Bandi Sanjay: గడీలు బద్దలు కొడతాం
రాష్ట్రంలో కేసీఆర్ పాలనను అంతమొందించడానికే మలి దశ పాదయాత్ర ప్రారంభించినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. ఈ యాత్ర ద్వారా గడీలను బద్దలు కొట్టుడే అంటూ నినదించారు. ప్రజలు అండగా ఉండి
అంబేడ్కర్ జయంతి రోజు సీఎం బయటకు కూడా రాలేదు
హిందూ దీక్షలపై రాష్ట్రంలో వివక్ష
ప్రజాసంగ్రామ యాత్ర బహిరంగసభలో బండి సంజయ్
మహబూబ్నగర్, ఈనాడు డిజిటల్: రాష్ట్రంలో కేసీఆర్ పాలనను అంతమొందించడానికే మలి దశ పాదయాత్ర ప్రారంభించినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. ఈ యాత్ర ద్వారా గడీలను బద్దలు కొట్టుడే అంటూ నినదించారు. ప్రజలు అండగా ఉండి యాత్రను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నుంచి గురువారం ప్రారంభమైంది. ఇమామ్పూర్ వరకు నాలుగు కిలోమీటర్లు మొదటి రోజు యాత్ర నిర్వహించారు. అంతకు ముందు అలంపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సంజయ్ మాట్లాడారు. యాత్రలో ప్రజాసమస్యలు తెలుసుకొని భరోసా ఇవ్వడంతో పాటు నరేంద్రమోదీ పథకాలను వివరిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో చెబుతామన్నారు. వరి కొనబోమన్న సీఎంతోనే ధాన్యం కొనిపిస్తున్న ఘనత భాజపాదే అన్నారు. మిర్చి రైతులు తెగుళ్లతో ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటి వరకు నష్టపోయిన రైతు కుటుంబాలకు ఒక్క పైసా అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. అంబేడ్కర్ జయంతి రోజు ముఖ్యమంత్రి కనీసం బయటకు కూడా రాలేదన్నారు. జోగులాంబ ఆలయం ఎంతో శక్తిమంతమైందని.. దీన్ని ఎందుకు పునరుద్ధరించట్లేదని ప్రశ్నించారు. దసరా ఉత్సవాలను ఆలయంలో ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మవారికి ఉత్సవాలు ఘనంగా జరుపుతామన్నారు. బుధవారం కోర్టు కొట్టివేసిన ఎంఐఎం కేసును భాజపా అధికారంలోకి రాగానే తిరగదోడతామన్నారు.
హిందూ దీక్షలకు సమయం ఇవ్వరా..?
రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులు నమాజు చేసుకోవడానికి వెసులుబాటు ఇస్తూ జీవో ఇచ్చిందని, దానిని తాను వ్యతిరేకించడం లేదని.. అయ్యప్ప, హనుమ, శివ భక్తులు భిక్షకు వెళ్లడానికి, పూజ చేసుకోవడానికి ఎందుకు సమయం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. భాజపా అధికారంలోకి వస్తే ప్రత్యేక జీవోలు తీసుకొచ్చి హిందూ భక్తులకు వెసులుబాటు కల్పిస్తామన్నారు. 2014 కంటే ముందు జోగులాంబలో పాదయాత్ర చేసిన కేసీఆర్ ఆర్డీఎస్ను ఆధునికీకరిస్తానని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా యాత్ర : తరుణ్ఛుగ్
కేసీఆర్ మూగ, చెవిటి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా మహా సంగ్రామయాత్రను ప్రారంభించామని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ఛుగ్ అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజానీకం భాజపా వైపు చూస్తోందన్నారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాబోయే కాలంలో భాజపాదే భవిష్యత్తన్నారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. తెరాస అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తయినా పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం సీఎం నిర్లక్ష్యానికి అద్దం పడుతుందన్నారు. భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఈ ప్రజా సంగ్రామ యాత్ర తెరాసకు సమాధి కట్టబోయే యాత్రగా మారుతుందన్నారు. మాజీ ఎంపీలు విజయశాంతి, వివేక్, జితేందర్రెడ్డి తదితరులు మాట్లాడారు.
జోగులాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సాయంత్రం 5 గంటలకు అలంపూర్లోని జోగులాంబ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అధికారులు, పూజారులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి కాన్వాయ్గా బహిరంగ సభ వేదికకు వచ్చిన సంజయ్ అక్కడ అంబేడ్కర్కు నివాళి అర్పించారు. బహిరంగ సభ అనంతరం పాదయాత్ర ప్రారంభించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం