి అల్పాహారం, తాగునీరు అందించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తితిదే అధికారులు తెలిపారు.
తలనీలాలైనా సమర్పించుకుంటాం
కొవిడ్ కారణంగా ఎప్పటి నుంచో మొక్కులు తీర్చుకోలేదని, తమను తిరుమలకు అనుమతిస్తే స్వామి దర్శనం దొరక్కపోయినా, కనీసం మొక్కులైనా తీర్చుకుంటామని భక్తులు అధికారులను వేడుకున్నారు. వారిలో కొందరు నడకమార్గం ద్వారా కొండపైకి వస్తామని మొక్కుకోగా మరికొందరు తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
-
పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం