తెలుగు మాధ్యమం ప్రశ్నల ముద్రణే మరిచారు
పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల తయారీలో చిత్రవిచిత్రాల తప్పులు చేసిన ఇంటర్ బోర్డు తాజాగా మరో ఘోర తప్పిదానికి పాల్పడింది. ఏకంగా తెలుగు మాధ్యమంలో ప్రశ్నలనే ముద్రించకుండా విద్యార్థులను అయోమయానికి గురిచేసింది.
ఇంటర్ ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు పరీక్షల్లో విచిత్రం
ముద్రణదారు పొరపాటని చేతులు దులుపుకొన్న ఇంటర్బోర్డు
ఈనాడు, హైదరాబాద్: పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల తయారీలో చిత్రవిచిత్రాల తప్పులు చేసిన ఇంటర్ బోర్డు తాజాగా మరో ఘోర తప్పిదానికి పాల్పడింది. ఏకంగా తెలుగు మాధ్యమంలో ప్రశ్నలనే ముద్రించకుండా విద్యార్థులను అయోమయానికి గురిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం రసాయనశాస్త్రం, కామర్స్తోపాటు ఒకేషనల్ విద్యార్థులకు గణితం, జీవశాస్త్రం(వృక్ష, జంతు) బ్రిడ్జి కోర్సు పరీక్షలు జరిగాయి. ఒకేషనల్ విద్యార్థులకు ఏటా ప్రశ్నపత్రంలో ప్రతి ప్రశ్నను ఆంగ్లంతోపాటు తెలుగులో కూడా ముద్రిస్తారు. అయితే ఈసారి కేవలం ఆంగ్లంలోనే ఇచ్చారు. దీంతో ప్రశ్నలు అర్థం కాక వేలాది మంది తలపట్టుకూర్చున్నారని పలువురు అధ్యాపకులు తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత ఎంసెట్ ఇంజినీరింగ్ రాయాలంటే గణితం బ్రిడ్జి కోర్సు పరీక్ష పాస్ కావాలి. అదే ఎంసెట్ అగ్రికల్చర్ లేదా నీట్ రాయాలంటే జీవశాస్త్రం పరీక్షలో ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి. అంతటి కీలకమైన పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాలను ఇంటర్బోర్డు ముద్రణకు ఇచ్చే ముందు ఏమాత్రం పరిశీలించకుండా నిర్లక్ష్యం వహించింది.
అనువదించి చెప్పాలని కోరాం..
ప్రశ్నపత్రాల ముద్రణదారు చేసిన పొరపాటు కారణంగా ప్రశ్నపత్రంలో తెలుగు వెర్షన్ లేకుండా పోయింది. ఈ విషయాన్ని ఉదయం 8.45 గంటలకు గుర్తించి అన్నీ తెలుగులోకి అనువదించి చెప్పాలని బ్రిడ్జి కోర్సు విద్యార్థులున్న పరీక్షా కేంద్రాలకు సమాచారం ఇచ్చామని ఇంటర్బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
తప్పులు దిద్దుకోవడమే సరిపోయింది
బ్రిడ్జి కోర్సు పరిస్థితి అలాగుంటే ప్రథమ ఇంటర్ రసాయనశాస్త్రం, కామర్స్ ప్రశ్నపత్రాల్లోనూ పలు తప్పులు దొర్లాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో మొత్తం తొమ్మిది ఎరాటాలు(తప్పుల సవరణ) వచ్చాయి. ప్రశ్నల్లో ఉన్న తప్పులను దిద్దుకోవాలని ఇంటర్బోర్డు సెల్ఫోన్ల ద్వారా అధికారులకు సందేశాలు పంపించడం...వాటిని ఇన్విజిలేటర్లు చెప్పడంతో విద్యార్థులకు సమయం వృథా అవుతోంది. దానికితోడు తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల వారు ఒకే గదిలో పరీక్షలు రాస్తుంటారు. దానివల్ల ఒక మాధ్యమం వారికి చెబుతుంటే ఇతర మాధ్యమాల వారికి ఏకాగ్రత దెబ్బతింటోందని అధ్యాపకులు చెబుతున్నారు. అంతేకాకుండా సరిదిద్దుకోవాలని మొదట ఒకటి పంపి...తర్వాత మరొకటి పంపడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు.
ఇది విద్యార్థులతో చెలగాటమే
- మాచర్ల రామకృష్ణాగౌడ్, కన్వీనర్, తెలంగాణ ఇంటర్ విద్య పరిరక్షణ సమితి
నిత్యం తప్పుల తడకగా ప్రశ్నపత్రాలను ఇస్తుండటం విద్యార్థులతో చెలగాటం ఆడటమే. అందుకే బోర్డు కార్యదర్శిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తప్పులతో కూడిన ప్రశ్నలను చూసి విద్యార్థులు మరింత ఆందోళనకు గురవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..