Yadadri: వైభవంగా యాదాద్రి శివాలయ ఉద్ఘాటన
యాదాద్రిలో స్మార్త ఆగమశాస్త్రం ప్రకారం పునర్నిర్మించిన శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయ ఉద్ఘాటన పర్వం సోమవారం వైభవోపేతంగా నిర్వహించారు. ఆరు రోజులుగా శివాలయంలో నిర్వహిస్తున్న మహాకుంభాభిషేకంలో
మహాకుంభాభిషేకంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు
మాధవానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో క్రతువు
ఈనాడు, నల్గొండ- న్యూస్టుడే, యాదగిరిగుట్ట: యాదాద్రిలో స్మార్త ఆగమశాస్త్రం ప్రకారం పునర్నిర్మించిన శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయ ఉద్ఘాటన పర్వం సోమవారం వైభవోపేతంగా నిర్వహించారు. ఆరు రోజులుగా శివాలయంలో నిర్వహిస్తున్న మహాకుంభాభిషేకంలో చివరి రోజైన సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్, శోభ దంపతులు పాల్గొన్నారు. శ్రీరాంపురం(తొగుట) పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో ఉద్ఘాటన పర్వాలు చేపట్టారు. ఆలయ ప్రధాన రాజగోపురం, విమాన గోపురం, ఉపాలయాలు, కల్యాణ మండపంపై స్వర్ణకలశాల ప్రతిష్ఠతో పాటు ప్రధానాలయ ముఖమండపంలో స్ఫటికలింగ ప్రతిష్ఠాపన చేశారు. స్ఫటికలింగానికి కేసీఆర్ దంపతులు పంచామృతంతో అభిషేకం చేశారు. బిల్వపత్రాలతో స్వామికి అర్చన చేశారు. శివాలయ పూజారులు ముఖ్యమంత్రి దంపతులను పట్టువస్త్రాలతో సత్కరించి.. వేదాశీర్వచనం చేశారు.
కనులపండువగా శోభాయాత్ర
అంతకుముందు శివాలయ బాలాలయం నుంచి ఉదయం ఆరు గంటలకు శోభాయాత్ర మొదలైంది. పునర్నిర్మితమైన ఆలయం వరకు కనులపండువగా సాగింది. శోభాయాత్ర ఆలయానికి చేరడంతో మాధవానంద సరస్వతి స్వామి ఉద్ఘాటన మహాక్రతువుకు శ్రీకారం చుట్టారు. మహాకుంభాభిషేక మహోత్సవం మహాపూర్ణాహుతితో ముగిసింది. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి దంపతులు, మంత్రి జగదీశ్రెడ్డితో పాటు విప్, స్థానిక ఎమ్మెల్యే సునీత పాల్గొన్నారు. మాధవానంద సరస్వతికి ముఖ్యమంత్రి దంపతులు గురువందనం చేశారు. ఆలయం పక్షాన సత్కరించారు. ఆలయ ప్రధాన స్థపతి అయిన బాలసుబ్రహ్మణ్యంకు కేసీఆర్ స్వర్ణకంకణ ధారణ చేశారు. ఉద్ఘాటన క్రతువు ముగిశాక శాంతి కల్యాణం, ప్రదోష పూజ నిర్వహించి భక్తులను స్వామి దర్శనాలకు అనుమతించారు. ఆలయ గోపురాలపై చేపట్టిన ప్రతిష్ఠాపర్వంలో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డితో పాటు విప్ సునీత, ఎంపీ సంతోష్కుమార్, జడ్పీ ఛైర్మన్ సందీప్రెడ్డి, దేవాదాయ కమిషనర్ ఆనిల్కుమార్, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, కలెక్టర్ పమేలా సత్పతి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, యాడా వైస్ఛైర్మన్ కిషన్రావు, ఆలయ ఈవో గీత, పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీనివాస్ గుప్త, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
స్వయంభువులను దర్శించుకున్న సీఎం
సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి యాదాద్రికి చేరుకున్నారు. తొలుత ప్రెసిడెన్షియల్ సూట్కు వెళ్లి అక్కడి నుంచి సంప్రదాయ దుస్తుల్లో సతీసమేతంగా కొండపైకి చేరుకున్నారు. తొలుత గర్భాలయంలోని పంచనారసింహుల స్వయంభువులను దర్శించుకున్నారు. స్వర్ణ పుష్పార్చనతో పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మహాముఖ మండపంలో సీఎం దంపతులకు పండితులు, పూజారులు వేదాశీర్వచనం చేశారు. శివాలయ ఉద్ఘాటన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్లో భోజనం చేసి.. మధ్యాహ్నం 3.15 గంటలకు వ్యవసాయ క్షేత్రానికి తిరుగుపయనమయ్యారు.
సీఎం పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆటో కార్మికులతో పాటు పలు వర్గాలవారిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
కాన్వాయిలో వాసాలమర్రి సర్పంచి
రాష్ట్రంలోనే తొలిసారి దళితబంధు పథకం ప్రారంభించిన తన దత్తత గ్రామం యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రికి మరో పది రోజుల్లో వస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. వ్యవసాయ క్షేత్రం నుంచి యాదాద్రికి వస్తూ మార్గంమధ్యలో వాసాలమర్రి సర్పంచి పోగుల ఆంజనేయులును తన కాన్వాయ్లో యాదాద్రికి తీసుకొచ్చారు. గ్రామాభివృద్ధికి ఇంకా ఏం చేయాలో క్షేత్రస్థాయిలో పర్యటించి నాలుగైదు రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతిని ఆదేశించినట్లు తెలిసింది. పది రోజుల్లో గ్రామంలో పర్యటించి మిగిలిఉన్న పనులనూ పూర్తి చేసుకుందామని సర్పంచితో ఆయన చెప్పినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?