KTR: పది అవకాశాలిస్తే ఏం వెలగబెట్టారు?
‘వరంగల్ రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ ఒక్క అవకాశం ఇవ్వాలని అడిగారు. ప్రజలు ఇప్పటికే పది అవకాశాలు ఇచ్చినా కాంగ్రెస్ ఏం వెలగబెట్టింది? మీది రైతు ప్రభుత్వమే అయితే పంజాబ్లో ఎందుకు ఓడిపోయారు?’
ప్రధానినీ సోనియా రిమోట్తో ఆడించారు
గాంధీభవన్ను గాడ్సేకు అప్పగించారు
రైతు డిక్లరేషన్ పాత చింతకాయ పచ్చడే
రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయలేదెందుకు?
రాహుల్పై మంత్రి కేటీఆర్ ధ్వజం
ఈనాడు, వరంగల్: ‘వరంగల్ రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ ఒక్క అవకాశం ఇవ్వాలని అడిగారు. ప్రజలు ఇప్పటికే పది అవకాశాలు ఇచ్చినా కాంగ్రెస్ ఏం వెలగబెట్టింది? మీది రైతు ప్రభుత్వమే అయితే పంజాబ్లో ఎందుకు ఓడిపోయారు?’ అని రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం వరంగల్ జౌళి పార్కులో కైటెక్స్ పరిశ్రమ, రూ.100 కోట్లతో మిషన్ భగీరథ పైపులైన్ నిర్మాణానికి శంకుస్థాపన, గణేశ ఎకోపెట్ పరిశ్రమ ప్రారంభోత్సవం అనంతరం మంత్రి దయాకర్రావు ఇంట్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. శుక్రవారం వరంగల్ కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ తెరాసపై చేసిన విమర్శలకు ఆయన ఘాటుగా బదులిచ్చారు. ‘‘రాహుల్ గాంధీకి అసలు ఏ పదవి ఉందో నాకు తెలీదు. మమ్మీ అధ్యక్షురాలు కాగా, డమ్మీగారు ఏ హోదాలో రైతు డిక్లరేషన్ చేశారో తెలియదు. మీరు చెప్పిన మాటలు వినడానికి ఇది 10 జనపథ్ కాదు.. తెలంగాణ జనపథం. రాహుల్ ఒక్క ఛాన్స్ ఇవ్వమంటున్నారు. ప్రజలు 50 ఏళ్లుగా పది అవకాశాలు ఇచ్చినా కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసింది? తెలంగాణలో రిమోట్ కంట్రోల్ పాలన ఉందని అంటున్నారు. రిమోట్ కంట్రోల్ పాలన మీ కాంగ్రెస్దే. సోనియా గాంధీ రిమోట్ పట్టుకొని ప్రధాని మన్మోహన్సింగ్ను ఆడించారు. అవినీతిపై మన్మోహన్ తెచ్చిన ఆర్డినెన్స్ను చెత్త బుట్టల్లో పడేసింది రాహుల్గాంధీయే. ఒకరొచ్చి మేము కాంగ్రెస్కు బీ టీం అని, మరొకరు భాజపాకు సీ అంటూ కారుకూతలు కూస్తున్నారు. మేం ఎవరికీ బీ, సీ టీం కాదు.. తెలంగాణకు తెరాస ఏ టీం. అవినీతిలో కాంగ్రెస్ పార్టీకే స్కాంగ్రెస్ అనే పేరుంది. స్పెక్ట్రమ్, హెలికాప్టర్, బొగ్గుగని కుంభకోణాలు.. ఇలా అన్నీ చేసింది మీరే. రాహుల్ తన వెంట దొంగను పెట్టుకుని తిరుగుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఓటుకు నోటు కుంభకోణంలో దొరికిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిని రాజు అంటున్నారు. నిజంగా రాచరిక పాలనే చేస్తే సీఎంపై పీసీసీ అధ్యక్షుడు మాట్లాడే మాటలకు ఆయన బయట తిరిగేవారేనా? మీ ముత్తాత మోతీలాల్నెహ్రూ నుంచి రాజీవ్గాంధీ వరకు చేసింది రాచరికపు పాలన. తాము పొత్తులు పెట్టుకోమని రాహుల్గాంధీ అంటున్నారు. అసలు మీతో పొత్తు పెట్టుకునే పార్టీ దేశంలో ఏదైనా ఉందా? గాంధీ భవన్ను గాడ్సే చేతిలో పెట్టారు. స్క్రిప్ట్ రాసిస్తే చదివే అమాయకుడు రాహుల్’’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
అత్యల్ప ఆత్మహత్యలు తెలంగాణలోనే..
ఏడు దశాబ్దాల్లో వ్యవసాయాన్ని కాంగ్రెస్ పాతర వేయగా కేసీఆర్ జాతరగా మార్చారని కేటీఆర్ అన్నారు. 2014లో 45 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే 2021లో 1.41 కోట్ల టన్నులను ప్రభుత్వం కొన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అత్యల్ప రైతు ఆత్మహత్యలున్న రాష్ట్రం ఏదని రేవంత్రెడ్డి పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు తెలంగాణయేనని ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు. ‘‘ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా క్రైసిస్ పార్టీ. వరంగల్లో రాహుల్ చేసిన డిక్లరేషన్ పాత చింతకాయ పచ్చడి. రూ.2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో ఎందుకు చేయలేదు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అంటున్నారు. మరి భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చింది బ్రిటిష్వాళ్లు. గొప్పదనం వాళ్లదా, కొట్లాడి తెచ్చుకున్న భారతీయులదా? తెలంగాణపై నిజంగా ప్రేమే ఉంటే ధాన్యం కొనాలంటూ దిల్లీలో మేం మొరపెట్టుకుంటే రైతుల కోసం రాహుల్ ఒక్క మాట ఎందుకు మాట్లాడలేదు. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టొద్దని ఎప్పుడైనా మాట్లాడారా? కాంగ్రెస్ హయాంలో రాష్ట్రానికి ఒరిగింది శూన్యం. ప్రజలెవరూ కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దు’’ అని కేటీఆర్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్