Telangana News: బిల్లో.. మొర్రో
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడం లేదు. కొన్నిచోట్ల సర్పంచులు సొంతంగా ఖర్చుపెట్టి పనులు చేసినప్పటికీ, అయిదారు నెలలుగా ఆ బిల్లులు మంజూరు కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
పంచాయతీలలో చేసిన అభివృద్ధి పనులకు మంజూరు కాని బిల్లులు
ఆరు నెలలుగా ఆర్థికశాఖలో పెండింగ్.. ఆందోళనలో సర్పంచులు
మూడు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకూ అందని వేతనాలు
ఈనాడు - హైదరాబాద్
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడం లేదు. కొన్నిచోట్ల సర్పంచులు సొంతంగా ఖర్చుపెట్టి పనులు చేసినప్పటికీ, అయిదారు నెలలుగా ఆ బిల్లులు మంజూరు కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఉద్యోగుల వేతనాలు, విద్యుత్తు ఛార్జీలు మినహా సగటున ఒక్కో గ్రామంలో 3-6 నెలల వరకు బిల్లులన్నీ ఆర్థికశాఖ వద్ద పెండింగ్లో ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులకూ మూడు నెలలుగా జీతాల్లేవు. అసలే డబ్బులు రాక ఇబ్బందుల్లో ఉంటే మరో పక్క ఈ నెల నుంచి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి కింద చేపట్టాల్సిన పనులను చూసి సర్పంచులు, పాలకవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. గ్రామాల్లో జనాభా, కేటగిరీ వారీగా సగటున రూ.లక్షన్నర నుంచి రూ.6 లక్షల వరకు నిధులు మంజూరు కావాల్సి ఉంది. కొన్ని గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ పనులు కలిపితే రూ.లక్షల్లో నిలిచిపోయాయి. రాష్ట్రంలోని 12,769 గ్రామాలకు ప్రభుత్వం ప్రతినెలా నిధులు విడుదల చేస్తోంది. ఇవి పంచాయతీ ఖాతాల్లో కనిపిస్తున్నప్పటికీ, వీటిని నేరుగా వినియోగించకుండా ఆర్థికశాఖ ఆంక్షలు అడ్డుగా నిలుస్తున్నాయి. పంచాయతీ కార్యదర్శులు జారీ చేసిన చెక్కులు సబ్, జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో పాస్ అవుతున్నా, చివర్లో ప్రభుత్వ అనుమతి పేరిట ఆర్థికశాఖలో నిలిచిపోతున్నాయి. ఆర్థిక సంవత్సరం మార్చితో ముగియడంతో మళ్లీ బిల్లుల వ్యవహారం మొదటికొచ్చింది. కొన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు, గ్రామ పంచాయతీ భవనాలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీరోడ్లు, మురుగు కాలువలకు సంబంధించిన బిల్లులు ఏడాదిన్నరగా పెండింగ్లో ఉన్నాయి. వీధి దీపాల మరమ్మతుల బిల్లులు పంచాయతీరాజ్ శాఖ మంజూరు చేయడం లేదు. ఎల్ఈడీ దీపాల నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీలకు అప్పజెప్పాలన్న నిర్ణయానికి సర్పంచులు, పాలకవర్గాలు వ్యతిరేకంగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
ఇవీ ఉదాహరణలు..
* ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని ఇనగాలి గ్రామంలో సర్పంచి యరమల వెంకట్రెడ్డి.. ఎస్సీ కాలనీలో రూ.4.5 లక్షలతో డ్రెయిన్, బీసీ కాలనీలో రూ.3.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారు. ఈ బిల్లులు ఫిబ్రవరి నుంచి నేటికీ మంజూరు కాలేదు.
* కరీంనగర్ జిల్లా శంకరంపట్నం మండలం అంబాల్పూర్ గ్రామ సర్పంచి రూ.7లక్షలు ఖర్చుపెట్టి శ్మశాన వాటిక నిర్మించారు. పైసలు రాక ఏడాదిన్నరైంది. కరీంపేటలో రూ.5 లక్షలు ఖర్చుచేసి నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం బిల్లులు విడుదల కాలేదు.
* కామారెడ్డిలోని 8 వేల జనాభా కలిగిన ఓ మేజర్ గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు, ఇతర పనులకు ఖర్చుచేసిన రూ.6 లక్షలు ఆరు నెలలగా మంజూరు కాలేదు.
* మెదక్లోని 5 వేల జనాభా కలిగిన గ్రామ పంచాయతీలో డీజిల్ ఖర్చులు, తాగునీటి పైపులు, విద్యుత్తు దీపాలు, బ్లీచింగ్ పౌడర్ తదితర పనులకు వెచ్చించిన నిధులు రూ.లక్షన్నర పెండింగ్లో ఉన్నాయి. వీటి మంజూరుకు నవంబరులో చెక్కులు జారీ చేసినా, మార్చి 31 నాటికి ఆమోదం పొందకపోవడంతో అవి తిరస్కారానికి గురయ్యాయి. దీంతో కొత్తగా చెక్కులు జారీ చేసినా ఇంకా డబ్బులు రాలేదు.
సర్పంచినయ్యా.. జర భిక్షం వెయ్యండయా..!
చిత్రంలో నిక్కర్, బనియన్ వేసుకుని కనిపిస్తున్న వ్యక్తి నల్గొండ జిల్లా మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచి మిర్యాల వెంకన్న.. చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు కాక ఆవేదనతో సోమవారం పాలకవర్గం, కార్మిక సిబ్బందితో కలిసి భిక్షాటన చేశారు. పంచాయతీ కార్మికులతో అనేక పనులు చేయించుకుంటున్నామని...మూడు నెలలుగా వేతనాలు అందక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. భిక్షాటన ద్వారా రూ.10 వేలు సమకూరగా ఆ నగదును సిబ్బందికి అప్పజెప్పినట్లు సర్పంచి వివరించారు. ఈ పంచాయతీలో అభివృద్ధి పనులకు సంబంధించి రూ.40 లక్షల బిల్లులు ఏడు నెలలుగా పెండింగ్లో ఉన్నాయి.
- న్యూస్టుడే, మునుగోడు
వేతనం పెరగలేదు... ఉన్నదీ రావడంలేదు..
పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. మూడు నెలలుగా వేతనాలు రావడం లేదు. ప్రస్తుతం వీరి నెల జీతం రూ.8,500. వేతన సవరణ అమల్లోకి వచ్చినప్పటికీ.. కార్మికులకు 30 శాతం పెంపు జరగలేదు. చాలీచాలని జీతాలు.. అవి కూడా రెండు, మూడు నెలలకోసారి వస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్