CM KCR: కేంద్రానిది చిల్లర వ్యవహారం
పంచాయతీరాజ్ వ్యవస్థలో మూడంచెల విధానం వచ్చిన తర్వాత... రాష్ట్రాలను నమ్మకుండా కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చిల్లర వ్యవహారమని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. రాజీవ్గాంధీ నుంచి నేటి ప్రధాని వరకు ఇదే తీరును అనుసరించడం సరికాదన్నారు. జవహర్ రోజ్గార్ యోజన, గ్రామ్సడక్ యోజన, నరేగా వంటి పథకాలను దిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సమర్థనీయం కాదన్నారు. పల్లె, పట్టణ ప్రగతి సహా..బృహత్ పల్లె ప్రకృతి వనాల అభివృద్ధిపై బుధవారం...
దిల్లీ నుంచి పథకాలు అమలు చేస్తామనడం సమర్థనీయం కాదు
నేరుగా గ్రామాలకు నిధులివ్వడమేమిటని ప్రశ్న
ఇది రాష్ట్రాలను కించపరచడమేనని వ్యాఖ్య
జూన్ 3 నుంచి పల్లె, పట్టణ ప్రగతి
ఊరూరా క్రీడా ప్రాంగణాలు
పల్లె, పట్టణ ప్రగతి సమీక్షలో కేసీఆర్
ఈనాడు - హైదరాబాద్
దేశంలో విద్య, వైద్యం వంటి అనేక రంగాల్లో రావాల్సినంత ప్రగతి రాలేదు. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి అంశాల మీద దృష్టి పెట్టకుండా, రాష్ట్రాల విధుల్లో జోక్యం చేసుకోవాలనుకోవడం అర్థరహితం.
75 సంవత్సరాల అమృత్ మహోత్సవాల సందర్భంలోనూ దేశంలోని కొన్ని పల్లెలు, పట్టణాలు కరెంటు లేక చీకట్లలో మగ్గుతున్నాయి. తాగు, సాగునీరు లేక ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. ఈ సమస్యలు కేంద్రానికి పట్టవా?
- సీఎం కేసీఆర్
పంచాయతీరాజ్ వ్యవస్థలో మూడంచెల విధానం వచ్చిన తర్వాత... రాష్ట్రాలను నమ్మకుండా కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చిల్లర వ్యవహారమని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. రాజీవ్గాంధీ నుంచి నేటి ప్రధాని వరకు ఇదే తీరును అనుసరించడం సరికాదన్నారు. జవహర్ రోజ్గార్ యోజన, గ్రామ్సడక్ యోజన, నరేగా వంటి పథకాలను దిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సమర్థనీయం కాదన్నారు. పల్లె, పట్టణ ప్రగతి సహా..బృహత్ పల్లె ప్రకృతి వనాల అభివృద్ధిపై బుధవారం ప్రగతిభవన్లో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రాల్లో నెలకొన్న స్థానిక పరిస్థితులు అక్కడి ప్రభుత్వాలకే తెలుస్తాయని, రోజువారీ కూలీల డబ్బులు కూడా దిల్లీ నుంచి కేంద్రమే పంచాలనుకోవడం సరైన విధానం కాదని ఆక్షేపించారు. పల్లెలు, పట్టణాలతో పాటు అన్ని రంగాల్లో అనతికాలంలో అనితర సాధ్యమైన అభివృద్ధిని సాధించామన్న సీఎం... ఇందులో భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. అడవులను పునరుజ్జీవింప చేయడం ద్వారా కోల్పోయిన స్వర్గాన్ని మళ్లీ తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. ఎండల నేపథ్యంలో...రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20 నుంచి నిర్వహించ తలపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. జూన్ 3 నుంచి 15 రోజుల పాటు నిర్వహించాలని సీఎం కేసిఆర్ ఆదేశించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
దేశం గర్వించే స్థాయిలో పల్లెలు
‘ఉమ్మడి రాష్ట్ర పాలనలో ధ్వంసమైన తెలంగాణను బాగు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా కష్టపడాల్సి వస్తోంది. నేడు దేశం గర్వించే స్థాయిలో రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలను అభివృద్ధి చేసుకుంటున్నాం.రెండు పర్యాయాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామాల పురస్కారాలు దాదాపు రాష్ట్రానికే రావడం హర్షణీయం. పంచాయతీరాజ్ శాఖ మంత్రికి అభినందనలు. ఫలితాలు ఊరికే రావు. ప్రజా సంక్షేమం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు...అమలవుతున్న కార్యాచరణతో పాటు అధికారులు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే సాధ్యమవుతాయి. అన్ని రంగాల్లో జరిగిన రాష్ట్ర అభివృద్ధిని ఇటీవల కొన్ని జాతీయ మీడియా ఛానళ్లు ప్రసారం చేశాయి. ఇది చూసిన ఇతర రాష్ట్రాల వారికి ఆశ్చర్యం కలిగింది. రాష్ట్ర అభివృద్ధి గురించి ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఇక్కడి పథకాలను రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న ప్రజలు అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాయచూర్ భాజపా ఎమ్మెల్యే తెలంగాణ పథకాలను కర్ణాటకలో అమలు చేయాలని, లేకపోతే తమ ప్రాంతాన్ని తెలంగాణలో విలీనం చేయాలని కోరుతున్నారు.
జడ్పీ ఛైర్పర్సన్లది కీలకపాత్ర
పంచాయతీరాజ్లో జడ్పీ ఛైర్పర్సన్లది కీలకపాత్ర. పల్లెప్రగతిలోనూ వారు ప్రధాన భూమిక పోషించాలి. ఎంపీపీలు, ఎంపీడీవోల సేవలను ఉపయోగించుకోవాలి. పల్లె,పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా స్థానిక సంస్థలు ఉన్నత స్థితి నుంచి అత్యున్నత స్థితికి చేరాలి. వందశాతం వైకుంఠధామాలు పూర్తికావాలి. జడ్పీ ఛైర్పర్సన్లు నిరంతరం తనిఖీ చేయాలి. గ్రామాలు, పట్టణాలు బహిరంగ మల విసర్జన రహితం కావాలి.
దశలవారీగా దళితబంధు
ఈ ఏడాది నియోజకవర్గానికి 1,500 మంది చొప్పున దళితబంధు పథకం లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియను కొనసాగించాలి. ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత దశల వారీగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలి.
అన్నిటా అగ్రభాగాన రాష్ట్రం
పంటల ఉత్పత్తిలో, తలసరి ఆదాయంలో ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల కంటే తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. రాష్ట్రంలో మొత్తం 10 వేల పడకల సామర్థ్యంతో ఆరు కొత్త మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానాలను నిర్మించుకోనున్నాం. వరంగల్లో 24 అంతస్తుల్లో 38 విభాగాలతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్నాం. అల్వాల్, సనత్నగర్, గడ్డి అన్నారం, గచ్చిబౌలి టిమ్స్లలో ఢిల్లీ ఎయిమ్స్ తరహాలో సౌకర్యాలు కల్పించబోతున్నాం. మొట్టమొదటి సారి ప్రపంచానికి హరితనిధిని తెలంగాణ పరిచయం చేసింది. మహబూబ్నగర్లో 2,087 ఎకరాల్లో అద్భుతంగా నిర్మించిన పార్కును ఆదర్శంగా తీసుకొని, ఇతర జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలి. ఓఆర్ఆర్పై పచ్చదనం కోసం శ్రద్ధ తీసుకోవాలి. రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతీ వైకుంఠధామానికి 10 రోజుల్లోగా మిషన్ భగీరథ కనెక్షన్ అందించాలి.పురపాలక వార్డుల్లో నర్సరీలు ఏర్పాటు చేయకపోతే, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు
భవిష్యత్తు తరాలు శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు తోడ్పడే విధంగా ‘‘తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం’’ ఏర్పాటు చేస్తున్నాం. 19 వేల గ్రామాలు, 5వేల వార్డులు, మొత్తంగా 24 వేల ‘‘గ్రామీణ క్రీడా కమిటీ’లను ఏర్పాటు చేయాలి. ఇవి క్రీడల నిర్వహణ కోసం పనిచేయాలి’’ అని సీఎం తెలిపారు. సమావేశంలో మంత్రులు, మేయర్లు, సీఎస్ సోమేశ్కుమార్, సంబంధిత శాఖల కార్యదర్శులు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొన్నారు.
పబ్లిక్గార్డెన్స్లో రాష్ట్రావతరణ వేడుకలు : సీఎం
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఎప్పటి మాదిరిగానే నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం బుధవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొనాలని సీఎం సూచించారు. సాయంత్రం వేళ హైదరాబాద్ రవీంద్రభారతిలో, జిల్లా కేంద్రాల్లో కవి సమ్మేళనాలు నిర్వహించాలన్నారు.
తడిసిన ధాన్యాన్ని కొంటాం
- సీఎం కేసీఆర్
తడిసిన ధాన్యాన్ని ఎంత ఖర్చయినా రాష్ట్ర ప్రభుత్వమే భరించి చివరి గింజ వరకు కొంటుంది. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దు. మొత్తం 56 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు 20 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!