Telangana News: కొట్టుకుపోయిన కష్టం
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలు అన్నదాతలను కష్టాలపాలు చేశాయి. కొనుగోలు కోసం తెచ్చి.. కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం నీటిపాలైంది. కోతకొచ్చిన వరిపైర్లు నేలవాలాయి. మామిడి, కూరగాయల తోటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నీటిపాలు
పరదాలు లేవు.. తడిస్తే కొనేవారు లేరు
వర్ష సూచనలున్నా జాగ్రత్తలు శూన్యం
ఈనాడు - హైదరాబాద్, జిల్లాల యంత్రాంగం
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలు అన్నదాతలను కష్టాలపాలు చేశాయి. కొనుగోలు కోసం తెచ్చి.. కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం నీటిపాలైంది. కోతకొచ్చిన వరిపైర్లు నేలవాలాయి. మామిడి, కూరగాయల తోటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అనధికారిక అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 20 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ గత వారం రోజులుగా హెచ్చరిస్తున్నా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. అమ్మకానికి తెచ్చి ఆరబోసిన ధాన్యం కొంత నీటిలో కొట్టుకుపోయింది. మిగిలింది తడిసిపోయింది. మంగళవారం ఉదయం 8 నుంచి బుధవారం రాత్రి 8 గంటల వరకు 608 ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల ధాన్యం రాశుల చుట్టూ వరదలా నీరు నిలవడంతో రైతులకు కన్నీరే మిగిలింది. కొనుగోలు కేంద్రాలను పొలాల్లో ఎలాంటి రక్షణ లేనిచోట్ల ఏర్పాటు చేయడంతో చిన్నవర్షం పడినా బురదగా మారి ధాన్యం పాడవుతోంది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, మేడ్చల్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, కుమురంభీం, కామారెడ్డి తదితర జిల్లాల్లో రైతులకు అధిక నష్టాలు సంభవించాయి. కొన్ని ప్రాంతాల్లో గంట నుంచి 4 గంటల వ్యవధిలో నిరంతరాయంగా 5 నుంచి 11 సెంటీమీటర్ల వర్షం కురవడంతో కళ్లముందే ధాన్యం నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ఎంత ధాన్యం నీటిలో కొట్టుకుపోయిందనే లెక్కలను అధికారులెవరూ ప్రకటించలేదు.
మూడు గంటల పాటు బీభత్సం
ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి దాదాపు 3గంటల పాటు కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. నల్గొండ, యాదాద్రి జిల్లాల్లోని సుమారు 70 కొనుగోలు కేంద్రాల్లో 10 వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయిందని అంచనా. చిట్యాల, హాలియా, తిప్పర్తి, మోత్కూరు, నిడమనూరు, నల్గొండ మండల కేంద్రాల్లోని ఐకేపీ కేంద్రాల్లో సరిపడినన్ని టార్పాలిన్లు లేకపోవడంతో ధాన్యం వర్షంలోనే ఉండిపోయింది. కొన్ని చోట్ల తూకం వేసిన ధాన్యం బస్తాలు ముద్దముద్ద అయ్యాయి. మునుగోడు, మోత్కూరు మండలాల్లోని దాదాపు 150 ఎకరాల్లో వరిపైరు ఈదురుగాలులకు నేలకొరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 5వేల ఎకరాల్లో వరికి నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని ఈ జిల్లా అదనపు కలెక్టరు (రెవెన్యూ) చంద్రశేఖర్ ‘ఈనాడు’కు వెల్లడించారు.
* కామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూరు, లింగంపేట, బిచ్కుంద మండలాల్లో ఈదురుగాలులు, భారీవర్షంతో సుమారు 300 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అంచనా.
* జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో అన్నదాతలు అరిగోస పడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలను వాన నుంచి కాపాడలేక ఆవేదన చెందారు. సారంగాపూర్ మండలంలో 6.4 సెం.మీ. వర్షం కురవడంతో కల్లాలన్నీ చెరువుల్ని తలపించాయి. కోతకు వచ్చిన పంటలు ఈదురుగాలులకు నేలకొరిగాయి.
* ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ, భూపాలపల్లి, హనుమకొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసిపోయింది. కోతకొచ్చిన వరి పంట నేలవాలింది.
* మంచిర్యాల జిల్లాలోని 13 మండలాల్లో 4800 ఎకరాల మేర వరి, 800 ఎకరాల మేర మామిడి పంటలు నష్టపోయినట్టు అంచనా.
500 టన్నులకు పైగా మామిడి నేలపాలు
అకాల వర్షాలకు వరితో పాటు మామిడి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ఈ సీజన్లో మామిడి దిగుబడి సరిగా లేక ఇప్పటికే రైతులు నష్టపోగా మిగిలిన కాసింత పంటను తెగుళ్లు, వర్షాలు కాలరాస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో వీచిన ఈదురుగాలులు, వర్షాలకు 500 టన్నులకు పైగా మామిడికాయలు తోటల్లోనే నేలరాలినట్లు ఉద్యానశాఖ అంచనా. హైదరాబాద్ చుట్టుపక్కల యాదాద్రి, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్ తదితర జిల్లాల్లో కురిసిన వర్షాలకు కూరగాయల తోటల్లో పూత, కాత రాలిపోయాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నారాయణపూర్, నూతన్కల్, మోత్కూరు, మద్దిరాల మండలాల్లోని దాదాపు 200 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. గురువారం ఎండలు కాస్తే పంటలకు పెద్దగా నష్టం ఉండదని అధికారులు చెబుతున్నారు.
సగం వడ్లు కోల్పోయాం
-రేణుక, గంగాధర, కరీంనగర్ జిల్లా
తొమ్మిది ఎకరాల్లో వరిసాగు చేశాం. రెండు రోజుల కిందట కోసి పది ట్రాక్టర్లలో ధాన్యాన్ని తెచ్చి మల్లాపూర్లో ఆరబోశాం. నాలుగైదు ట్రాక్టర్ల ధాన్యం కొట్టుకుపోయింది. టార్పాలిన్లు కప్పినా, గాలికి ఎగిరిపోయాయి. కొన్ని వడ్లు ఏరి తెచ్చుకొని ఆరబోసుకుంటున్నాం. ఎండల్ని లెక్కచేయకుండా కష్టపడి పంట పండిస్తే చివరకు మా పరిస్థితి ఇలా అయ్యింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?