
Telangana News: మిల్లర్ల మాయాజాలం..!
ప్రతి సీజనులో ధాన్యమో... బియ్యమో గోల్మాల్
చోద్యం చూస్తున్న అధికారులు
తిరిగి వసూలుచేయడంలోనూ మొక్కుబడి తీరే
ఆర్థికంగా నష్టపోతున్న పౌరసరఫరాల సంస్థ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.వేల కోట్ల విలువ చేసే ధాన్యాన్ని మిల్లర్లకు పౌరసరఫరాల శాఖ ఇస్తోంది. ఇదే అదనుగా కొందరు మిల్లర్లు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ నిధులు వెచ్చించి వడ్లు కొనుగోలు చేసి మిల్లర్లకు ఇచ్చి పూర్తి స్థాయిలో బియ్యం ఎందుకు తీసుకోలేకపోతున్నారో అధికారులకే తెలియాలి. ఒకపక్క చేతి వాటం... మరోపక్క తాత్సారం వెరసి పౌరసరఫరాల శాఖ విమర్శలకు గురవుతోంది. తూతూమంత్రంగా తనిఖీలు చేస్తుండటంతోనూ బియ్యం పక్కదారి పడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిల్లర్లు మాయం చేసిన బియ్యాన్ని తిరిగి వసూలు చేయడంలో అధికారులు కఠినంగా వ్యవహరించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఎఫ్సీఐ నుంచి రావాల్సిన సొమ్మును కూడా తీసుకోలేని పరిస్థితి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఆడిట్ వ్యవహారాలు పూర్తి చేయకపోవటమూ ఇందుకు ఓ కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పలు రాష్ట్రాల్లో పూచీకత్తుతోనే మిల్లులకు
ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మిల్లర్లకు ధాన్యం ఇచ్చే ముందు బ్యాంకు గ్యారెంటీ తీసుకుంటారు. మిల్లర్లు బియ్యం ఇచ్చిన తర్వాతే పంజాబ్ ప్రభుత్వం ఆ మేరకు ధాన్యం ఇస్తుంది. తెలంగాణలో మాత్రం బ్యాంకు గ్యారెంటీ, ఎలాంటి పూచీకత్తులు లేకుండా మిల్లర్లకు ధాన్యం ఇస్తారు. కొందరు ఇదే అదనుగా పక్కదారి పట్టిస్తూనే ఉన్నారు. సంవత్సరాలు గడిచినా మాయం చేసిన బియ్యాన్ని మిల్లర్ల నుంచి సర్కారు వసూలు చేయలేకపోతుంది. 2019-20 యాసంగికి సంబంధించి సుమారు రూ.400 కోట్ల విలువ చేసే 1.01 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి తెలియకుండా విక్రయించుకున్నారు. ఈ విషయంపై ‘ఈనాడు’లో పలు కథనాలు రావటంతో ప్రభుత్వం విచారణ చేపట్టి ఆయా మిల్లులను గుర్తించింది. ఎలా వసూలు చేయాలన్న అంశంపై కమిటీ వేసింది. 25 శాతం అపరాధ రుసుంతో ఆ బియ్యాన్ని ఇవ్వాలంటూ పౌరసరఫరాల శాఖ గత ఏడాది ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు సుమారు 60 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వసూలు చేసింది. మిగిలిన బియ్యం ఎప్పటికి అందుతుందో.. అపరాధ రుసుం ఎన్నటికి వసూలవుతుందో మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఇలా అయితే డొల్లే...
మిల్లర్ల చేతివాటానికి అడ్డుకట్ట వేయకపోతే పౌరసరఫరాల సంస్థ ఆర్థిక పరిస్థితి డొల్లగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పూచీకత్తుతో పౌరసరఫరాల శాఖ ధాన్యం కొనుగోలు చేస్తుంది. మిల్లింగ్ చేసి బియ్యం ఇచ్చిన తరవాత సుమారు 90 శాతం మొత్తాన్ని పౌరసరఫరాల సంస్థకు ఎఫ్సీఐ చెల్లిస్తుంది. ఆడిట్ వ్యవహారాలు పూర్తయ్యాక మిగిలిన మొత్తాన్ని ఇస్తుంది. 2014-15 సంవత్సరానికి సంబంధించి మాత్రమే పూర్తిస్థాయి ఆడిట్ అయినట్లు సమాచారం. మరో రెండేళ్లకు సంబంధించిన ఆడిట్ వ్యవహారాలు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. పూర్తిస్థాయిలో ఆడిట్ నివేదికలు అందజేయకపోవటంతో కేంద్రం నుంచి సుమారు రూ. 600-700 కోట్ల వరకు నిధులు నిలిచిపోయాయి. నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాం, ఆడిట్ లెక్కలు ఇవ్వండి అంటూ పౌరసరఫరాల శాఖకు ఎఫ్సీఐ లేఖ రాసింది. మరోపక్క వడ్డీల రూపంలో పౌరసరఫరాల సంస్థ రూ.పదుల కోట్లు బ్యాంకులకు చెల్లిస్తోంది. దీంతో ఆర్థికంగా నష్టపోతుంది.
* 2019-20 యాసంగిలో 1.01 లక్షల టన్నుల బియ్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించారు. అపరాధ రుసుం సంగతి అటుంచి ఇప్పటి వరకు ఆ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ పూర్తిస్థాయిలో వసూలు చేయలేకపోయింది. మరోపక్క ధాన్యం కొనుగోలుకు బ్యాంకుల నుంచి తెచ్చిన రుణాలకు వడ్డీలు చెల్లిస్తోంది.
* గడిచిన యాసంగి సీజన్ నిల్వలకు సంబంధించి ఎఫ్సీఐ, పౌరసరఫరాల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తే 40 మిల్లుల్లో 18,155 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైందని తేలింది. మిగిలిన 2,320 మిల్లుల్లో పరిశీలిస్తే ఇంకెంత మొత్తంలో గోల్మాల్ వ్యవహారం నడిచిందో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Happy Birthday: అతిథిగా టామ్ క్రూజ్.. సరదాగా ‘హ్యాపీ బర్త్డే’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
General News
Cancer treatment: క్యాన్సర్ చికిత్స తర్వాత ఏం చేయాలి..?
-
India News
Rahul Gandhi: భాజపా ముఖ్య సమస్యల్ని మేనేజ్ చేస్తూ.. ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తోంది: రాహుల్
-
Movies News
Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
-
World News
Jail Attack: నైజీరియా కారాగారంపై దాడి.. 600 మంది ఖైదీలు పరార్
-
Politics News
Congress: 110 ఏళ్ల చరిత్రలో.. యూపీ మండలిలో ప్రాతినిధ్యం కోల్పోయిన కాంగ్రెస్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్.. మోదీ కంగ్రాట్స్
- Venu Madhav: ఒక్క సీన్ అనుకుంటే మూడు సీన్లు అయ్యాయి
- Trending English words:ఈ 10 ట్రెండింగ్ ఇంగ్లిష్ పదాల గురించి తెలుసా?
- Driver Jamuna: ‘డ్రైవర్ జమున’గా ఐశ్వర్య రాజేశ్.. ఉత్కంఠ భరితంగా ట్రైలర్
- Amazon Prime Day sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్ తేదీలు ఫిక్స్.. ఈ కార్డులపై ప్రత్యేక ఆఫర్లు!
- Andhra News: అధికార పార్టీ అయినా... నెల్లూరు జిల్లాలో ఆ ఎమ్మెల్యే తీరే వేరు!
- Telangana News: నిమ్జ్ కోసం బలవంతపు భూసేకరణ.. రైతు బిడ్డ ఆవేదన
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Anand Mahindra: మీరు ఎన్నారైనా?.. నెటిజన్ ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా ఊహించని రిప్లై