KTR: దళితబంధు మేమిస్తున్నాం.. మిగతా వారికి కేంద్రం ఇవ్వాలి
రాజ్యాంగబద్ధమైన సంస్థలను కేంద్రం ఆధీనంలో పెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులపైకి ఉసిగొల్పుతోందని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. దళిత బంధు తాము అమలు చేస్తున్నామని మిగతా వారికి
సిరిసిల్ల అంబేడ్కర్ జయంత్యుత్సవాల్లో మంత్రి కేటీఆర్ డిమాండ్
జిల్లాలో నాలుగుచోట్ల బాబాసాహెబ్ విగ్రహాల ఆవిష్కరణ
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల: రాజ్యాంగబద్ధమైన సంస్థలను కేంద్రం ఆధీనంలో పెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులపైకి ఉసిగొల్పుతోందని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. దళిత బంధు తాము అమలు చేస్తున్నామని మిగతా వారికి కేంద్రం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ఎస్సీలలోనే కాదని, మిగతా వర్గాల్లోనూ పేదలున్నారని, వారందరికీ దళితబంధు వర్తింపజేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లవుతోంది. మాది చిన్న ప్రభుత్వం. ఇక్కడ దశల వారీగా దళితబంధు అమలు చేస్తున్నాం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మిగతా సామాజిక వర్గాలకు ఇలాంటి పథకం అమలు చేయాలి. ప్రతిపక్షాలు కూడా ఇదే కోరాలి’’ అని అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తంగళ్లపల్లి మండలం సారంపల్లి, మల్లాపూర్, అంకుసాపూర్, లక్ష్మీపూర్లలో ఆయన విగ్రహాలను ఆవిష్కరించారు. తంగళ్లపల్లిలో రూ.50 లక్షలతో నిర్మించే అంబేడ్కర్ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. తర్వాత సిరిసిల్ల పట్టణంలో రూ.2.50 కోట్లతో నిర్మించిన అంబేడ్కర్ భవనాన్ని ప్రారంభించారు. ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడే దళిత బంధు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి.. వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
ఉన్నవి రెండే కులాలు...
ప్రపంచంలో పైసలున్నోడు.. లేనోడు అనే రెండే కులాలున్నాయని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుందని, వాటిని అందిపుచ్చుకొని ముందుకెళ్లే నైపుణ్యం మనమే కల్పించుకోవాలని సూచించారు.
నా మిత్రుని కులం తెలియదు
‘‘నేను నిజాం కాలేజీలో చదువుతున్నప్పుడు ఇద్దరు మిత్రులున్నారు. ఒకరు జాక్సన్. క్రిస్మస్ పండుగకు వారింటికి వెళ్తూండటంతో అతను క్రిస్టియన్ అని తెలిసింది. సుమిత్ అనే మరో స్నేహితుడు ఒక రోజు నా వద్దకు వచ్చి ‘మా అక్క ఆర్టీసీలో ఉద్యోగానికి దరఖాస్తు చేసింది. మీనాన్నతో చెప్పాల’ని కోరాడు. అప్పుడు మా నాన్న రవాణాశాఖ మంత్రి. మానాన్న విషయం పీఏకు చెప్పారు. కొద్దిసేపటికి పీఏ వచ్చి అది రిజర్వు కోటాలోని పోస్టు అని చెప్పారు. అప్పుడు ఫోన్ చేసి అడిగితే మేం ఎస్సీలమని సుమిత్ చెప్పాడు. అప్పటి వరకు వాళ్ల కులం ఏమిటో నాకు తెలియదు’’ అని కేటీఆర్ వివరించారు. సుమిత్ది జగిత్యాల జిల్లా కాగా, జాన్సన్ అమెరికాలో ఐటీ కన్సల్టెంట్గా పని చేస్తూ వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారని తెలిపారు.
జరిగిన అభివృద్ధిని కూడా చెప్పాలి
ఐదేళ్ల క్రితం అంబేడ్కర్ జయంత్యుత్సవాలకు వచ్చినపుడు సిరిసిల్ల పట్టణంలో నన్ను ఐదు గంటలు కూర్చోబెట్టి సమస్యల గురించి ప్రస్తావించారు. ఇప్పుడూ అలాగే మాట్లాడుతున్నారు. ఉపన్యాసాలు చెప్పేవారు జరిగిన అభివృద్ధిని కూడా ప్రస్తావించాలి. పదేళ్ల క్రితం సిరిసిల్ల ఎలా ఉంది? ఇప్పుడు ఎలాఉందో ఒకసారి గుర్తుచేసుకుని మాట్లాడాలి. రాజకీయంగా వైరుధ్యాలు ఉండవచ్చు కానీ మంచి పనులు చేసినపుడు గుర్తుచేయాలి’’ అని కోరారు.
కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది: మంత్రి గంగుల
కరీంనగర్ సంక్షేమ విభాగం, న్యూస్టుడే: భూమ్మీద గాలి, నీరు ఉన్నంతకాలం ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు గుర్తుంటుందని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా గురువారం కరీంనగర్లోని అంబేడ్కర్ క్రీడా మైదానంలో జరిగిన కార్యక్రమంలో రూ.94.84 కోట్లతో కొనుగోలు చేసిన 769 వాహనాలను 1,041 మంది లబ్ధిదారులకు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!