BJP: యాత్రలో ఉద్రిక్తత
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. సోమవారం జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం వేములలో అంబేడ్కర్ కాంస్య విగ్రహానికి సంజయ్
సంజయ్ పాదయాత్రలో నిరసనకు తెరాస కార్యకర్తల యత్నం
గ్యాస్, పెట్రో ధరలు తగ్గించాలంటూ నినాదాలు
ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు
యాత్ర చేసి తీరుతాం: సంజయ్
ఈనాడు డిజిటల్-మహబూబ్నగర్, న్యూస్టుడే-ఇటిక్యాల, ఉండవల్లి, మానవపాడు: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. సోమవారం జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం వేములలో అంబేడ్కర్ కాంస్య విగ్రహానికి సంజయ్ పూలమాల వేసి, భాజపా జెండాను ఆవిష్కరించారు. ‘జనం గోస- భాజపా భరోసా’ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అనంతరం పాదయాత్రను తిరిగి కొనసాగిస్తుండగా.. వేముల ఉన్నత పాఠశాల వద్ద కొందరు తెరాస కార్యకర్తలు యాత్రకు నిరసన తెలిపే యత్నం చేశారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలంటూ వారు నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. తెరాస కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టి అక్కడి నుంచి పంపించివేశారు. బట్లదిన్నె గ్రామ క్రాస్రోడ్డు వద్ద తెరాస కార్యకర్తలు మరోసారి నిరసన తెలిపేందుకు యత్నించారు. ఈ సందర్భంగా భాజపా, తెరాస కార్యకర్తలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడికి యత్నించారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తమ పార్టీ శ్రేణులకు సర్దిచెప్పి వెనక్కి పంపించారు. అప్పటికే కొందరు దాడులు చేసుకోవడంతో అయిజ మండలానికి చెందిన తెరాస కార్యకర్త అంజి తలకు గాయం కాగా, ఇరు పార్టీలకు చెందిన కొందరు నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి. భాజపాకు చెందిన అయిదు, తెరాసకు చెందిన ఒక వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. వేముల గ్రామంలో భాజపా ఫ్లెక్సీలను తెరాస కార్యకర్తలు తొలగించి దహనం చేశారు. గ్రామంలో బైఠాయించి పెట్రోల్, డీజిల్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు భాజపా నేతలు సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేయగా.. మరోవైపు డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని తెరాస నేతలు నినదించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్రతన్కుమార్, అదనపు ఎస్పీ రాములునాయక్, డీఎస్పీ రంగస్వామి పాదయాత్ర శిబిరాన్ని సందర్శించారు. పాదయాత్రకు బందోబస్తు పెంచారు.
స్పందన ఓర్వలేకనే దాడులు: డీకే అరుణ
యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటం ఓర్వలేకనే తెరాస నేతలు దాడులు చేస్తున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. రౌడీషీటర్లు, ఇసుక, మైనింగ్ మాఫియాను రెచ్చగొట్టి యాత్రను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. బట్లదిన్నె శివారులోని పాదయాత్ర శిబిరం వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. యాత్రను అడ్డుకునేందుకు యత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.
ప్రజల్లోకి వస్తే దాడులు చేస్తారా: ఈటల
బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రపై దాడిని ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు అవాంఛనీయమన్నారు. సీఎం ఎలాగూ ఫాంహౌస్ దాటి బయటికి రారని, ప్రతిపక్ష నాయకులు సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల్లోకి వస్తే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
సమస్యలు విన్నవిస్తే దౌర్జన్యం చేస్తారా? - అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం
ప్రజలు సమస్యలను విన్నవిస్తే దౌర్జన్యంగా కొట్టడం అమానుషమని, ప్రశాంతంగా ఉన్న నడిగడ్డలో హింసను ప్రేరేపించేలా దాడి చేయడం ఏమిటని అలంపూర్ ఎమ్మెల్యే డా.అబ్రహాం ప్రశ్నించారు. సోమవారం ఆయన మాట్లాడారు. ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమై అయిదు రోజులైందని.. నాలుగు రోజుల్లో చాలామంది ప్రజలు తమ కష్టాలను చెప్పుకొనేందుకు వస్తే వారిని నెట్టేసి బెదిరించారన్నారు. వేముల గ్రామంలో చాలామంది ప్రజలు, తెరాస కార్యకర్తలు తమ సమస్యలు వివరించడానికి.. నిత్యావసరాలు, వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని బండి సంజయ్ దృష్టికి తీసుకొస్తే అమానుషంగా దాడి చేశారని ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్ర అంటే ప్రజలపై యుద్ధం చేయడమా అని ప్రశ్నించారు. వారి వాహనాలను వారే ధ్వంసం చేసుకుని తెరాస నాయకులపై నెట్టేశారన్నారు. కులమతాల మధ్య చిచ్చు రేపుతూ రాజకీయ లబ్ధి కోసం హింసను ప్రేరేపించడం సమంజసం కాదని పేర్కొన్నారు. బయట ప్రాంతాల నుంచి వచ్చిన గూండాలతో తిరుగుతున్న బండి సంజయ్ది ప్రజావంచన యాత్ర అని విమర్శించారు. అలంపూర్లో అభివృద్ధిని చూసి మాట్లాడాలని.. నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు.
దాడులకు భయపడం: సంజయ్
‘ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకొని, వాటి పరిష్కారం కోసం పోరాడటమే తప్పా? మాపై రాళ్ల దాడులు చేస్తారా’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. తెరాస నేతల బెదిరింపులకు, దాడులకు భయపడే ప్రసక్తే లేదని, బరాబర్ ప్రజా సంగ్రామ యాత్ర చేసి తీరుతామని స్పష్టంచేశారు. ఇటిక్యాల మండలం ఉదండాపూర్, వేముల గ్రామాల్లో ఆయన ప్రసంగించారు. సీఎం కేసీఆర్ పాదయాత్ర చేస్తానంటే తాము వద్దనడం లేదని.. ఆయన పాదయాత్ర చేసి ప్రజలకు తన ప్రభుత్వం చేసిన ఘనకార్యాలుంటే చెప్పుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో ప్రజలకు తెలియజేయడానికే యాత్ర చేపట్టామన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో కల్తీ పత్తి, మిర్చి విత్తనాలు, కల్తీ కల్లు, కల్తీ నాయకులు తప్ప ప్రజలకు ఏమీ దొరకదన్నారు. ఈ ప్రాంత పత్తి రైతులు నష్టపోతే శాస్త్రవేత్తలు పంటలను పరిశీలించి.. నకిలీ విత్తనాలే కారణమని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారన్నారు. ‘రైతులే తప్పు చేశారు. అధికంగా రసాయన మందులు వాడటం వల్ల పంట నష్టం జరిగిందని నివేదిక ఇవ్వాలని సీఎం సూచించారు’ అని సంజయ్ ఆరోపించారు. నకిలీ విత్తనాలను తెరాస నేతలే అమ్ముతున్నారని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు