Crime News: కామారెడ్డిలో తల్లీకుమారుడి ఆత్మాహుతి
రాజకీయ నేతల వేధింపులకు.. చేష్టలుడిగిన పోలీసుల వైఖరికి విసిగివేసారి తల్లీకొడుకులు ఆత్మాహుతి చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జిలో శనివారం తెల్లవారుజామున మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి
మా మరణానికి ఆ ఏడుగురే కారణమని లేఖ, వీడియోలలో వెల్లడి
రామాయంపేట మున్సిపల్ ఛైర్మన్ జితేందర్గౌడ్, సీఐ నాగార్జునగౌడ్ సహా పలువురి పేర్ల ప్రస్తావన
ఏడాదిగా బ్లాక్మెయిల్, మా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డంకులతో అప్పులపాలయ్యామని ఆవేదన
అందరూ చూస్తుండగా వారిని శిక్షించాలని సీఎం కేసీఆర్కు విన్నపం
లాడ్జి గదిలో నిప్పంటించుకుని తల్లి, కుమారుడి ఆత్మహత్య
ఈనాడు డిజిటల్, కామారెడ్డి; న్యూస్టుడే, కామారెడ్డి అర్బన్: రాజకీయ నేతల వేధింపులకు.. చేష్టలుడిగిన పోలీసుల వైఖరికి విసిగివేసారి తల్లీకొడుకులు ఆత్మాహుతి చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జిలో శనివారం తెల్లవారుజామున మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి గంగం సంతోష్(41), ఆయన తల్లి పద్మ(68) ఆత్మాహుతి చేసుకున్నారు. తమ చావుకు రామాయంపేట పట్టణానికి చెందిన పల్లె జితేందర్గౌడ్ (పురపాలక సంఘం అధ్యక్షుడు), ఐరేని పృథ్వీరాజ్ అలియాస్ బాలు, సరాబ్ యాదగిరి (మార్కెట్ కమిటీ ఛైర్మన్), తోట కిరణ్, కన్నాపురం కృష్ణాగౌడ్, సరాబ్ స్వరాజ్ (యాదగిరి కుమారుడు), తాండూరి నాగార్జునగౌడ్ (ప్రస్తుతం తుంగతుర్తి సీఐ) కారణమంటూ ఫేస్బుక్లో వేర్వేరుగా సందేశాలు పెట్టి ప్రాణాలొదిలారు. ‘మా చావుకు కారణమైన వారిని అందరూ చూస్తుండగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి శిక్షించాలి’ అని వేడుకున్నారు.
అధికార పార్టీ నాయకులు కావడంతో ఎవరూ పట్టించుకోలేదు
‘‘ఏడాదిన్నర కాలంగా నిత్య నరకం చూపిస్తున్నారు. వారంతా అధికార పార్టీ నాయకులు కావడంతో ఎవరూ పట్టించుకోలేదు. స్థానిక పోలీసుస్టేషన్తో ప్రారంభించి డీఎస్పీ, ఎస్పీ, డీఐజీ, ఐజీ, కలెక్టర్, డీజీపీలతో పాటు సీఎంవో కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేసినా న్యాయం జరుగలేదు. మరణమే శరణమనుకున్నాం’’ అని వివరిస్తూ సంతోష్ ఐదు పేజీల లేఖను రామాయంపేటలోని ఇంట్లో ఉంచారు. దానినే చనిపోయే ముందు వాట్సప్లో మిత్రులు, కుటుంబసభ్యులకు పంపారు. లేఖలోని అంశాలనే ఆడియోలో వివరించారు. ఫేస్బుక్లో వీడియో ద్వారా తెలియజేశారు. ఆధారాలను రామాయంపేట మున్సిపల్ ఛైర్మన్ జితేందర్గౌడ్ మాయం చేస్తాడనే ఇన్ని మార్గాల్లో విషయాన్ని వివరిస్తున్నట్టు సంతోష్ వాటిల్లో వివరించారు.
ఆత్మహత్య చేసుకుంటున్నామని 15న సోదరుడికి ఫోన్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామాయంపేటకు చెందిన గంగం సంతోష్ అవివాహితుడు. తల్లిదండ్రులు పద్మ, అంజయ్యతోపాటు ఇద్దరు సోదరులు, సోదరి ఉన్నారు. ఈ నెల 11న సంతోష్.. తండ్రికి కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించి ఇంటికి పంపించారు. అనంతరం తల్లి పద్మతో కలిసి కొత్త బస్టాండు సమీపంలోని మహారాజా లాడ్జిలో బస చేశారు. రామారెడ్డిలోని కాలభైరవస్వామి దర్శనం చేసుకుని వస్తామని చెప్పారు. తరువాత ఐదు రోజులు లాడ్జిలో ఉన్నారు. కుటుంబ సభ్యులకు మాత్రం ఆలయంలోనే బస చేసినట్లు చెప్పారు. శుక్రవారం(ఈ నెల 15న) రాత్రి పది గంటల సమయంలో సంతోష్.. సోదరుడు శ్రీధర్కు ఫోన్ చేసి ‘నేను, అమ్మ ఆత్మహత్య చేసుకుంటున్నాం’ అని చెప్పారు. గతంలోనూ ఇలాగే ఒకసారి చెప్పడంతో తేలికగా తీసుకున్న శ్రీధర్ ఎవరికీ చెప్పకుండా వదిలేశారు. కానీ శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు లాడ్జి గదిలోనే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మాహుతికి పాల్పడ్డారు. మృతుడి సోదరుడు శ్రీధర్ ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు కామారెడ్డి పట్టణ సీఐ నరేష్ తెలిపారు. సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశామని విచారణాధికారిగా బాన్సువాడ డీఎస్పీ జైపాల్రెడ్డికి బాధ్యతలు అప్పగించామని కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
జితేందర్ ఇంటి వద్ద మృతదేహాలతో నిరసన
రామాయంపేట, న్యూస్టుడే: పోస్టుమార్టం అనంతరం సంతోష్, ఆయన తల్లి పద్మ మృతదేహాలను మున్సిపల్ ఛైర్మన్ జితేందర్గౌడ్ ఇంటికి తరలించేందుకు భాజపా, కాంగ్రెస్ వారితో పాటు మృతుడి కుటుంబసభ్యులు, స్థానిక యువకులు ప్రదర్శనగా బయలుదేరినప్పుడు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారి మధ్య తీవ్ర వాగాద్వం, తోపులాట జరిగింది. ఆ సమయంలో జితేందర్ ఇంట్లో లేడు. పరిస్థితులు అదుపు తప్పుతున్న నేపథ్యంలో మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఘటనా స్థలానికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నిందితులను అరెస్టు చేయాలని ఆందోళనకారులు ఎస్పీని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారని మృతుడి సోదరుడు శ్రీధర్ చెప్పడంతో జనం కాస్త శాంతించారు. అంతకుముందు పట్టణంలోని దుకాణాలను భాజపా, కాంగ్రెస్ నాయకులు మూసివేయించారు.
ఇదీ నేపథ్యం...
‘బాల్యమిత్రుడైన బాసం శ్రీనివాస్తో కలిసి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశా. అతని వద్ద డబ్బులు లేకపోవడంతో మున్సిపల్ ఛైర్మన్ జితేందర్గౌడ్ సాయం చేశారు. ఆయన 50శాతం వాటా కావాలని అడగ్గా కుదరదని చెప్పాం. ఓ వ్యక్తి ఫేస్బుక్లో పిల్ల జమిందార్ అని ఏదో పోస్టు పెడితే జితేందర్గౌడ్ మిత్రబృందం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ నాగార్జునగౌడ్ నన్ను ఠాణాకు పిలిచారు. నా ఫోన్ని తిరిగివ్వకుండా పది రోజులు ఉంచుకున్నారు. మరుసటి రోజు మెదక్ ఎస్పీకి ఫిర్యాదు చేశా. సీఐ నాగార్జునగౌడ్ నా ఫోన్లో ఉన్న వ్యక్తిగత డేటాను దొంగిలించి జితేందర్గౌడ్ మిత్రబృందానికి ఇచ్చారు. వారు దాన్ని అడ్డం పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. ఈ విషయంపైనా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశా. ఏడాది పాటు ఇదే విధంగా ఇబ్బంది పెడుతూ నా వ్యాపారం సాగనీయకుండా చేశారు. దీంతో అప్పుల పాలయ్యా. ఇంతటితో ఆగకుండా జితేందర్ మనుషులు నా కుటుంబసభ్యులను సైతం ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు. శ్రీనివాస్ చిన్ననాటి మిత్రుడు కావడంతో అన్ని విషయాలు పంచుకునేవాడిని. కొన్ని రోజుల క్రితం జితేందర్గౌడ్ అయ్యప్పమాల వేసుకుంటూ శ్రీనివాస్తోనూ వేయించారు. అప్పటి నుంచి అతనితోనే అంట కాగుతూ నన్ను దగా చేశాడు’ అంటూ ఆడియోలో సంతోష్ పేర్కొన్నారు. ఈ ఆడియోలోని సారాంశాన్ని మరణ వాంగ్మూలంగా భావించాలని కోరారు. ‘‘మా వాడితో మంచిగా ఉండే జితేందరే అంతా చేయిస్తుండు. మా కుటుంబానికి పెట్టిన కష్టాలే వారూ అనుభవించేలా చూడాలి. ఆ ఏడుగురిని అందరూ చూస్తుండగా శిక్షించాలి’’ అని సంతోష్ తల్లి పద్మ వీడియోలో విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్