- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా సీహెచ్.రమేశ్బాబు
55 మంది జిల్లా న్యాయమూర్తులను బదిలీ చేసిన హైకోర్టు
జగన్ కేసుల్లో విచారణ మళ్లీ మొదటికి?
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 55 మంది జిల్లా జడ్జీలను బదిలీచేస్తూ శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం కామారెడ్డి 9వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా ఉన్న సీహెచ్.రమేశ్బాబును సీబీఐ ప్రత్యేక ప్రధాన కోర్టు జడ్జిగా బదిలీ చేసింది. ఆ స్థానంలో ఉన్న బి.ఆర్.మధుసూదన్రావును వ్యాట్ ట్రైబ్యునల్ ఛైర్పర్సన్గా నియమించింది. నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఇ.తిరుమలదేవి జ్యుడిషియల్ అకాడమీకి బదిలీ అయ్యారు. సంగారెడ్డి జిల్లా జడ్జి బి.పాపిరెడ్డి..నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా, ప్రస్తుతం జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా ఉన్న సి.హెచ్.కె.భూపతి రంగారెడ్డి జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. బదిలీ అయిన వారంతా 4వతేదీ లోగా ప్రస్తుతం నిర్వహిస్తున్న బాధ్యతలను ఇతరులకు అప్పగించి కొత్త బాధ్యతలను తీసుకోవాలంటూ రిజిస్ట్రార్ (విజిలెన్స్) ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మళ్లీ మొదలా?
జగన్ అక్రమాస్తుల కేసులను విచారిస్తున్న బి.ఆర్.మధుసూదన్రావు బదిలీ అయిన నేపథ్యంలో విచారణ మళ్లీ మొదటికి రానుంది. ప్రజాప్రతినిధులకు చెందిన కేసులపై సత్వరం విచారణ చేపట్టాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో సీబీఐ కోర్టులో రోజువారీ విచారణ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రస్తుతం 11 కేసుల్లో ఉన్న పలువురు నిందితుల డిశ్ఛార్జి పిటిషన్లపై వాదనలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఒక్కదానిలోనూ వాదనలు పూర్తికాలేదు. 2012లో నమోదైన కేసులన్నీ డిశ్ఛార్జి పిటిషన్లు, అభియోగాల నమోదు ప్రక్రియలోనే ఉన్నాయి. మరోవైపు 2019 ఫిబ్రవరిలో సీబీఐ కోర్టు జడ్జిగా నియమితులైన బి.ఆర్.మధుసూదన్రావు జగన్ కేసులపై ప్రతి శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో పలు కేసుల తాలూకూ డిశ్ఛార్జి పిటిషన్లలో నిందితుల తరఫు వాదనలు పూర్తయ్యాయి. సీబీఐ వాదనలు వినాల్సి ఉంది. ఈ దశలో న్యాయమూర్తి బదిలీ కావడం విచారణపై ప్రభావం చూపనుంది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంతోపాటు ఓబుళాపురం గనులు, ఎమ్మార్ వివాదంపై సీబీఐ నమోదు చేసిన కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదుచేసిన వాటిపైనా విచారణ మొదటికొస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
భాజపా కుట్రలో పావులౌతున్నారు.. శశిధర్ రెడ్డి వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్
-
General News
Top ten news 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 న్యూస్
-
India News
YouTube Channels: నకిలీ వార్తల వ్యాప్తి.. 8 యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం వేటు
-
World News
Monkeypox: మంకీపాక్స్ టీకాలు 100 శాతం పనిచేయవు..!
-
India News
నీతీశ్ ఆ పనిచేస్తే.. బిహార్లో ప్రచారాన్ని ఆపేస్తా: పీకే కీలక వ్యాఖ్యలు
-
Movies News
Madhavan: ‘రాకెట్రీ.. మాధవన్ ఇంటిని కోల్పోయాడు’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vinod kambli: బీసీసీఐ పింఛనే నాకు దిక్కు.. సచిన్ నుంచి ఏమీ ఆశించట్లేదు: వినోద్ కాంబ్లి
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
- Vizag: విశాఖలో రౌడీషీటర్ హత్య.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘాతుకం
- Andhra News: వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (18/08/2022)
- Viral video: యూనిఫాంలో పోలీసుల ‘నాగిని డ్యాన్స్’.. వైరల్గా మారిన వీడియో
- డేంజర్ జోన్లో రాష్ట్ర ప్రభుత్వం
- Kabul: కాబుల్ మసీదులో భారీ పేలుడు.. భారీగా ప్రాణనష్టం?