TRS: తెరాస రాజ్యసభ అభ్యర్థుల ఖరారు
తెరాస రాజ్యసభ అభ్యర్థుల పేర్లను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నమస్తే తెలంగాణ పత్రిక సీఎండీ దీవకొండ
ఈనాడు, హైదరాబాద్: తెరాస రాజ్యసభ అభ్యర్థుల పేర్లను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నమస్తే తెలంగాణ పత్రిక సీఎండీ దీవకొండ దామోదర్రావు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, హెటిరో ఛైర్మన్ బండి పార్థసారథిరెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా తెరాస నేత, గ్రానైట్ పరిశ్రమల అధినేత వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)లను అభ్యర్థులుగా ఆయన ప్రకటించారు. బుధవారం ప్రగతిభవన్లో వారికి బి-ఫారాలను అందజేశారు. వీరిలో ఎమ్మెల్సీగా ఎన్నికై రాజీనామా చేసిన బండా ప్రకాశ్ స్థానం కోసం జరగనున్న ఉపఎన్నికకు ఈ నెల 19న వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ వేయనున్నారు. రెండేళ్ల పదవీ కాలం ఉంది. గతంలో ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన ప్రకాశ్ సైతం వరంగల్ జిల్లా వారే. కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్ల పదవీ విరమణతో ఖాళీ అయ్యే రెండు స్థానాలకు దామోదర్రావు, పార్థసారథిలు నామినేషన్లు వేయనున్నారు. ఈనెల 24 నుంచి 31 వరకు గడువు ఉంది. మూడు స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై కొన్ని రోజులుగా కేసీఆర్ ముమ్మర కసరత్తు చేశారు. ఉద్యమ సహచరుడైన దామోదర్రావు, పారిశ్రామికవేత్త పార్థసారథిరెడ్డి, బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన రవిచంద్రలను ఎంపిక చేశారు.
అభ్యర్థి : బండి పార్థసారథిరెడ్డి
పుట్టిన తేదీ : 1954, మార్చి6
స్వగ్రామం : ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు
విద్యాభ్యాసం : ఆర్గానిక్ కెమిస్ట్రీ (ఓయూ)లో ఎంఎస్సీ, సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ
కుటుంబం : భార్య, కుమారుడు
వృత్తి జీవితం: సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన పార్థసారథిరెడ్డి డిగ్రీ అనంతరం ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తూనే హెటిరో సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ఇప్పుడు దేశంలోని టాప్ 10 కంపెనీలలో ఒకటిగా కొనసాగుతోంది. 18 వేల మంది యువతకు ఉద్యోగాలిచ్చింది. హెటిరో సంస్థ బాధ్యతలను నిర్వహిస్తూనే.. భారత ప్రభుత్వానికి చెందిన డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్, బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్, జాతీయ సైన్స్ కాంగ్రెస్ సభ్యునిగా పనిచేశారు. ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యునిగా కూడా కొనసాగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2017లో ఇచ్చిన బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డుతో పాటు అనేక పురస్కారాలు పొందారు. సాయి స్ఫూర్తి ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతో పాటు.. గ్రామీణ నీటిసరఫరా కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. మంత్రి కేటీఆర్కు సన్నిహితుడు.
అభ్యర్థి : దీవకొండ దామోదర్రావు
పుట్టిన తేదీ : 1958 ఏప్రిల్ 1
స్వగ్రామం : జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు
విద్యాభ్యాసం : ఎల్ఎల్బీ (ఉస్మానియా)
కుటుంబం : భార్య, కుమార్తె, కుమారుడు
వృత్తి జీవితం : కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఆయన వెంట నడిచిన వ్యక్తుల్లో ఒకరు. 2001 నుంచి తెరాసలో పలు హోదాల్లో పని చేశారు. టీ న్యూస్, నమస్తే తెలంగాణ పత్రికల వ్యవస్థాపనలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ పబ్లికేషన్స్ (నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికలు)కు ఛైౖర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా వ్యవహరిస్తున్నారు.
అభ్యర్థి : వద్దిరాజు రవిచంద్ర
పుట్టిన తేదీ : 1964, మార్చి 22
స్వగ్రామం : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి
విద్యాభ్యాసం : బీకాం
కుటుంబం : భార్య, కుమార్తె, కుమారుడు
వృత్తి జీవితం : గ్రానైట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. రాష్ట్ర మున్నూరు కాపు ఆల్ అసోసియేషన్ జేఏసీ గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. తన సొంతూరులో బడి, గుడి, రహదారి, తాగునీరు, విద్యుత్తు సౌకర్యాలను కల్పించారు. మేడారం ఆలయ అభివృద్ధికి తన వంతు ఆర్థిక సాయం చేశారు. రవిచంద్ర గత ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఆ తర్వాత తెరాసలో చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ