దరఖాస్తుకు వేళాయె
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సోమవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలు కానుంది. తెలంగాణ తొలి గ్రూప్-1, పోలీస్, ఇతర విభాగాల యూనిఫాం పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. గ్రూప్-1 పోస్టులకు మే 2 నుంచి 31 వరకు, పోలీసు,
రేపటి నుంచి గ్రూప్-1, పోలీస్ పోస్టులకు ఆన్లైన్లో స్వీకరణ
గ్రూప్-1కు మే నెలాఖరు, యూనిఫాం పోస్టులకు 20 వరకు గడువు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సోమవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలు కానుంది. తెలంగాణ తొలి గ్రూప్-1, పోలీస్, ఇతర విభాగాల యూనిఫాం పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. గ్రూప్-1 పోస్టులకు మే 2 నుంచి 31 వరకు, పోలీసు, ఇతర యూనిఫాం పోస్టులకు మే 2 నుంచి 20 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంది. ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించేందుకు టీఎస్పీఎస్సీ, పోలీస్ నియామక బోర్డు ఏర్పాట్లు చేస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి ఆన్లైన్ దరఖాస్తు లింకును అందుబాటులోకి తీసుకురానున్నాయి. దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలపై ఇప్పటికే ఉద్యోగ ప్రకటనల్లో స్పష్టత ఇచ్చారు. టీఎస్పీఎస్సీ జారీచేసిన ఉద్యోగాల ప్రకటనలకు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం ఓటీఆర్లో సవరణ చేసుకున్న, కొత్తగా నమోదు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే అర్హులని కమిషన్ తెలిపింది. శనివారం నాటికి 2.2 లక్షల ఓటీఆర్లు నమోదయ్యాయి. ఓటీఆర్లో, దరఖాస్తు ప్రక్రియలో వివరాలన్నీ సక్రమంగా నమోదు చేయాలని, పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడాలని సూచించింది.
గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇలా...
* 503 గ్రూప్-1 పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో లింకు అందుబాటులో ఉంటుంది. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం సవరణ చేసిన, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసిన టీఎస్పీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీ నమోదు చేయాలి. అనంతరం మొబైల్కు వచ్చిన ఓటీపీని నమోదు చేసిన వెంటనే దరఖాస్తు చేసేందుకు అవకాశం వస్తుంది.
* ఓటీఆర్ డేటాబేస్ ప్రకారం పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, కమ్యూనిటీ తదితర వివరాలన్నీ కనిపిస్తాయి. ఈ వివరాలు సరైనవేనని నిర్ధారిస్తే ‘కన్ఫర్మ్’పై క్లిక్ చేయాలి. ఇందులో ఏమైనా పొరపాట్లు ఉన్నాయని భావిస్తే ‘నో’పై క్లిక్ చేయాలి. దీంతో ఓటీఆర్ విండో తెరుచుకుంటుంది. అందులో వివరాలు నమోదు చేసి, సబ్మిట్ చేస్తే తిరిగి అప్లికేషన్ వస్తుంది. ఆ తరువాత ‘కన్ఫర్మ్’పై క్లిక్ చేయాలి.
* ఓటీఆర్ వివరాలకు అదనంగా నోటిఫికేషన్ ప్రకారం విద్యార్హతలు, ప్రాధాన్యక్రమంలో పరీక్ష కేంద్రాల నమోదు.. విద్యార్హతలు, వయోపరిమితి ఆధారంగా పోస్టుల ప్రాధాన్యం తదితర వివరాలు పూర్తి చేయాలి. పూర్తి చేసిన దరఖాస్తును ‘సేవ్’ చేసి, ‘కన్ఫర్మ్’పై క్లిక్ చేయాలి. ఈ ప్రక్రియ అనంతరం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రాసెస్ రుసుము, పరీక్ష ఫీజు..
అభ్యర్థులందరూ తప్పనిసరిగా దరఖాస్తు ప్రాసెస్ రుసుము రూ.200, పరీక్ష ఫీజు రూ.120 చెల్లించాలి. పరీక్ష ఫీజు నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు టీఎస్పీఎస్సీ మినహాయింపు ఇచ్చింది. 18-44 ఏళ్లలోపు నిరుద్యోగ అభ్యర్థులూ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే తాము నిరుద్యోగులమంటూ డిక్లరేషన్ సమర్పించాలి. ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు లేదని కమిషన్ స్పష్టం చేసింది. దరఖాస్తు ప్రాసెస్ రుసుము, పరీక్ష ఫీజును నెట్బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డులు, టీ-వ్యాలెట్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన అనంతరం దరఖాస్తు ‘పీడీఎఫ్’ కాపీని భద్రపరచుకోవాలి. దరఖాస్తు రిఫరెన్స్ ఐడీ తదుపరి సంప్రదింపులకు ఉపయోగపడుతుంది.
ప్రిలిమినరీకి 12 పరీక్ష కేంద్రాలు..
ప్రిలిమినరీ పరీక్షకు ప్రతి అభ్యర్థి 12 జిల్లా పరీక్ష కేంద్రాలను ప్రాధాన్యక్రమంలో ఎంపిక చేసుకోవాలి. ఈ పరీక్ష అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతుంది. పరీక్ష కేంద్రాల కేటాయింపు అధికారం కమిషన్కు ఉంటుంది. ఒకసారి కేటాయించిన తరువాత మార్పులకు అవకాశం ఉండదు.
పోలీస్ ఉద్యోగాలకు..
పోలీస్, ఎస్పీఎఫ్, ఫైర్, జైల్, ఎక్సైజ్, రవాణా శాఖల్లోని ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్ఎల్పీఆర్బీ) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25న జారీ అయిన నాలుగు నోటిఫికేషన్లతోపాటు 28న జారీ అయిన రెండు నోటిఫికేషన్లకు సంబంధించి 17,291 పోస్టుల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు మే 2 ఉదయం 8 గంటల నుంచి మే 20 రాత్రి 10 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు సూచించారు. దరఖాస్తుల కోసం www.tslprb.in వెబ్సైట్ను సందర్శించాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!