తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైనా పిల్లలకు వారసత్వ ఉద్యోగం
ఎవరైనా సింగరేణి ఉద్యోగి అనారోగ్య కారణాలతో ఉద్యోగానికి అనర్హులైతే సదరు ఉద్యోగి జీవిత భాగస్వామి ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా వారి వారసులకు సింగరేణిలో మళ్లీ
కార్మిక సంఘాలతో సింగరేణి తాజా ఒప్పందం
ఈనాడు, హైదరాబాద్: ఎవరైనా సింగరేణి ఉద్యోగి అనారోగ్య కారణాలతో ఉద్యోగానికి అనర్హులైతే సదరు ఉద్యోగి జీవిత భాగస్వామి ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా వారి వారసులకు సింగరేణిలో మళ్లీ ఉద్యోగం ఇవ్వడానికి సంస్థ అంగీకరించింది. ఇంకా 8 ఇతర అంశాలపై సహాయ కార్మిక కమిషనర్ లక్ష్మణ్ సమక్షంలో సింగరేణి యాజమాన్యానికి, కార్మిక సంఘాలకు మధ్య బుధవారం హైదరాబాద్లో చర్చల అనంతరం తాజాగా ఒప్పందం కుదిరింది. ఇటీవల కార్మిక సంఘాల సమ్మె నోటీసుపై దశలవారీగా జరుగుతున్న చర్చలు బుధవారం నాడు సఫలీకృతమయ్యాయి. ఒప్పంద పత్రంపై గుర్తింపు పొందిన యూనియన్ టీబీజీకేఎస్, ప్రాతినిధ్య సంఘం ఏఐటీయూసీ, జాతీయ సంఘాలైన ఐఎస్టీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, బీఎంఎస్ నాయకులు, సింగరేణి యాజమాన్యం తరఫున సంచాలకుడు ఎన్.బలరామ్, జీఎం ఆనందరావు సంతకాలు చేశారు.
ఒప్పందంలోని ప్రధాన అంశాలు
* తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాక్ల వేలాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర బొగ్గుశాఖ మంత్రిని కోరేందుకు ఈ నెలాఖరున లేదా మే మొదటి వారంలో దిల్లీకి వెళ్లే కార్మిక సంఘాల నాయకులకు సహకారం అందించేందుకు యాజమాన్యం సమ్మతి తెలిపింది.
* కరోనా సమయంలో ఏడాదిన్నర పాటు మెడికల్ బోర్డు పరీక్షలు నిర్వహించనందువల్ల ఆ సమయంలో 35 ఏళ్లు దాటిన వారసులకు కారుణ్య నియామకంలో ఉద్యోగం ఇస్తారు.
* మణుగూరు ఓపెన్ కాస్టు గనిలో డంపర్ ప్రమాదం ఘటనలో డిస్మిస్ అయిన ఇ.పి. ఆపరేటర్ రకీబ్ను తిరిగి కిందిస్థాయి ఉద్యోగంలో నియమించేందుకు హామీ ఇచ్చింది.\
* ఎవరైనా సింగరేణి ఉద్యోగి అనారోగ్య కారణాలతో ఉద్యోగానికి అనర్హులైతే సదరు ఉద్యోగి జీవిత భాగస్వామి ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా వారి వారసులకు సింగరేణిలో మళ్లీ ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించింది.
* మారుపేర్లతో ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వారి పేర్లను మార్చుకునే అంశాన్ని న్యాయశాఖ సలహా అనంతరం సానుకూల రీతిలో పరిష్కరిస్తామని యాజమాన్యం పేర్కొంది.
* ఈపీ ఆపరేటర్లు, గనుల సిబ్బంది, ట్రేడ్మెన్లు అనారోగ్య కారణాలతో అనర్హులైతే.. గనుల్లో కాకుండా ఉపరితల కార్యాలయాల్లో అదే ఉద్యోగం ఇచ్చే అంశాన్ని కంపెనీ అంతర్గత కమిటీ పరిశీలనకు పంపి 60 రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు సంస్థ హామీ ఇచ్చింది.
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వేతన ఖాతాలున్న సింగరేణి ఉద్యోగులు ప్రమాదాల్లో మృతిచెందిన పక్షంలో వారి కుటుంబీకులకు రూ.40లక్షల పరిహారం ఇచ్చేలా ఎస్.బి.ఐ.తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు యాజమాన్యం తెలిపింది. పొరుగుసేవల విభాగంలో పనిచేస్తూ కరోనా వల్ల మృతిచెందిన వారి కుటుంబీకులకు రూ.15లక్షల పరిహారం చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది.
* ఎన్టీపీసీ ప్లాంట్లకు నిరాటంకంగా బొగ్గు సరఫరా చేయాలని ఆ సంస్థ అధికారులు చేసిన వినతిని సింగరేణి సమ్మతించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ