TTD: ఇక టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనం
టోకెన్లు లభిస్తాయో లేదోనన్న ఆతృతతో భక్తులు క్యూలైన్లలోకి దూసుకెళ్లడంతోనే మంగళవారం తిరుపతిలోని సర్వదర్శనం టోకెన్ల కేంద్రాల వద్ద గందరగోళం ఏర్పడిందని.. తాము అప్రమత్తమై అరగంటలోనే సమస్యను
అప్రమత్తతతోనే అరగంటలో సమస్య పరిష్కరించాం
తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి
ఈనాడు, తిరుపతి: టోకెన్లు లభిస్తాయో లేదోనన్న ఆతృతతో భక్తులు క్యూలైన్లలోకి దూసుకెళ్లడంతోనే మంగళవారం తిరుపతిలోని సర్వదర్శనం టోకెన్ల కేంద్రాల వద్ద గందరగోళం ఏర్పడిందని.. తాము అప్రమత్తమై అరగంటలోనే సమస్యను పరిష్కరించామని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం 15వేల టోకెన్లు జారీచేసే వరకూ ఇబ్బంది లేదని.. 10 గంటల సమయంలో మొదట శ్రీనివాసం కేంద్రం వద్ద సమస్య తలెత్తడంతో భక్తులను నియంత్రించడం కష్టమవుతోందని అధికారులు సమాచారమిచ్చారని తెలిపారు. వెంటనే టోకెన్ల జారీ నిలిపివేసి భక్తులను తిరుమలకు తరలించి వైకుంఠం-2లో పెట్టి దర్శనం చేయించాలని సూచించినట్లు వెల్లడించారు. అరగంటలోనే క్యూలైన్ల నుంచి భక్తులను తరలించినట్లు వెల్లడించారు. ఇకపై టోకెన్లు లేకుండా నేరుగా శ్రీవారి సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తామన్నారు. బుధవారం తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు.
9, 10, 11 తేదీల్లో రద్దీ దృష్ట్యా 8వ తేదీనే టోకెన్లు జారీ చేశాం. మూడు రోజులు ఇచ్చినందున కౌంటర్లు మూసేశాం. తిరిగి మంగళవారం రోజున బుధ, గురు, శుక్రవారాలకు లక్ష టోకెన్లు ఇవ్వాలనుకున్నాం. శనివారం టోకెన్లు దొరకని కొందరు తిరుపతిలోనే ఉండిపోయారు. నాలుగు రోజులు సెలవులుండటంతో మరికొందరు వచ్చారు. మొత్తం మూడు ప్రదేశాల్లో 20వేల మంది ఉన్నారు. శ్రీనివాసంలో రెండు లైన్లున్నాయి. ఒక లైను నుంచి టోకెన్ తీసుకుని మరోలైను నుంచి బయటకు రావాలి. భక్తులు బయటకు వెళ్లే లైన్లోకి ప్రవేశించి టోకెన్ ఇవ్వాలన్నారు. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేదు. అందరినీ తీసుకొస్తే 12 కంపార్ట్మెంట్లలోనే ఉన్నారు. మంగళవారం ఉక్కపోతకు 15-20 నిమిషాలు ఇబ్బందిపడి ఉంటారు. పాత పద్ధతిలో సర్వదర్శనాన్ని అమలుచేస్తే.. 20, 30, 40 గంటలు ఇబ్బంది పడాలి. ముందస్తు ఏర్పాట్లు చేయకుంటే భక్తులను ఇలా తరలించి దర్శనం చేయించే ఏర్పాట్లు జరిగేవా? మంగళవారం మధ్యాహ్నం నుంచి వచ్చినవాళ్లలో 35వేల మందికి ఎస్ఎస్డీ దర్శనం చేయించాం. టైమ్స్లాట్ టోకెన్ ద్వారా ఎప్పుడు దర్శనం ఉంటుందో తెలుస్తుంది. గతంలో ఒకోసారి దర్శనానికి 72 గంటలూ పట్టేది. అంతవరకూ క్యూ/కంపార్ట్మెంట్లలో ఉండాలి. భక్తులకు మరింత మేలు చేయాలన్న ఉద్దేశంతో ఈ వ్యవస్థను పటిష్ఠం చేయాలని ప్రయత్నించాం. భక్తులకు స్వామివారిని దూరం చేశామనడం తప్పు. ప్రస్తుతం వీఐపీ బ్రేక్లను రద్దుచేశాం. వ్యక్తిగతంగా వచ్చే ప్రముఖులకే ఇస్తున్నాం. బుధవారం గంటన్నరలోనే వీఐపీ బ్రేక్ పూర్తిచేశాం. శ్రీవారి మెట్టుమార్గాన్ని ఈ నెల 30న ప్రారంభిస్తాం’ అని ధర్మారెడ్డి చెప్పారు.
30 కంపార్ట్మెంట్లలో భక్తులు
తిరుమల, న్యూస్టుడే: శ్రీవారి దర్శనానికి తితిదే సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులను అనుమతిస్తుండడంతో పెద్దఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు సర్వదర్శనం టోకెన్లు లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వచ్చిన దాదాపు 15వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. యాత్రికుల సంఖ్య మేరకు 15 నుంచి 20 గంటల సమయం దర్శనం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం తిరుమలలో సర్వదర్శనం క్యూలైన్లను లేపాక్షి కూడలి నుంచి తిరుమల లగేజీ కౌంటర్ వరకు పొడిగించారు. లేపాక్షి కూడలి నుంచి సర్వదర్శనం క్యూలైన్లలోకి భక్తులను అనుమతిస్తున్నారు. భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలను తితిదే అన్నప్రసాద విభాగం అందిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు