KTR: ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ రండి!
రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలైన వరంగల్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్నగర్ వంటి ప్రాంతాలూ వ్యాపారానికి ఎంతో అనుకూలమని మంత్రి కేటీఆర్ అన్నారు. అక్కడా పెట్టుబడులకు ముందుకురావాలని పలు
అక్కడా వ్యాపారానికి అనుకూల పరిస్థితులు
బెంగళూరుతో కాదు సింగపూర్, హాంకాంగ్తోనే మాకు పోటీ
హైదరాబాద్లో కొలియర్స్, శూరిఫై సంస్థల కార్యాలయాల ప్రారంభోత్సవంలో కేటీఆర్
రాయదుర్గం, న్యూస్టుడే: రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలైన వరంగల్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్నగర్ వంటి ప్రాంతాలూ వ్యాపారానికి ఎంతో అనుకూలమని మంత్రి కేటీఆర్ అన్నారు. అక్కడా పెట్టుబడులకు ముందుకురావాలని పలు వ్యాపార సంస్థలకు ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని రాయదుర్గం మైహోం ట్విట్జా ఐటీ భవనంలో స్థిరాస్తి, పెట్టుబడుల సలహాల సంస్థ కొలియర్స్, బీమా సేవల సంస్థ శూరిఫై ల్యాబ్, టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల కార్యాలయాలను విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..2012-13లో హైదరాబాద్లో ఏడాదికి కేవలం రెండు మిలియన్ చదరపు అడుగుల స్థలంలో వివిధ సంస్థల కార్యాలయాలు, వాణిజ్య అవసరాల కేంద్రాలను ఏర్పాటు చేసుకోగా గత ఏడాది 11 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని వినియోగించుకున్నాయని తెలిపారు. పలు త్రైమాసికాల్లో ఆయా సంస్థలు అద్దెకు దిగిన స్థలం బెంగళూరును మించిపోయిందని చెప్పారు. తాము పోటీపడేది బెంగళూరుతో కాదని.. హాంకాంగ్, సింగపూర్, ఇతర ప్రపంచస్థాయి నగరాలతోనేనని కేటీఆర్ పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసి సంస్థలను నడిపారన్నారు. ఈ క్రమంలోనే పారిశ్రామికవేత్తలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శూరిఫై సంస్థ ఉద్యోగులు, అధికారులు సంప్రదాయ దుస్తుల్లో హాజరైన అంశాన్ని మంత్రి ప్రస్తావిస్తూ.. తాను ఐటీ కంపెనీకి వచ్చినట్లు లేదని, అందరం కలిసి దసరా, సంక్రాంతి పండగలు జరుపుకొంటున్నట్లు ఉందంటూ ఉద్యోగులను అభినందించారు. మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో మంత్రి కేటీఆర్ హైదరాబాద్ను ఎనిమిదేళ్ల కాలంలోనే సింగపూర్ మాదిరిగా అభివృద్ధి చేశారన్నారు. శూరిఫై సీఈవో డస్టిన్ మాట్లాడుతూ.. తమ సంస్థ ఎనిమిదేళ్ల క్రితం ఒకరితో ఆరంభమై ప్రస్తుతం 320 మంది ఉద్యోగులతో నడుస్తోందన్నారు.
వారిలో 220 మంది హైదరాబాద్లోనే పనిచేస్తున్నారన్నారు. కొలియర్స్ ఇండియా సీఈవో, ఆసియా మార్కెటింగ్ డెవలప్మెంట్ ఎండీ రమేష్ నాయర్ మాట్లాడుతూ.. స్థిరాస్తి, పెట్టుబడుల్లో సలహాలు అందించే తమ సంస్థ 62 దేశల్లో కార్యకలాపాలు సాగిస్తోందని, 17వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, సైయంట్ సంస్థ వ్యవస్థాపకుడు బీవీఆర్ మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎనిమిదేళ్లలో గణనీయ ప్రగతి: కేటీఆర్
రాయదుర్గం, న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ఎనిమిదేళ్లలో తెలంగాణ గణనీయ ప్రగతి సాధించిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో సీనియర్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారులకు మిడ్ కెరీర్ ట్రెయినింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆ అధికారులతో నిర్వహించిన ముఖాముఖిలో మంత్రి ప్రసంగించారు. జనాభా పరంగా దేశంలో అయిదో పెద్ద నగరంగా ఉన్న హైదరాబాద్ ఐటీ, ఫార్మా తదితర రంగాల్లో అగ్రస్థానంలో ఉందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
యూటీఎస్ యాప్ పరిధి పెంపు
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు. -
ఏఈ పోస్టుల జనరల్ ర్యాంకు జాబితా వెల్లడి
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీజీపీ రవిగుప్తాకు పరిహారం చెల్లించండి
పనిచేయని రిక్లైనర్ సీటును కేటాయించి తీవ్ర అసౌకర్యం కలిగించడం, బిజినెస్(జెడ్) క్లాస్ టికెట్లో ఎకానమీ క్లాస్ సేవలందించిన నేపథ్యంలో డీజీపీ దంపతులకు రూ.2,07,500 పరిహారం చెల్లించాలని సింగపూర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3 ఆదేశించింది. -
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. -
ఖానాపూర్ అడవుల్లో చిరుత సంచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి. -
కాళేశ్వరంపై సత్వర విచారణ
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ తెలిపారు. -
మండుతున్న ఎండలు.. భగ్గుమంటున్న అడవులు
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది.