KTR: అదే ద్రోహం.. అవే అబద్ధాలు: అమిత్‌షా పర్యటనపై కేటీఆర్‌

భాజపా ద్రోహచింతన, అబద్ధాలతో జీవిస్తోందని మంత్రి కేటీఆర్‌ అమిత్‌షా పర్యటన అనంతరం ట్విటర్‌లో ధ్వజమెత్తారు. గత ఎనిమిదేళ్లుగా తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని... ఇప్పుడూ అదే నిర్లక్ష్యం కొనసాగుతోందన్నారు.

Updated : 15 May 2022 07:22 IST

 

హైదరాబాద్‌: భాజపా ద్రోహచింతన, అబద్ధాలతో జీవిస్తోందని మంత్రి కేటీఆర్‌ అమిత్‌షా పర్యటన అనంతరం ట్విటర్‌లో ధ్వజమెత్తారు. గత ఎనిమిదేళ్లుగా తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని... ఇప్పుడూ అదే నిర్లక్ష్యం కొనసాగుతోందన్నారు. ‘‘భాజపా(బక్వాస్‌, జుమ్లా పార్టీ) అంటేనే మతిలేని, బూటకపు హామీల పార్టీ. తెలంగాణలో రాజకీయ పర్యాటక సీజన్‌ కొనసాగుతోంది. మొన్ననే ఒక పర్యాటకుడు వచ్చి వెళ్లారు. ఇప్పుడు మరో పర్యాటకుడు వచ్చారు. తిన్నారు..తాగారు..వెళ్లారు (ఖాయా, పియా...చల్‌దియా).’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని