KTR: హ్యాట్రిక్ ఖాయం
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వదని ఇప్పటికే తేలిపోయిందని, వారిపై ఆశలు వదులుకున్నామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ తెలిపారు. తామే సొంతంగా ఉద్యోగాల కల్పనకు ప్రయత్నాలు...
వచ్చే ఎన్నికల్లోనూ తెరాసదే విజయం
కేంద్రం నిరర్ధకం.. ఆశలు వదులుకున్నాం
రాహుల్ అమేఠీలో గెలిచి మాట్లాడాలి
ట్విటర్లో ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానాలు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వదని ఇప్పటికే తేలిపోయిందని, వారిపై ఆశలు వదులుకున్నామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ తెలిపారు. తామే సొంతంగా ఉద్యోగాల కల్పనకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు తెలంగాణకు ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, ఎన్ఐడీ, ఐఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో ఒక్కటి కూడా కేటాయించలేదని, మున్ముందు ఇస్తుందనే నమ్మకం లేదని పేర్కొన్నారు. ట్విటర్లో ‘కేటీఆర్ను అడగండి’ శీర్షికన ఆదివారం నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెరాసకు కాంగ్రెస్, భాజపా సహా పలు ప్రతిపక్షాల నుంచి పోటీ ఉంటుందన్నారు. అయినా ప్రజల ఆశీర్వాదంతో తమ సుపరిపాలన కొనసాగేలా హ్యాట్రిక్ విజయం దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కన్నా గట్టిగా భాజపా, ప్రధాని మోదీ విధానాలను కేసీఆర్ నాయకత్వంలో తెరాస నిలదీస్తోందని చెప్పారు. ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ట్విటర్ ఇండియా ట్రెండింగ్లో ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. కేటీఆర్ ఇచ్చిన సమాధానాలు ఆయన మాటల్లోనే..
పెట్రో ధరల్లో మోదీ సర్కారు ప్రపంచ రికార్డు
* పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్లో మోదీ సర్కారు ప్రపంచ రికార్డులు సృష్టిస్తోంది. పెట్రోల్పై రాష్ట్ర ప్రభుత్వం పన్నులు తగ్గించాలని ప్రధానమంత్రి మాట్లాడటం... ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతోంది.
* గ్యాస్ సిలిండర్ ధర 2014లో రూ. 410 ఉండగా, ఇప్పుడు వెయ్యి రూపాయలు దాటింది. ఇది కేవలం మోదీ పాలనలోనే సాధ్యమైంది. అచ్ఛే దిన్ అంటే ఇలానే ఉంటాయని భాజపా చెబుతోంది. గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 పెరిగినప్పుడు యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శించిన స్మృతి ఇరానీ ఇప్పుడు కేంద్రమంత్రిగా స్పందించకపోవడం హిపోక్రసీ. కేంద్రంలో నిరర్ధక ప్రభుత్వం ఉంది. దానివల్ల భాజపాయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. కేంద్రంపై ఈ రాష్ట్రాలు కలిసికట్టుగా పోరాడాలి.
* కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డగోలుగా అమ్ముతున్న బీజేపీ అంటే ‘బేచో జనతాకీ ప్రాపర్టీ’ (ప్రజల ఆస్తులు అమ్మెయ్). రూ. 2500 కోట్లు ఇచ్చి కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి కొనుక్కోమని చెప్పారన్న ఆ రాష్ట్ర భాజపా ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఆ పార్టీ నిజస్వరూపాన్ని బయటపెట్టాయి.
* రాహుల్గాంధీ ముందు అమేఠీలో గెలిచి మాట్లాడాలి.
* సీఎం కేసీఆర్ తర్వాత దేశంలో నాకు అత్యంతమైన ఇష్టమైన నాయకుడు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం.
* రాష్ట్రంలో హత్యలకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చర్యలుంటాయి. భావప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేసే మాధ్యమాలపై చర్యలు తప్పవు.
వైద్యరంగంలో పురోగమనం
కరోనా సంక్షోభం తర్వాత ఆరోగ్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం పెద్దఎత్తున మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించింది. ఇప్పటికే హైదరాబాద్లో మూడు టిమ్స్ ఆస్పత్రులను నిర్మిస్తోంది. వీటిపాటు మొత్తం 33 జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రారంభం కానున్నాయి.
* భవన నిర్మాణ క్రమబద్ధీకరణ పథకం (బీఆర్ఎస్) హైకోర్టులో పెండింగ్లో ఉంది. దాన్ని త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. హైదరాబాద్లో త్వరలోనే వంద శాతం మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్లు స్థాపిస్తాం. తద్వారా హుస్సేన్సాగర్తో పాటు ఇతర చెరువుల్లో కాలుష్యం తగ్గుతుంది. నాగోల్ ఫ్లైఓవర్ ఆగస్టు నాటికి ప్రారంభమవుతుంది.
తండ్రిగా గర్వపడుతున్నా
నా కుమారుడు హిమాన్ష్ తను చదివే పాఠశాలలో క్రియేటివ్ యాక్షన్ ప్లాన్కి ప్రాతినిధ్యం వహించడం ఆనందంగా ఉంది. ఒక తండ్రిగా గర్వపడుతున్నా.
ఏదైనా జరగొచ్చు
తెరాసను జాతీయస్థాయిలో విస్తరించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు.. ‘భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చ’ని మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘మీ సేవలు, మీ నాయకత్వం జాతీయస్థాయిలో కావాలని’ మరో నెటిజన్ అడగ్గా.. తెలంగాణ ప్రజలకు సేవ చేయడంలో సంతోషంగా ఉన్నానని మంత్రి తెలిపారు.
త్వరలోనే డబుల్ డెక్కర్ బస్సులు
హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల ఈకో సిస్టం అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తుంది. డబుల్ డెక్కర్ బస్సులకు సంబంధించిన ఏర్పాట్లపై హెచ్ఎండీఏ, టీఎస్ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
క్రికెట్ మ్యాచ్లపై గంగూలీ, జైషాలే జవాబివ్వాలి
హైదరాబాద్లో ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్లు ఎందుకు నిర్వహించడం లేదో బీసీసీఐ పెద్దలు సౌరవ్ గంగూలీ, జైషాలు సమాధానమివ్వాలి. రాష్ట్రంలో అన్ని రకాల క్రీడలకు సహకారమిస్తూ నూతన విధానాన్ని సిద్ధం చేస్తున్నాం.
గ్రూపు-1పై అపోహలొద్దు
తెలుగు భాషలాగే ఉర్దూను రాజ్యాంగం గుర్తించింది. చాలా రాష్ట్రాలు ఉర్దూలో పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. గ్రూపు-1లో ఉర్దూపై కొన్ని పార్టీలు చేసే తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు.
నిమ్జ్తో పెట్టుబడుల వెల్లువ
జహీరాబాద్లో జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి రాష్ట్రానికి కీలకమైంది. ఇప్పటికే పెద్దఎత్తున పెట్టుబడిదారులు పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు భూసేకరణ జరుగుతోంది. ఒకప్పుడు కరవు కాటకాలతో తల్లడిల్లిన పాలమూరు జిల్లా పచ్చగా మారడం సంతోషంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.