Kishan Reddy: ‘ఈనాడు’ను అనుసరించాలి
ఆజాదీ కా అమృత్మహోత్సవ్ సందర్భంగా ‘ఈనాడు’ అందిస్తున్న ప్రత్యేక కథనాలను కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డి అభినందించారు. అమృత్ మహోత్సవాలను పెద్దఎత్తున నిర్వహించేందుకు
అజ్ఞాత సమరయోధుల గురించి మంచి కథనాలు ప్రచురిస్తున్నారు
కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రశంస
ఈనాడు, దిల్లీ: ఆజాదీ కా అమృత్మహోత్సవ్ సందర్భంగా ‘ఈనాడు’ అందిస్తున్న ప్రత్యేక కథనాలను కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డి అభినందించారు. అమృత్ మహోత్సవాలను పెద్దఎత్తున నిర్వహించేందుకు రెండ్రోజులుగా అమృత్సమాగమ్ పేరుతో ఇక్కడ నిర్వహిస్తున్న సమావేశాల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.‘‘దేశవ్యాప్తంగా స్వాతంత్య్రం కోసం పోరాడిన అజ్ఞాతయోధులను వెలుగులోకి తేవడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందుకు ప్రజాభాగస్వామ్యమూ అవసరం. దేశంలో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికల్లో ఒకటైన ‘ఈనాడు’ ప్రతి రోజూ ఒక కథనాన్ని ప్రచురిస్తోంది. మిగతా రాష్ట్రాల్లోనూ అక్కడి ప్రాంతీయ, జాతీయపత్రికలు ఇదే తరహాలో ప్రచురించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహోన్నత వ్యక్తుల సమాచారాన్ని వెలికితీసి విస్తృత ప్రచారం కల్పించాలి. ‘నా గ్రామం-నా వారసత్వం’ పేరుతో పల్లెలకున్న వారసత్వ గొప్పతనాన్ని కూడా దేశం ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజునే దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్నూ నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 75 ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో యోగా ఉత్సవాలుంటాయన్నారు. ఆగస్టు 15న ప్రతి వ్యక్తీ 75వ స్వాతంత్య్రదినోత్సవాల్లో పాల్గొనేలా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. ప్రతి ఇంటి మీదా త్రివర్ణపతాకం ఎగరేసి జాతీయగీతం ఆలపించాలన్నది ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు.
ఇకనైనా రాజకీయ డ్రామాలకు తెరదించాలి
కల్వకుంట్ల కుటుంబం ఇప్పటికైనా రాజకీయ డ్రామాలు ఆపాలని, లేదంటే ప్రజలే వారి డ్రామాలకు తెరదించేస్తారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ధాన్యం సేకరణ పేరుతో కేసీఆర్ రాజకీయ నాటకమాడారు. అందులో భాగంగా రైతు దీక్షలు పెట్టారు. అవి రాజకీయ దీక్షలుగా మారిపోయాయి. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రుల తరహాలో తెలంగాణ సీఎం కూడా వ్యవహరించి ఉంటే హుందాగా ఉండేది. కానీ ఆయన అందుకు విరుద్ధంగా దిల్లీకొచ్చి కేంద్రంపై సత్యాగ్రహం చేసి రాజకీయ లబ్ధిపొందాలని ప్రయత్నించారు. రైతులు వాస్తవాలు తెలుసుకోవడం వల్ల వారి ఉద్యమాల్లో భాగస్వాములు కాలేదు’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. -
మావోయిస్టు నేతలపై రివార్డు
మావోయిస్టు అగ్రనేతల తలలకు రాష్ట్ర పోలీసులు వెల కట్టారు. వారి ఆచూకీ చెబితే లక్షల్లో రివార్డు ఇస్తామని ప్రకటించారు. -
కందులకు గరిష్ఠ ధర రూ.11,246
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో కందులకు మంచి ధర పలుకుతోంది. మంగళవారం రైతులు మార్కెట్కు 50 క్వింటాళ్ల కందులు తీసుకురాగా.. క్వింటాకు గరిష్ఠ ధర రూ.11,246గా పలికింది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
చెరువుల పరిరక్షణకు తీసుకున్న చర్యలేంటి?: హైకోర్టు
హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో చెత్త, నిర్మాణ వ్యర్థాలతో నిండిపోతున్న జల్పల్లి, ఉమ్దాసాగర్ చెరువులతోపాటు ఇతర చెరువుల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ హైకోర్టు ప్రభుత్వానికి మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. -
కోర్టు ఆవరణలో నిందితులకు సంకెళ్లపై వివరణ ఇవ్వండి
రంగారెడ్డి జిల్లా కూకట్పల్లి జిల్లా కోర్టు ఆవరణలో నిందితులకు పోలీసులు సంకెళ్లు వేసి తీసుకురావడంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. -
రేకుల డబ్బాలు కావు.. నివాస గృహాలే!
ఇక్కడ కనిపిస్తున్నవి రేకుల డబ్బాలు అనుకుంటే పొరపాటే. అవి నివాస గృహాలే. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలోని పేదలకు 2008లో అప్పటి ప్రభుత్వం పేదలకు నివాస స్థలాల పట్టాలు పంపిణీ చేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది.