Telangana News: నలుదిక్కులా వైద్యం
తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ(టిమ్స్) ఆసుపత్రుల పరంపరలో మరో అడుగు పడింది. రూ.2,679 కోట్లతో 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో
3 టిమ్స్లకు రూ.2,679 కోట్లు
ఎల్బీనగర్, సనత్నగర్, అల్వాల్లో రానున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు
పరిపాలన ఉత్తర్వుల జారీ
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ(టిమ్స్) ఆసుపత్రుల పరంపరలో మరో అడుగు పడింది. రూ.2,679 కోట్లతో 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో రూ.900 కోట్లతో, హైదరాబాద్ జిల్లా సనత్నగర్లో రూ.882 కోట్లతో, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్లో రూ.897 కోట్లతో వీటిని నిర్మించడానికి ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. నిర్మాణాలకు టెండర్లు పిలవాలని రోడ్డు భవనాల శాఖను ఆదేశించారు.
13,71,220 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక్కో టిమ్స్
ఒక్కో టిమ్స్విస్తీర్ణాన్ని 13,71,220 చదరపు అడుగులుగా నిర్ణయించారు. ఇందులో 10,53,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసుపత్రి, 3,17,420 చదరపు అడుగుల విస్తీర్ణంలో అనుబంధ భవనాన్ని నిర్మిస్తారు. ప్రతి భవనాన్ని ‘టర్న్కీ’ ప్రాతిపదికన నిర్మిస్తారు. అంటే భవననిర్మాణంలో సాధారణంగా కల్పించే విద్యుత్, శానిటేషన్ తదితర వసతులతో పాటు.. వైద్యసేవల్లో వినియోగించే అత్యాధునిక పరికరాల బిగింపునకు వీలుగా నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికీ ఈ విధానాన్నే వర్తింపజేశారు.
ఉస్మానియా, గాంధీ, నిమ్స్లపై తగ్గనున్న భారం
ప్రభుత్వ వైద్య సేవలకు సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల రోగులు నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులపైనే ఆధారపడుతున్నారు. కొత్త ఆసుపత్రుల నిర్మాణంతో నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల రోగులకు మరింత సులభంగా, సత్వరమే స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందనున్నాయి. తద్వారా గాంధీ, నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుంది.
గోల్డెన్ అవర్లో చికిత్సకు అవకాశం
శివార్లలో ఏటా వేయికి పైగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వందల మంది మృత్యువాత పడుతున్నారు. చాలామంది తీవ్రగాయాలతో ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది. కొన్నిసార్లు ఉస్మానియా, గాంధీ, నిమ్స్ల్లోని అత్యవసర విభాగాలకు క్షతగాత్రులను చేర్చడానికి 3-4 గంటలకుపైనే పడుతోంది. కొత్త ఆసుపత్రులు అందుబాటులోకి వస్తే.. రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్లో (ప్రమాదం జరిగిన వెంటనే) చికిత్స అందించడం ద్వారా ఎక్కువ మంది ప్రాణాలను కాపాడటానికి వీలవుతుంది.
హైదరాబాద్ చుట్టూ...
హైదరాబాద్ మహానగరం నలుదిక్కులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. కొవిడ్ సమయంలో గచ్చిబౌలి క్రీడా గ్రామంలో ఉన్న బహుళ అంతస్తుల భవనంలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) ఆసుపత్రికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అక్కడ 1500 పడకలు అందుబాటులోకి తెచ్చారు. తాజాగా మరో మూడింటికి పరిపాలన అనుమతులు ఇవ్వడంతో ప్రభుత్వ ప్రకటన ఆచరణలోకి రాబోతోంది. ఈ నాలుగింటికి ప్రభుత్వం స్వయంప్రతిపత్తి కల్పించింది. ఈ నాలుగు సూపర్ స్పెషాలిటీలను టిమ్స్ పేరిట కొనసాగించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.