హక్కున చేర్చుకోరూ!
ఇది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని జవహర్నగర్. 350 ఎకరాల గ్రామకంఠానికి తోడు 750 ఎకరాల ప్రభుత్వ భూమిలో విస్తరించి ఉంది. 18 వేల ఆవాసాలున్నాయి. కేవలం గ్రామకంఠం పరిధిలోని గృహాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంది.
గ్రామకంఠాలు, ఇతరత్రా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకున్నోళ్ల తిప్పలు
పలు సమస్యలతో క్రమబద్ధీకరణకు దూరం
హక్కులు కల్పించాలని విన్నపాలు
ఇది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని జవహర్నగర్. 350 ఎకరాల గ్రామకంఠానికి తోడు 750 ఎకరాల ప్రభుత్వ భూమిలో విస్తరించి ఉంది. 18 వేల ఆవాసాలున్నాయి. కేవలం గ్రామకంఠం పరిధిలోని గృహాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంది. 2014-16 మధ్య మొదటిసారి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసినా భూములపై స్పష్టత లేకపోవడంతో చేపట్టలేదు. పైగా చెల్లించిన రూ.7.50 కోట్ల మొత్తాన్నీ వెనక్కు ఇవ్వలేదు. ఈ ఏడాది మార్చిలోనూ కొందరు దరఖాస్తు చేశారు.
ఈనాడు, హైదరాబాద్: గ్రామకంఠం పరిధి దాటి సర్కారు భూముల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి యాజమాన్య హక్కుల కల్పన అందని ద్రాక్షగా మారింది. సింగరేణి సంస్థ వెనక్కు ఇచ్చేసిన.. మాజీ సిపాయిలకు కేటాయించి తిరిగి తీసుకున్న.. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారికి ఏళ్ల తరబడి హక్కులు దక్కడం లేదు. క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పలు ఉత్తర్వులు జారీచేసినప్పటికీ క్షేత్రస్థాయిలోని సమస్యలతో ప్రజలు ఉపయోగించుకోలేక పోతున్నారు.
ఇక్కడ నోటరీయే హక్కు పత్రం
నగరం చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని నగర పాలక, పురపాలికల్లో పెద్ద ఎత్తున నోటరీ పత్రాలపైనే లావాదేవీలు సాగుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారు ఒక్కో కాలనీలో వేల సంఖ్యలో ఉన్నారు. వారికి స్థలాలపై ఎలాంటి హక్కులు లేవు. గ్రామకంఠం పరిధిలోని గృహాలకు జారీచేసిన ఇంటి నంబర్లు, విద్యుత్తు, నాలా కనెక్షన్లను ఈ కాలనీల్లోనూ ఇస్తున్నారు. జగద్గిరిగుట్ట, రోడామిస్త్రీనగర్, శ్రీరాంనగర్, శ్రీనివాస్నగర్, లెనిన్నగర్, గిరినగర్, గాజులరామారంతో పాటు 35 కాలనీల్లోని 50 వేల నివాసాల్లో 25 వేల ఇళ్లకు హక్కులు రాలేదని అంచనాలున్నాయి. దుండిగల్, కొంపల్లి పురపాలక సంఘాలు, నిజాంపేట నగరపాలక సంస్థ పరిధిలోనూ 17 వేల ఇళ్లలో సగం వరకు హక్కులు లేనివే.
సింగరేణి ప్రాంతాల్లో రుసుం సమస్య
సింగరేణి సంస్థ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికీ అనేక సమస్యలున్నాయి. కొత్తగూడెం, ఇల్లెందు, రామగుండం, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి తదితర ప్రాంతాల్లో 2006, 08లలో క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2017, 18లలోనూ పలు జీవోల ద్వారా ఈ అవకాశాన్ని పొడిగించింది. కుటుంబ వివాదాలు, నల్లా, విద్యుత్తు కనెక్షన్ల ధ్రువీకరణ పత్రాలు లేనివారు దరఖాస్తు చేయలేకపోయారు. సింగరేణి ప్రాంతం వరకు ఇచ్చిన ప్రత్యేక జీవోలతో క్రమబద్ధీకరణకు చాలా తక్కువ రుసుం ఉంటుందని, జీవోలు 58, 59ల కింద ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోందని పలువురు చెబుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 1970 చట్టం అమల్లో ఉన్న ప్రాంతాల్లోని ఇళ్లకు హక్కుల కల్పన క్లిష్టంగా మారింది. ఏజెన్సీ చట్టం అమల్లోకి రాకముందు ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి, వారి తదనంతరం వారసులకు మాత్రమే హక్కులు కొనసాగుతున్నాయి. గిరిజనేతరులకు చెందిన భూములకు రిజిస్ట్రేషన్లు లేవు. తరాల నుంచి నివాసం ఉంటున్న తమకు హక్కులు కల్పించాలని వారు కోరుతున్నారు. పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, భూపాలపల్లి, ఏటూరునాగారం, నిర్మల్, ఉట్నూరు తదితర పట్టణాల్లోనూ ఈ సమస్య ఉంది.
సర్కారు దృష్టి సారిస్తే..
నోటరీ స్థలాలు, సింగరేణి భూములు, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న సమస్యలను తొలగిస్తే ప్రభుత్వానికి¨ కూడా రాబడి పెరిగే అవకాశాలున్నాయి. భూముల ధరలు పెద్దఎత్తున ఉన్న పట్టణాల్లో సులువుగా క్రమబద్ధీకరణ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటే హక్కుల కల్పనతో పాటు ఆర్థికశక్తిని పెంచినట్లవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న వారు నోటరీ పత్రాలపై లావాదేవీలు నిర్వహిస్తూనే ఉన్నారని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని చెబుతున్నారు. ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి చట్ట పరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని చెబుతున్నారు.
సర్వే నంబర్లు 141, 142, 143లలో కొత్తగూడెం పట్టణం విస్తరించింది. 22,631 గృహాలుండగా సగం స్థలాలకే హక్కులున్నాయి. మొదటి దశ క్రమబద్ధీకరణ ప్రక్రియలో 11,431 దరఖాస్తులు రాగా ఏడు వేల వరకు పట్టాలు జారీ చేశారు.ఈ ఏడాది మార్చిలోనూ నాలుగు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా కేంద్రమైన గూడెంలో భూముల విలువ భారీగా పెరిగిన నేపథ్యంలో నివాస స్థలాలన్నింటికీ సింగరేణి ప్రాంత జీవోల ఆధారంగా హక్కులు కల్పిస్తే రుణాలు తీసుకోవడానికి, పిల్లల వివాహాలు, చదువులకు తోడ్పాటు లభిస్తుందని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి
-
పాలిటెక్నిక్ లెక్చరర్స్ జీఆర్ఎల్ వెల్లడి
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను (జీఆర్ఎల్) టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీఎంఈ పరిధిలోని.. 16,024 మంది సిబ్బంది సేవల పొడిగింపు
వైద్య విద్య డైరెక్టర్(డీఎంఈ) పరిధిలోని వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, గౌరవవేతనంతో విధులు నిర్వహిస్తున్న 16,024 మంది సిబ్బంది సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి 4 టీఎంసీలు తరలించిన ఏపీ: తెలంగాణ ఫిర్యాదు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు దిగువన విద్యుత్ ఉత్పత్తికోసం నిర్మించిన టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోయిందని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. -
ఇచ్చంపల్లి నుంచే కావేరికి.. గోదావరి జలాలు
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదిపై ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మాణం చేపట్టి, అక్కణ్నుంచి కావేరి పరీవాహకానికి నీటిని తరలించాలని దాదాపు నిర్ణయానికొచ్చారు. -
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటేసిన సరిహద్దు గ్రామాల ఓటర్లు!
కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు మధ్య 12 వివాదాస్పద గ్రామాలున్నాయి. -
కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల స్వాధీనం
వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
రికార్డు స్థాయిలో వేసవి రైళ్లు
వేసవి కాలంలో పెరిగే రాకపోకలకు అనుగుణంగా ఈసారి రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. -
బతుకమ్మ చీరల బకాయిలు రూ.50 కోట్లు విడుదల
బతుకమ్మ చీరల తయారీకి సంబంధించి నేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం అధికారులను ఆదేశించారు. -
నటుడు రఘుబాబు అరెస్టు.. బెయిలు
నార్కట్పల్లి- అద్దంకి రహదారిపై ఈ నెల 17న నల్గొండ పట్టణ సమీపంలో సినీ నటుడు ఎర్ర రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడు జనార్ధన్రావు మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లపై వివరణ ఇవ్వండి
ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లు ఉండాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
గురుకులంలో అల్పాహారం వికటించి 25 మందికి అస్వస్థత
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో అల్పాహారం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎస్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి దంపతులు శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో మరో ఎస్సై సస్పెన్షన్
పోలీసు శాఖలో సస్పెన్షన్ల పరంపర కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం ఆరుగురు పోలీస్ అధికారులను, సిబ్బందిని మల్టీజోన్-1 ఐజీ సస్పెండ్ చేయగా.. తాజాగా మరో ఎస్సైపై వేటు పడింది. -
దేశంలో మరో 114 కృషి విజ్ఞాన కేంద్రాలు
వ్యవసాయరంగ అభివృద్ధితోపాటు రైతులకు విస్తృతమైన సేవలందించేందుకు దేశంలో మరో 114 కృషి విజ్ఞాన కేంద్రాల(కేవీకే)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐకార్) డైరెక్టర్ జనరల్ హిమాన్ష్ పాఠక్ తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!