Rahul Gandhi: జనంలో ఉంటేనే టికెట్
సమస్యలపై పోరాడుతూ ప్రజల్లో ఉండేవారికే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్లు దక్కుతాయని ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ స్పష్టం చేశారు. ఎంత సీనియర్కైనా ఇదే నిబంధన వర్తిస్తుందన్నారు. టికెట్ల కోసం ఎవరూ దిల్లీకి రావాల్సిన అవసరం లేదని.. అలా వస్తే అది వారికే నష్టం కలిగిస్తుందన్నారు. హైదరాబాద్లో కూర్చుంటే టికెట్లు రావని,
పార్టీకి నష్టం కలిగించే చర్యలను సహించేది లేదు
రాష్ట్రం నుంచి కేసీఆర్ను సాగనంపాలి
వరంగల్ డిక్లరేషన్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలి
నేతలకు రాహుల్గాంధీ దిశానిర్దేశం
కాంగ్రెస్లోకి రావాలని యువతకు ఆహ్వానం
ఈనాడు - హైదరాబాద్
సమస్యలపై పోరాడుతూ ప్రజల్లో ఉండేవారికే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్లు దక్కుతాయని ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ స్పష్టం చేశారు. ఎంత సీనియర్కైనా ఇదే నిబంధన వర్తిస్తుందన్నారు. టికెట్ల కోసం ఎవరూ దిల్లీకి రావాల్సిన అవసరం లేదని.. అలా వస్తే అది వారికే నష్టం కలిగిస్తుందన్నారు. హైదరాబాద్లో కూర్చుంటే టికెట్లు రావని, నియోజకవర్గాలకు వెళ్లి ప్రజల్లో ఉండాలని చెప్పారు. హైదరాబాద్ బిర్యానీ, చాయ్ బాగుంటాయని.. అయినా నగరం వదిలి నాయకులు గ్రామాలకు తరలాల్సిందే అన్నారు. శనివారం గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో రాహుల్గాంధీ మాట్లాడారు. ఈ సమావేశంలో ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మాణికం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీనేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సహా ముఖ్యనేతలు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై రోడ్డెక్కాలని.. రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు, యువత కోసం పోరాటం చేయాలన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన శక్తులతో ఎలాంటి పొత్తులు ఉండబోవని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్ మధ్యే కొట్లాట ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్కు పోలీసు బలం, డబ్బు, అధికార యంత్రాంగం ఉన్నా జన బలం లేదని పేర్కొన్నారు.
తెరాస పాలనలో యువతకు అన్యాయం
తెరాస, సీఎం కేసీఆర్ను తెలంగాణ నుంచి సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. సంపద దోపిడీ జరిగి కేసీఆర్ కుటుంబం పాలైందన్నారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో తెరాస పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో వారి బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.పెద్ద సంఖ్యలో పార్టీలోకి రావాలని ఈ సందర్భంగా యువతకు ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ నెరవేర్చారని గుర్తుచేశారు. రాష్ట్రం ఇవ్వడం వల్ల కాంగ్రెస్కు నష్టం జరిగిందని.. అయినా ఫర్వాలేదన్నారు. తెలంగాణ ప్రజల కలలను నిజం చేయడం, ఆదర్శ రాష్ట్రంగా చేయడమనే పార్టీ ముందున్న లక్ష్యాలన్నారు. విద్య, వైద్యం, ఉపాధిపై కాంగ్రెస్ ప్రధాన దృష్టి సారిస్తోందన్నారు. రైతు సంక్షేమం కోసం తీసుకు వచ్చిన వరంగల్ డిక్లరేషన్ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారన్నారు. నెల తర్వాత రాష్ట్రంలో 12 ఏళ్ల బాలుడిని అడిగినా ఈ డిక్లరేషన్లోని అంశాలు చెప్పేలా ప్రచారం చేయాలన్నారు.ఆరెస్సెస్లా కాంగ్రెస్ వ్యక్తి అభిప్రాయాలు, నిర్ణయాలపై ఆధారపడదని ప్రతి ఒక్కరి ఆలోచనలను వింటుందన్నారు. పార్టీలో అంతర్గతంగా సమస్యలుంటే మీడియాకు వెళ్లొద్దని.. నాలుగుగోడల మధ్య చర్చించుకుని పరిష్కరించుకోవాలన్నారు. పార్టీకి నష్టం కలిగించే చర్యలను అంగీకరించే ప్రసక్తేలేదన్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కలసికట్టుగా పనిచేయడంతోనే వరంగల్ సభ విజయవంతమైందని పేర్కొంటూ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదు చేసినవారిని అభినందించారు.
రాహుల్ పర్యటనతో పార్టీలో నూతనోత్తేజం: ఎంపీ కోమటిరెడ్డి
గాంధీభవన్, న్యూస్టుడే: రాహుల్గాంధీ తెలంగాణ పర్యటన వల్ల పార్టీకి నూతనోత్తేజం వచ్చిందని పీసీసీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం ఆయనిక్కడ మాట్లాడుతూ.. వరంగల్ సభలో, పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో రాహుల్ చేసిన ప్రసంగం పార్టీకి ఎంతో లబ్ధి చేకూర్చుతుందన్నారు. పొత్తులు, టికెట్లపై స్పష్టత ఇచ్చారన్నారు.
రాహుల్ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడాన్ని మంత్రి కేటీఆర్, తెరాస నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నారు. గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత, స్థాయి కేటీఆర్కు లేదన్నారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్తో కలిసి ఆయన శనివారం గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాహుల్ అన్నీ వాస్తవాలే మాట్లాడారని.. అందులో తప్పేముందని వ్యాఖ్యానించారు. ఎనిమిదేళ్లలో ఒక్కసారైనా కేసీఆర్ అఖిలపక్షాన్ని పిలిచారా అని ప్రశ్నించారు.
చేరికలు పార్టీకి ప్రయోజనం కలిగేలా ఉండాలి
గాంధీభవన్, న్యూస్టుడే: కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం కలిగించే చేరికలపై దృష్టిసారించాలని రాహుల్గాంధీ సూచించారు. గాంధీభవన్లో ఆయన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ముఖ్యనేతలు భట్టివిక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మధుయాస్కీగౌడ్, ఎన్నికల వ్యూహకర్త సునీల్లతో కాసేపు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇతర పార్టీల నుంచి ఎలాంటి ఆరోపణలు లేని వారు వస్తామంటే అభ్యంతరం చెప్పొద్దన్నారు. ఎవరైనా నా జిల్లా, నా నియోజకవర్గం..వీరిని తీసుకోవద్దు, వారిని చేర్చుకోవద్దు అంటూ చేరికలను అడ్డుకుంటే సీరియస్గా తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతకు ముందు గాంధీభవన్కు వచ్చిన రాహుల్గాంధీకి ఘన స్వాగతం లభించింది. వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్