CM KCR: దేశమంతా అంధకారం... తెలంగాణలో వెలుగులు
తెలంగాణ ధగధగలమయంగా విద్యుత్తు వెలుగులతో విరాజిల్లుతుండగా...దేశమంతా అంధకారం నెలకొందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశం మొత్తంలోనే 24 గంటలు విద్యుత్తు అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతి...
ఇతర రాష్ట్రాల్లో విద్యుత్తు కోతలు
కేంద్రానికి చికిత్స అవసరం
దేశం కోసం పనిచేసే అవకాశం వస్తుంది
అందరం కలిసి గాడిలో పెడదాం
ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ధగధగలమయంగా విద్యుత్తు వెలుగులతో విరాజిల్లుతుండగా...దేశమంతా అంధకారం నెలకొందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశం మొత్తంలోనే 24 గంటలు విద్యుత్తు అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతి గడించిందని, అన్ని రంగాలకూ నాణ్యమైన కరెంటును అందిస్తున్నామన్నారు. తెలంగాణలో కోతలు లేని విద్యుత్తు సరఫరా ఉండగా.. ఇతర రాష్ట్రాల్లో కోతలున్నాయన్నారు. రంజాన్ను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ముస్లింలకు ఇఫ్తార్ విందునిచ్చింది. దీనికి హాజరైన కేసీఆర్ వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడారు. ‘‘నిర్మాణాత్మక పాలనతో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులు అద్భుతంగా ఉన్నాయి. కేంద్రంలో మాత్రం బాగోలేవు. తలసరి ఆదాయంలో దేశ సగటు తెలంగాణ సగటులో సగం కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం రోగంతో గడబిడగా ఉంది. దానికి చికిత్స చేయాల్సిన అవసరం ఏర్పడింది. దేశాన్ని గాడిలో పెట్డడం మనందరి బాధ్యత. మనకు కూడా ఈ దేశం కోసం పనిచేసే అవకాశం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దేశాన్ని ఇబ్బందుల పాలుకానివ్వను.. నష్టపోనివ్వను. దేనినైనా కూల్చడం చాలా సులభం. నిర్మించడమే కష్టం. బెంగళూరులో ఎలాంటి అల్లర్లు జరుగుతున్నాయో చూస్తున్నాం. దేశమంతా ఇలాగే నడుస్తోంది. అలాంటి విపత్కర పరిస్థితుల వరకూ తీసుకెళ్లారు. ఇది సరైన పద్ధతి కాదు. బాగు చేయాల్సిన అవసరం ఉంది.
దుష్టశక్తుల ఆటలు ఎక్కువ కాలం సాగవు
దేవుడు తెలంగాణను ఎలాగైతే అభివృద్ది పథంలో నడిపించి, ఈ స్థాయికి తీసుకొచ్చారో.. దేశం వైపు కూడా మమ్మల్ని అలాగే నడిపిస్తారన్న నమ్మకం ఉంది. దుష్టశక్తుల ఆటలు ఎక్కువ కాలం సాగవు. చివరికి మానవత్వమే గెలుస్తుంది. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ వాతావరణం చాలా ఇబ్బందిగా ఉండేది. కనీసం తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి. వ్యవసాయానికి కూడా అంతే. కానీ.. మీ అందరి సహకారం, భగవంతుడు, అల్లా దయ వల్ల పరిస్థితి మారిపోయింది. తెలంగాణ మంచి ఫలితాలు సాధించింది. మైనారిటీ పిల్లల కోసం అద్భుతమైన గురుకుల పాఠశాలలను నిర్మించాం. ఈ అభివృద్ధి ఏ మాత్రం సరిపోదు. ఇంకా సాధించాలి. ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం’ అని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తోఫా అందించారు. విందులో సీఎం కేసీఆర్ ఎంపీ అసద్కు స్వయంగా భోజనం వడ్డించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం