Telangana News: రాష్ట్రం ఇచ్చిందే ఎక్కువ
‘‘కేంద్రానికి ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ రూ.3.65 లక్షల కోట్లు పన్నుల రూపేణా చెల్లిస్తే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది కేవలం రూ.1.68 లక్షల కోట్లే. ఈ లెక్కలు తప్పని
కేంద్రం నుంచి వచ్చింది తక్కువ
నేను చెప్పింది తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా
హనుమకొండ సభలో మంత్రి కేటీఆర్ సవాల్
ఈనాడు, వరంగల్, నర్సంపేట, న్యూస్టుడే: ‘‘కేంద్రానికి ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ రూ.3.65 లక్షల కోట్లు పన్నుల రూపేణా చెల్లిస్తే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది కేవలం రూ.1.68 లక్షల కోట్లే. ఈ లెక్కలు తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసి సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతా’’ అని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. మచిలీపట్నం నుంచి నర్సంపేట మీదుగా గుజరాత్ వెళ్తున్న గ్యాస్ పైపులైన్ నుంచి రాబోయే రోజుల్లో రాష్ట్రమంతటా చౌక ధరకు ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని చెప్పారు. కేంద్రం గ్యాస్ బండ ధరను భారీగా పెంచిందని మండిపడ్డారు. బుధవారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, చీఫ్విప్ వినయ్భాస్కర్, స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి హనుమకొండ, నర్సంపేటలలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. పది గంటలకుపైగా సాగిన ఆయన పర్యటనలో ప్రధాని మోదీ, రాష్ట్ర భాజపా ఎంపీలపై ఘాటైన విమర్శలు చేశారు. వరంగల్ నగరంలో రూ.196 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేపట్టారు. స్మార్ట్ లైబ్రరీ, స్మార్ట్ రోడ్లను, పబ్లిక్గార్డెన్లో స్మార్ట్సిటీ పథకం కింద చేపట్టిన సుందరీకరణ పనులను ప్రారంభించారు. నర్సంపేటలో రూ.43.6 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నర్సంపేట, హనుమకొండ కార్యకర్తల సభల్లో కేటీఆర్ ప్రసంగించారు. రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ చేసింది గుండు సున్నా అని.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన వర్సిటీ వంటి విభజన హామీలను తుంగలో తొక్కిన పార్టీ భాజపా అని ధ్వజమెత్తారు.
పొత్తిళ్లలో పసిగుడ్డులా ఉన్న తెలంగాణను ఆనాడు కేంద్రం కాళ్లతో తన్నింది
రాష్ట్రంలో ఉన్న నలుగురు భాజపా ఎంపీలు అసలు ఒక్కసారైనా ప్రధాని మోదీని నేరుగా కలిశారా అని కేటీఆర్ ప్రశ్నించారు. వారు రాష్ట్రానికి చేసింది శూన్యమని అన్నారు. పొత్తిళ్లలో పసిగుడ్డులా ఉన్న తెలంగాణను ఆనాడు కేంద్రం కాళ్లతో తన్నిందని, భద్రాద్రి రాముడి పక్కనున్న ఏడు మండలాలను ఆంధ్రలో కలిపింది మోదీ కాదా అని ప్రశ్నించారు. ‘‘కేసీఆర్కు ఆనాడు అంగబలం, అర్థబలం ఏమీ లేకున్నా కేవలం గుండె నిబ్బరంతో రాష్ట్రాన్ని సాధించారు. అలాంటి గొప్ప వ్యక్తిపై ఇప్పుడు కొందరు చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తున్నారు. పాలమూరులో పాదయాత్ర చేస్తూ పెద్ద మాటలు మాట్లాడుతున్న సంజయ్ అసలు కరీంనగర్కు ఏం చేశారో చెప్పాలి. అమ్మకు అన్నం పెట్టలేని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్న తీరుగా ఆయన వ్యవహారం ఉంది.
ఎమ్మెల్యేలు ఆగం కావొద్దు...
తెరాస ఎమ్మెల్యేలు అనేక అభివృద్ధి పనులు చేయాలంటూ వినతి పత్రాలు పట్టుకొని వస్తున్నారు. కానీ ఇప్పుడే అన్ని పనులు చేస్తే వచ్చేసారి అధికారం చేపట్టాక ఏం చేస్తాం? ఒకరిద్దరికి సంక్షేమ పథకాలు అందకపోతే మీడియా పనిగట్టుకొని రాస్తోంది. ఆ మాటలు పట్టుకొని ఎమ్మెల్యేలు ఆగం కావొద్దు. ప్రజలకు మనం చేసిన సంక్షేమం వివరించాలి’’ అని సభల్లో కేటీఆర్ ఉద్బోధించారు. సుడిగాలి రావడంతో హనుమకొండ హయగ్రీవాచారి మైదానంలో తెరాస ప్రతినిధుల సభా ప్రాంగణంలో మధ్యాహ్నం టెంట్లు కూలాయి. ఎమ్మెల్యేలు వినయ్భాస్కర్, నన్నపనేని నరేందర్ పర్యవేక్షణలో వాటినితొలగించి సభనిర్వహణకు ఏర్పాటు చేశారు.
ఉద్యమ సమయంలో రేవంత్రెడ్డి ఎక్కడ?
కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తిగా చచ్చిపోయింది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు ఆయన సొంత నియోజకవర్గంలో ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేని దుస్థితిలో ఉన్నారు. అలాంటి పార్టీ నుంచి వచ్చిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గతంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. అసలు ఉద్యమ సమయంలో ఎక్కడున్నారు? కేసీఆర్ రాష్ట్ర ప్రజల కష్టం అర్థం చేసుకొని రైతుబంధు, ఆసరా పింఛన్లు, మిషన్భగీరథ, కల్యాణలక్ష్మి లాంటి పథకాలెన్నో తెచ్చారు. ప్రతి సంక్షేమ పథకంలో ప్రజలు కేసీఆర్ను చూసుకుంటున్నారు.
కిషన్రెడ్డివి వట్టి కోతలే
ఆయన మాటల్ని విని సంప్రదాయ వైద్యకేంద్రం వస్తుందనుకున్నాం
యథాప్రకారం ‘గుజరాత్ ప్రధాని’ ఆయన రాష్ట్రానికి తీసుకెళ్లారు: కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం తెలంగాణకు తీరని ద్రోహం చేస్తోందని, నిరంతరం అనింటా దారుణమైన వివక్షను చూపుతోందని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు బుధవారం ట్విటర్లో విమర్శించారు. ‘‘ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మక సంప్రదాయ వైద్య కేంద్రం (గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్) హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రధాని గుజరాత్లోని జామ్నగర్లో శంకుస్థాపన చేశారు. దానిని రాష్ట్రానికి తేవడంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఘోరంగా విఫలమయ్యారు. ఆయన దానిని తెలంగాణలో ఏర్పాటు చేస్తామంటూ కోతలు కోశారు. ఆయన మాటలు విని రాష్ట్రానికి అదైనా వస్తుందనుకున్నాం. కానీ, చివరికి దాన్ని కూడా ‘గుజరాత్ ప్రధాని’ తన రాష్ట్రంలోని జామ్నగర్కు తీసుకెళ్లారు. తెలంగాణపై ప్రధాని మోదీ వివక్ష ధారావాహికలా కొనసాగుతోంది. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో 7 ఐఐఎంలు, 7 ఐఐటీలు, 2 ఐఐఎస్ఈఆర్లు 16 ఐఐటీలు, 4 ఎన్ఐడీలు, 157 ప్రభుత్వ వైద్యకళాశాలలు, 84 నవోదయలు మంజూరు చేసినా అందులో తెలంగాణకు ఒక్కటీ రాలేదు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలకు మొండిచేయి చూపారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇప్పటివరకూ ఏర్పాటు చేయలేదు’’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్