Congress: హస్తవాసి మారేలా
రాష్ట్ర కాంగ్రెస్లో జవసత్వాలు నింపేలా కార్యాచరణ మొదలైంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ పర్యటనకు పార్టీ శ్రీకారం చుట్టింది. రానున్న శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించనుంది. హనుమకొండ వేదికగా
పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ దృష్టి
ఎన్నికల కార్యాచరణ షురూ
హనుమకొండ వేదికగా వ్యవసాయ విధానం
నేడు, రేపు రాష్ట్రంలో రాహుల్గాంధీ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్లో జవసత్వాలు నింపేలా కార్యాచరణ మొదలైంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ పర్యటనకు పార్టీ శ్రీకారం చుట్టింది. రానున్న శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించనుంది. హనుమకొండ వేదికగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విధానాన్ని ప్రకటించనుంది. శనివారం గాంధీభవన్లో జరిగే విస్తృత స్థాయి పార్టీ సమావేశంలో నాయకులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. సుమారు మూడేళ్ల తర్వాత రాష్ట్రానికి వస్తున్న రాహుల్ రెండ్రోజుల పాటు రాష్ట్ర కాంగ్రెస్పై ప్రత్యేకదృష్టి సారించనున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి నియామకం తర్వాత రాహుల్ తొలి పర్యటన ఇది. తెరాస ప్రభుత్వ విధానాలపై పోరాట కార్యాచరణకు ఈ పర్యటన కీలకం కానుంది. శాసనసభ ఎన్నికలపై దృష్టిసారించిన కాంగ్రెస్ పార్టీ వర్గాల వారీగా సమస్యలపై పోరాడాలని నిర్ణయించింది. ప్రతి రెండున్నర నెలలకోసారి రాహుల్ రాష్ట్రానికి వచ్చేలా కాంగ్రెస్ ప్రణాళిక రూపొందించింది. రైతుల సమస్యల అనంతరం విద్యార్థులు-నిరుద్యోగులు, మహిళలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ బడుగు బలహీనవర్గాల సమస్యలపై సభలను నిర్వహించనుంది. అదే వేదికపై సంబంధిత వర్గాలకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేసే విధానాలను స్పష్టం చేయనుంది. ఈ నేపథ్యంలోనే నేటి తొలి సభలో వ్యవసాయ విధానాన్ని ప్రకటించనుంది. మరోవైపు అంతర్గతంగా పార్టీలోని సమస్యలను కొలిక్కి తెచ్చి నేతలందరినీ ఒకే తాటిపై నిలిపేలా అధిష్ఠానం దృష్టిసారించింది.
ఏర్పాట్లు పూర్తి
ఈనాడు, వరంగల్: హనుమకొండ ఆర్ట్స్ కళాశాలలో శుక్రవారం రాహుల్గాంధీ హాజరయ్యే రైతు సంఘర్షణ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభకు 5 లక్షల మందిని తరలించాలని పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, భూపాలపల్లి మార్గాల గుండా వచ్చే వాహనాల కోసం నాలుగు పార్కింగ్ స్థలాలను ఆయా రూట్లలో ఏర్పాటుచేశారు. ప్రముఖ నేతల కోసం ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియం వద్ద వీవీఐపీ పార్కింగ్ సిద్ధం చేశారు. మైదానంలో మూడు వేదికలను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. మధ్య వేదికపై రాహుల్తో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, మరో ముగ్గురు ప్రసంగిస్తారు.
రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఓరుగల్లు డిక్లరేషన్
జూబ్లీహిల్స్, న్యూస్టుడే: రైతుల్ని ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకొనే నిర్ణయాలపై రాహుల్ ఓరుగల్లు వేదికగా స్పష్టమైన డిక్లరేషన్ చేయనున్నారని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. పార్టీనేతలు మధుయాస్కీ, మల్లు రవి ఆధ్వర్యంలో ప్రజా గాయకుడు గద్దర్ రూపొందించిన గాంధీ కుటుంబ త్యాగాల వీడియోను ‘జనం వాయిస్’ పేరుతో బంజారాహిల్స్లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో గురువారం ప్రదర్శించారు. కార్యక్రమానికి రేవంత్తో పాటు ఉత్తమ్కుమార్రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ యాదాద్రిని రూ.రెండు వేలకోట్లతో పునర్నిర్మిస్తే చిన్నపాటి వర్షానికి ఎలా అతలాకుతలమైందో ప్రజలు గమనించాలన్నారు.‘రాహుల్..ఎందుకు వస్తున్నావు?’అంటూ మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలపై రేవంత్రెడ్డి ట్విటర్ వేదికగా ఖండించారు. రాహుల్ను విమర్శించే స్థాయి హరీశ్కు లేదన్నారు.
జైళ్ల శాఖ డీజీకి వినతి..
నారాయణగూడ, న్యూస్టుడే: చంచల్గూడ జైలులో ఉన్న విద్యార్థులను పరామర్శించేందుకు రాహుల్గాంధీకి అనుమతి ఇవ్వాలని రేవంత్రెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం జైళ్ల శాఖ డీజీ జితేందర్ను కలిసి వినతి పత్రం సమర్పించింది. ఆర్ట్స్ కళాశాలలో రాహుల్గాంధీ ముఖాముఖి కార్యక్రమ అనుమతి కోసం వీసీని కలిసేందుకు వెళ్లిన ఎన్ఎస్యూఐ నాయకుడు బల్మూరి వెంకట్తో సహా 17 మందిపై నాన్బెయిలబుల్ కేసులు పెట్టి చంచల్గూడ జైలులో ఉంచారన్నారు. వారిని రాహుల్గాంధీ పరామర్శించేందుకు అనుమతి కోరుతూ జైలు సూపరింటెండెంట్ను కలిశామని, డీజీని కలవాలని చెప్పడంతో ఆయనకూ వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు.
రాహుల్ పర్యటన ఇలా..
మొదటి రోజు (శుక్రవారం)
* సాయంత్రం 4.50 గంటలకు రాహుల్ గాంధీ శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటారు. 5.45 గంటలకు వరంగల్ గాబ్రియల్ స్కూలు గ్రౌండ్కు వెళతారు.
* 6.05 గంటలకు హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్న రైతు సంఘర్షణ బహిరంగసభలో పాల్గొంటారు.
* రాత్రి 8 గంటలకు బయల్దేరి రోడ్డు మార్గంలో హైదరాబాద్ చేరుకుంటారు.
రెండో రోజు (శనివారం)
* మధ్యాహ్నం 12.50 గంటలకు సంజీవయ్య పార్కుకు చేరుకుంటారు.దివంగత ఉమ్మడి ఏపీ సీఎం, ఏఐసీసీ అధ్యక్షుడు సంజీవయ్యకు నివాళి అర్పిస్తారు.
* మధ్యాహ్నం 1.45 నుంచి 2.45 గంటల వరకు గాంధీభవన్లో కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు.
* 2.50 నుంచి 3.50వరకు సభ్యత్వ నమోదు సమన్వయకర్తలతో ఫొటో కార్యక్రమం.
* సాయంత్రం 5.40 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి దిల్లీ బయల్దేరతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు