Andhra News: కాళరాత్రి
ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం గ్రామంలోని పోరస్ కెమికల్స్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి 10.45 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు ఆసుపత్రికి
ఏలూరు జిల్లాలోని పోరస్ కెమికల్స్లో భారీ అగ్ని ప్రమాదం
పెద్ద శబ్దంతో పేలిన రియాక్టర్
ఆరుగురి మృతి..
మృతుల్లో నలుగురు బిహారీలు.. ఇద్దరు తెలుగువారు
మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం
ఈనాడు డిజిటల్, ఏలూరు న్యూస్టుడే: ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం గ్రామంలోని పోరస్ కెమికల్స్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి 10.45 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మరో 12 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు బిహార్ రాష్ట్రానికి చెందినవారు కాగా.. ఇద్దరు తెలుగు వారు.
అక్కిరెడ్డిగూడెంలో నివాసం ఉంటున్న బిహార్కు చెందిన మనోజ్కుమార్ (25), అభిదేశ్ రవిదాస్ (27), కారు రవిదాస్ (40), సుభాష్ రవిదాస్ (32), కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం కుదపకు చెందిన కెమిస్ట్ కృష్ణయ్య (36) అక్కడికక్కడే మృతి చెందారు. అక్కిరెడ్డిగూడేనికి చెందిన బొప్పిడి కిరణ్కుమార్(30) ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరణించారు.
వెంటిలేటర్పై ఏడుగురు..
గాయపడినవారికి గొల్లపూడి ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిలో తీవ్రగాయాలైన ఏడుగురికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తుండగా మిగిలినవారికి ఐసీయూలో చికిత్స చేస్తున్నారు. మూడు, నాలుగు రోజుల పరిశీలన తర్వాతే వారి పరిస్థితి ఏమిటనేది తెలుస్తుందని ఆంధ్రా ఆసుపత్రి వైద్యులు రవీంద్రనాథ్ తెలిపారు.
ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత..
గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపించింది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించగా, శాశ్వతంగా మూసేయాలంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.ఎంపీ కోటగిరి శ్రీధర్, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఫ్యాక్టరీని సందర్శించారు. ఘటనపై విచారణ కమిటీని నియమిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.
పేలుడా.. లీకేజీనా?..
ఫ్యాక్టరీలో 4 ఎంపీఐ అనే ఓ పౌడర్ తయారవుతుంది. దానిని మరో ప్రాంతానికి తరలించి అక్కడ పాలిమర్ బాల్స్ తయారు చేస్తారు. ఇందుకు బాగా మండే స్వభావమున్న మోనోమిథైల్ అమైన్ అనే గ్యాస్ను ఉపయోగిస్తారు. సిబ్బంది తప్పిదం కారణంగా గ్యాస్ లీకై.. ఆ వేడికి మంటలు రేగి ప్రమాదం సంభవించిందనేది ఓ వాదన. రెండో ఫ్లోర్లోని రియాక్టర్ పేలి.. దానివల్ల భారీగా మంటలు చెలరేగాయనే మరో వాదన వినిపిస్తోంది. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా కేసు నమోదు చేసుకున్నారు. ఫ్యాక్టరీలో అయిదు బ్లాక్లు ఉండగా ప్రస్తుతం మూడే పనిచేస్తున్నాయి. డీ బ్లాక్లోని రెండో ఫ్లోర్లో పేలుడు జరిగిందని చెబుతున్నారు. ఆ బ్లాక్లో పనిచేస్తున్న వారంతా గాయపడ్డారు. కొందరు గోడ దూకి మంటలతోనే తోటల్లోకి పరుగులు తీశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పై ఫ్లోర్లో పనిచేస్తున్న వారిలో అయిదుగురు అక్కడికక్కడే చనిపోయినట్లు తెలుస్తోంది.
పోరస్ ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చనిపోయినవారి కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, స్వల్ప గాయాలైనవారికి రూ.2 లక్షల చొప్పున సాయం అందించనున్నట్లు వెల్లడించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.కంపెనీ తరపున మరో రూ.25 లక్షలు మృతుల కుటుంబాలకు ఇచ్చేలా వారితో మాట్లాడినట్లు బాధితులను పరామర్శించిన అనంతరం హోంమంత్రి తానేటి వనిత వెల్లడించారు. అక్కిరెడ్డిగూడెం దుర్ఘటనలో నలుగురు బిహారీలు మృతి చెందడంపై బిహార్ ముఖ్యమంత్రి నీతీష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు ఒక్కొక్కరి కుటుంబానికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ