CM KCR: జిల్లాల వారీగా పంటల ప్రణాళిక
రాష్ట్ర వ్యవసాయ రంగం బలోపేతానికి, జిల్లావారీ వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికలను తయారుచేయాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా సాగు విస్తీర్ణం ఉండేలా యంత్రాంగం దృష్టిసారించాలని, ముఖ్యంగా లాభదాయక పంటల సాగు
ఈ వానాకాలం నుంచే అమలు..
ఖరీఫ్ సాగుకు ఎరువులు, విత్తనాలు సిద్ధం చేయాలి
మరింత వేగవంతంగా ‘దళితబంధు’
సమీక్షలో సీఎం కేసీఆర్
వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న భారత దేశంలో ఆ రంగం అభివృద్ధికి పాటుపడాల్సిన కేంద్ర ప్రభుత్వం, దాన్ని కుదేలుచేసేలా తిరోగమన విధానాలు అవలంబిస్తోంది. దేశంలో పంటల దిగుబడిని పెంచే దిశగా కాకుండా, ఉత్పత్తిని తగ్గించేలా అపసవ్య విధానాలను అమలు చేస్తుండడం బాధాకరం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేస్తుంది. ఆ దిశగా వానాకాలం పంటల సాగుకు ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి, అధికారులకు సూచిస్తున్నా.
- సీఎం కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయ రంగం బలోపేతానికి, జిల్లావారీ వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికలను తయారుచేయాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా సాగు విస్తీర్ణం ఉండేలా యంత్రాంగం దృష్టిసారించాలని, ముఖ్యంగా లాభదాయక పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రణాళిక తయారీ, అమలులో జిల్లా కలెక్టర్లను, ఆర్డీఓలను కూడా భాగస్వాములను చేయాలని మార్గదర్శనం చేశారు. ఈ వానాకాలం నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలిచ్చారు. వానాకాలం పంటలకు సంబంధించి ఎరువులు, విత్తనాలు సహా వ్యవసాయశాఖ చేయాల్సిన ముందస్తు ఏర్పాట్లు, సన్నద్ధతపై ప్రగతి భవన్లో మంగళవారం సీఎం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పురోగతిపైనా అధికారులను ఆరాతీశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ‘‘క్రమం తప్పకుండా వరిసాగు చేయడం వల్ల భూసారం తగ్గిపోయే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పంట మార్పిడి విధానం అనుసరించేలా రైతులను చైతన్యపరచాలి. ఒకే పంటను సంవత్సరాల తరబడి వేయడం వల్ల నేల సహజ స్వభావం, భూసారం తగ్గుతుందనే విషయాన్ని రైతులకు చెప్పాలి.
లాభదాయక పంటల వైపు మళ్లించాలి
కరోనా అనంతర పరిస్థితులతో చైనా తదితర దేశాల్లో పత్తి దిగుబడి తగ్గిపోతోంది. ఈ క్రమంలో ప్రపంచ మార్కెట్లో తెలంగాణ పత్తికి గిరాకీ పెరుగుతోంది. క్వింటా పత్తి రూ.10 వేల నుంచి 13 వేలదాకా ధర పలుకుతోంది. రానున్న కాలంలో మరింతగా గిరాకీ పెరిగే అవకాశం ఉంది. ఈ సాగు దిశగా రైతులను మరింత ప్రోత్సహించాలి. మిరపకు కూడా ఊహించని రీతిలో క్వింటాకు రూ.42 వేలకు పైగా ధర పలకడం గొప్ప విషయం. మార్కెట్లో డిమాండ్ ఉన్నందున కందిసాగు వైపూ రైతులను ప్రోత్సహించాలి. పొద్దు తిరుగుడు సాగు విస్తీర్ణాన్ని పెంచాలి. మొత్తంగా లాభదాయక పంటల సాగుపై ప్రత్యేక ప్రణాళికలను సిద్ధంచేయాలి.
వ్యవసాయ శాఖ సిబ్బందికి జాబ్చార్ట్..
జిల్లాస్థాయి వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలి. గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న వ్యవసాయ విస్తరణాధికారులు నిరంతరం పొలాల్లో, గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు తగు సూచనలు అందించాలి. ఆ దిశగా వారికి అవగాహన పెంపొందించేందుకు అన్నిస్థాయుల్లో వ్యవసాయ అధికారులకు నిరంతరం శిక్షణ తరగతులను నిర్వహించేలా వ్యవసాయశాఖ మంత్రి చొరవ చూపాలి. వ్యవసాయాధికారుల బాధ్యతలు, విధుల నిర్వహణపై జాబ్చార్ట్ తయారుచేయాలి’’ అని సీఎం మార్గదర్శనం చేశారు. కల్తీ విత్తన తయారీదారుల మూలాలను గుర్తించి కట్టడి చేయాలని, అందుకోసం పోలీసు యంత్రాంగం సహకారం తీసుకోవాలని వ్యవసాయశాఖకు సీఎం సూచించారు. ఇప్పట్నుంచే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలన్నారు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా వున్న దేశంలో వ్యవసాయాభివృద్ధికి పాటుపడాల్సిన కేంద్ర ప్రభుత్వం, ఆ రంగాన్ని కుదేలుచేసేలా తిరోగమన విధానాలు అవలంబిస్తోందని ఓ సందర్భంలో సీఎం ఆరోపించారు. దేశంలో పంటల దిగుబడిని పెంచే దిశగా కాకుండా, ఉత్పత్తిని తగ్గించేలా అపసవ్య విధానాలను అమలు చేస్తుండడం బాధాకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని, అధికారులు అందుకు అనుగుణంగా పనిచేయాలన్నారు.
దళిత బంధుతో ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న దళితబంధు పథకాన్ని అర్హులైన లబ్ధిదారులకు మరింత వేగంగా అందించే చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టంచేశారు. రోజుకు 400 మందికి చొప్పున ఇప్పటివరకు 25,000 మంది అర్హులైన లబ్ధిదారులకు దళితబంధును అందించామని సీఎం కార్యదర్శి రాహుల్ బొజ్జా నివేదిక అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఏడాదికి రెండు లక్షల కుటుంబాలకు దళిత బంధు సాయం అందించేలా చూడాలని ఆదేశాలిచ్చారు. ఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలుచేసేందుకు త్వరలో జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ‘‘దళితబంధు అమలుతో ఊహించినదానికంటే మెరుగైన ఫలితాలు అందుతాయి. పథకం కోసం ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి సామాజిక పెట్టుబడిగా మారి వ్యాపార, వాణిజ్యాల పెంపుదలకు దోహదం చేస్తుంది. తద్వారా తిరిగి వచ్చే లాభాలు రాష్ట్ర జీఎస్డీపీని పెంపొందించడంలో దోహదపడతాయని’’ సీఎం అన్నారు. ఎరువుల దుకాణాలు వంటి ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చే ప్రతి విభాగంలో దళితులకు రిజర్వేషన్లు కల్పించి అవకాశాలు మెరుగుపరచాలని మార్గదర్శనం చేశారు. సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు.
* ధాన్యం సేకరణ పుంజుకుందని, గోనె సంచులు, హమాలీలు, రవాణా వాహనాలు, నిల్వ కేంద్రాలు తదితరాలు సమకూర్చుకున్నామని ధాన్యం సేకరణపై జరిగిన సమీక్షలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్కుమార్ సీఎంకు వివరించారు.
మోతాదుకు మించి ఎరువులు వాడొద్దు
విపరీతమైన ఎరువులు, పురుగుమందుల వాడకంతో భూములు పాడవుతాయి. కొంతమంది రైతులు ఎరువులు ఎక్కువవేస్తే దిగుబడి పెరుగుతుందని అనుకుంటున్నారు. ఎరువు ఏదైనా తగిన మోతాదులోనే వాడాలి. మనం వండిన అన్నమంతా ఒకేసారి తినం కదా. పంటలు కూడా మానవ శరీరం లాంటివే. వాటికి ఎంత ఆహారం అవసరమో అంతే తీసుకుంటాయి. అతిగా తింటే మనుషులకు రోగాలు వచ్చినట్టే, అవసరానికి మించి ఎరువులు చల్లితే ఏపుగా ఎదగాల్సిన పంట ఆగమైతది.
వెదజల్లే విధానంతో ఖర్చులు తగ్గుతాయి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు రానున్న ఏడాదిలో పూర్తవుతాయి. భవిష్యత్తులో తెలంగాణ వ్యవసాయరంగానికి కరవు అనే సమస్యే ఉత్పన్నం కాదు. అందుకు అనుగుణంగా వ్యవసాయశాఖ నిరంతరం చురుగ్గా ఉండాలి. వ్యవసాయాధికారులు రైతువేదికల ద్వారా రైతులను సమావేశపరిచి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. వరిసాగులో వెదజల్లే విధానాన్ని మరింతగా ప్రోత్సహించడం ద్వారా రైతుకు అన్ని విధాలుగా ఖర్చు తగ్గించవచ్చు. ఆ పద్ధతిని ప్రోత్సహించాలి.’’
- సీఎం కేసీఆర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!