EPF Pension కమిటీలతో కాలయాపన
ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) కనీస పింఛను పెంపు కోసం దాదాపు 40 లక్షల మంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. అయిదేళ్లుగా రూ.వెయ్యిగా ఉన్న ఈ మొత్తాన్ని పెంచేందుకు ఈపీఎఫ్వో ట్రస్టీబోర్డు కమిటీల మీద కమిటీలు...
కనీస పింఛను ఎప్పటికి పెరుగుతుందో..
తాజాగా నిపుణుల కమిటీ ఏర్పాటు
ఈపీఎఫ్వో నిర్ణయం కోసం 40 లక్షల మంది ఎదురుచూపు
ఈనాడు, హైదరాబాద్: ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) కనీస పింఛను పెంపు కోసం దాదాపు 40 లక్షల మంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. అయిదేళ్లుగా రూ.వెయ్యిగా ఉన్న ఈ మొత్తాన్ని పెంచేందుకు ఈపీఎఫ్వో ట్రస్టీబోర్డు కమిటీల మీద కమిటీలు వేయడం తప్ప స్పష్టమైన నిర్ణయం వెలువరించడం లేదు. ఇప్పటికే రెండు కమిటీలు నివేదికలు ఇవ్వగా.. మూడు నెలల క్రితం పింఛను సంస్కరణల పేరిట ఏర్పాటు చేసిన అడ్హక్ కమిటీ మరో నివేదిక ఇచ్చింది. దీనిపై లోతైన అధ్యయనం చేయాలని కోరుతూ పింఛను నిధి నియంత్రణ సంస్థ (పీఎఫ్ఆర్డీఏ), ఎల్ఐసీ, వీవీగిరి కార్మిక శిక్షణ కేంద్రంతో పాటు మరో ఇద్దరు పెట్టుబడుల అధికారులతో టాస్క్ఫోర్స్ కమిటీని ఈపీఎఫ్వో ట్రస్టీబోర్డు ఏర్పాటు చేసింది. అడ్హక్ కమిటీ నివేదికను పరిశీలించి, కనీస పింఛను ఏ మేరకు పెంచేందుకు అవకాశాలున్నాయో పేర్కొంటూ అవసరమైన మార్గదర్శకాలు సూచించాలని కోరింది.
74 శాతం మందికి రూ.2 వేల లోపు
2014లో కనీస పింఛను రూ.1000 అమల్లోకి వచ్చేవరకు.. కొందరికి ఏళ్లుగా రూ.100లోపే వచ్చేది. ప్రస్తుతం రూ.2 వేల లోపు పొందుతున్న పింఛనుదారులు 74 శాతం ఉన్నారు. ఇది పలు రాష్ట్రాల్లో ఇచ్చే వృద్ధాప్య సహా ఇతర సామాజిక భద్రత పింఛన్ల సొమ్ముకన్నా తక్కువే. దీంతో పింఛను కనీస మొత్తాన్ని పెంచాలని కార్మిక సంఘాలు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. అసంఘటిత కార్మికుల పింఛనును రూ.3 వేలుగా నిర్ణయించడంతో ఆ మేరకు వేతన జీవులకు అవకాశమివ్వాలని కోరాయి. దీంతో అడ్హక్ కమిటీని ఈపీఎఫ్వో ఏర్పాటు చేసింది. గతంలో రెండు ఉన్నతస్థాయి కమిటీలు కనీస పింఛను రూ.2 వేలు, రూ.3 వేలుగా ఖరారు చేసేందుకు సాధ్యాసాధ్యాలపై నివేదికలు ఇచ్చాయి. రెండేళ్ల క్రితం ఏర్పాటైన కమిటీ కనీస పింఛను రూ.2 వేలు చేస్తే రూ.5,955 కోట్ల అదనపు భారం ఉంటుందని, 40 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని వెల్లడించింది.
అడ్హక్ కమిటీ ఏం చెప్పిందంటే...
ఈపీఎఫ్ కనీస పింఛను పెంచేందుకు తీసుకురావాల్సిన సంస్కరణలపై అడ్హక్ కమిటీ ఏడుసార్లు సమావేశమై పలు విషయాలను అధ్యయనం చేసింది. ఈ సిఫార్సులను పరిశీలించిన కార్మిక సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు కొన్ని సూచనలు చేశారు. వీటిపై భిన్నాభిప్రాయాల నేపథ్యంలో ట్రస్టీబోర్డు తాజాగా టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. అడ్హక్ కమిటీ నివేదికలో.. పింఛను చెల్లింపులకు వినియోగించే ఈపీఎస్ నిధి సుస్థిరత దెబ్బతినకుండా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ‘‘ప్రస్తుతం పదేళ్లు ఈపీఎఫ్ చందాదారుడిగా సర్వీసు ఉంటే పింఛను పొందేందుకు అర్హులు. ఈ కాలపరిమితిని 15 ఏళ్లకు పెంచితే పింఛను సదుపాయాలు 33 శాతం పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ మేరకు ఈపీఎఫ్ చట్ట సవరణలు, ప్రభుత్వ వాటా చెల్లింపు, ఈపీఎస్ నిధులను వివిధ మార్గాల్లో పెట్టుబడులుగా పెట్టడం తదితర మార్గాలను అన్వేషించాలి. రూ.3 వేల కనీస పింఛను కోసం 15 ఏళ్ల సర్వీసుతో పాటు పింఛను నిధిలో కనీసం రూ.5.4 లక్షల నిల్వలు ఉండాలి. అధిక పొదుపు మేరకు పింఛను చెల్లింపు విషయాన్ని పరిశీలించాలి’’ అని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్