Unseasonal Rains: కల్లాల నిండా కన్నీళ్లే
ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యాన్ని అమ్మేందుకు కొనుగోలు కేంద్రాలకు తెస్తున్న రైతులు నష్టపోతున్నారు. తరుగు పేరుతో అధిక ధాన్యం తీసుకుంటూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఒకవైపు నష్టపరుస్తుంటే మరోవైపు వర్షంలో ధాన్యం రాశులు కొట్టుకుపోతున్నాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఎక్కడో గ్రామాల పక్కన పొలాల్లో సరైన సౌకర్యాలు లేనిచోట ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే కాకుండా..
వ్యవసాయ మార్కెట్లలోనే వడ్లకు రక్షణ కరవు
కొనుగోలు కేంద్రాల్లో వర్షాలకు కొట్టుకుపోయిన పంట
రోజుల తరబడి కొనకపోవడంతో అన్నదాతకు తీరని నష్టం
ఈ పరిస్థితుల్లోనూ తరుగు పేరుతో తీర్మానాలు చేస్తున్నారని రైతుల ఆవేదన
ఈనాడు, హైదరాబాద్: ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యాన్ని అమ్మేందుకు కొనుగోలు కేంద్రాలకు తెస్తున్న రైతులు నష్టపోతున్నారు. తరుగు పేరుతో అధిక ధాన్యం తీసుకుంటూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఒకవైపు నష్టపరుస్తుంటే మరోవైపు వర్షంలో ధాన్యం రాశులు కొట్టుకుపోతున్నాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఎక్కడో గ్రామాల పక్కన పొలాల్లో సరైన సౌకర్యాలు లేనిచోట ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే కాకుండా.. పక్కా సదుపాయాలతో ఉన్నాయని చెప్పే వ్యవసాయ మార్కెట్లలోనే వర్షపునీటిలో ధాన్యం కొట్టుకుపోతుండటంతో తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని పలువురు వాపోతున్నారు.
రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వారం రోజులుగా రోజూ హెచ్చరిస్తోంది. ‘అసని’ తుపాను వల్ల అక్కడక్కడా వానలు పడ్డాయి. ఆది, సోమవారాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన వానల వల్ల ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. రాష్ట్రంలో నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం, మెదక్, సంగారెడ్డి తదితర జిల్లాల్లో వడ్లు నీటి పాలయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో తమ పంటను సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్లనే ఈ దుస్థితి దాపురించిందని రైతులు వాపోతున్నారు. రైతులు ఆరబోసిన ధాన్యాన్ని కాపాడేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్వాహకులు, అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు.
ఇష్టమొచ్చినట్లు కొనుగోళ్లు
రైసుమిల్లర్లు చెప్పినట్లు వినకపోతే లారీల్లో నుంచి మిల్లుల వద్ద ధాన్యం వెంటనే దింపుకోకుండా ఆలస్యం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా లచ్చపేటలో ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తున్నారని రైతులు ఇటీవల మిల్లు యాజమాన్యాన్ని నిలదీయడంతో రైసుమిల్లర్లు కుమ్మక్కై 4 రోజులు లారీల్లో నుంచి ధాన్యం దింపకుండా సహాయ నిరాకరణ చేశారు. వారిని అధికారులు బుజ్జగించి తిరిగి కొనుగోళ్లు ప్రారంభించేసరికి అధిక వర్షాలకు ధాన్యం కొట్టుకుపోయి రైతులు నష్టపోయారు. ఒక్క కామారెడ్డి జిల్లాలోనే 100 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిందంటే నష్టతీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
తీర్మానాలు చేసి ఇవ్వాలా...
రైతు అమ్మకానికి తెచ్చే ధాన్యాన్ని 40 కిలోల చొప్పున ఒక్కో బస్తాలో తూకం వేసి కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తీసుకోవాలి. కానీ ధాన్యంలో తేమ ఉందనే సాకు చూపుతూ బస్తాకు మరో 2 నుంచి 3 కిలోలు పెంచి 42 లేదా 43 కిలోలు ఇవ్వాలని చెప్పి రైతులను దోచుకుంటున్నారు. ఇలా క్వింటా ధాన్యానికి అయిదారు కిలోలు అదనంగా తరుగు పేరుతో దోచేస్తున్నారు. రైతులు ఎదురు తిరిగితే వారి ధాన్యం 15 రోజులైనా కొనకుండా ఆపేస్తున్నారు. తరుగు పేరుతో దోచుకుంటున్నారని రైతులు ప్రశ్నించకుండా ఉండేందుకు కొన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు, రైసుమిల్లర్లు ఎత్తులు వేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసిన ‘ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు’(ప్యాక్స్) లేదా ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) నిర్వాహకులు రైతులను ముందుగానే పిలిచి తాము తరుగు స్వచ్ఛందంగా బస్తాకు 2 లేదా 3 కిలోలు ఇస్తున్నామని, సంఘం తరఫున తీర్మానం చేసి రాసిస్తున్నారు. ఇలా అదనంగా తరుగు ఇవ్వడానికి ముందుకొచ్చేవారివి మాత్రమే కొంటున్నారు. దీనికితోడు లారీలు సరిపోయినన్ని లేకపోవడంతో రవాణాలో జాప్యం జరిగి వర్షాలకు కేంద్రాల్లోనే తడిసిపోతున్నాయి. రైతు ధాన్యం అమ్మినా వాటిని లారీ వచ్చి అందులో లోడింగ్ చేసి రైసుమిల్లు వద్దకు తీసుకెళ్లి అన్లోడింగ్ చేసి అప్పగించేదాకా కొన్నట్లు రశీదులు ఇవ్వడం లేదు. లారీలో వెళ్లి దింపేదాకా రైతులదే బాధ్యతని చెప్పడంతో రోజుల తరబడి ఆలస్యమై వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోతున్నారు.
తూకాలు ఆపి ముంచేశారు..!?
ఈ చిత్రంలో రైతు పేరు పోతారవేని వెంకటేశం. ఇది కరీంనగర్ జిల్లా గంగాధర వ్యవసాయ మార్కెట్. 10 రోజుల కిందట వరి ధాన్యం 150 క్వింటాళ్లను తెస్తే ఇంతవరకూ కొనలేదని వర్షాలకు తడిసి పాడైందని ఆయన వాపోయారు. వానలు పడే సూచనలున్నా ఆదివారం మార్కెట్ మూసివేశారని, అదేరోజు రాత్రి వాన కురవడంతో సోమవారం తూకాలు వేయడం ఆపేశారని, మళ్లీ ఎండలకు ఆరబెట్టి తేమ తగ్గాక కొంటామనిచెప్పారని వాపోయారు.
వ్యవసాయ మార్కెట్లోనే ఇలా ఉంటే ఎలా..?
వర్షపునీటిలో కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఏరుకుంటున్న రైతు దంపతుల పేర్లు బెస్త గంగయ్య, పోచవ్వ. వీరు ఎకరా వరి సాగు చేసి ధాన్యాన్ని అమ్మేందుకు కామారెడ్డి జిల్లా గాంధారి వ్యవసాయ మార్కెట్కు తెచ్చారు. వారం నుంచి ఆరబోస్తున్నారు. కొనుగోలులో తీరని జాప్యం కారణంగా ఆదివారం కురిసిన వర్షాలకు నీటిలో ధాన్యం కొట్టుకుపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మకానికి తెచ్చిన 2 లేదా 3 రోజులకైనా కొని ఉంటే తమకు నష్టం తప్పేదన్నారు. ఇదే మార్కెట్లో అమ్మేందుకు ధాన్యం తెస్తే 10 రోజులైనా కొనలేదని, దీంతో వర్షాలకు తడిసి కొట్టుకుపోయిందని రైతు ఎన్.గంగాధర్ ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు