ఖజానాకు ‘కిక్’
రాష్ట్రంలో పెరిగిన మద్యం ధరల ప్రకారం గురువారం నుంచే విక్రయాలు ప్రారంభమయ్యాయి. ధరల పెంపుతో ప్రస్తుత ఎక్సైజ్ పాలసీలో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.10-12 వేల కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. మద్యం రకాలను బట్టి రూ.20 నుంచి రూ.160 వరకు పెంచుతూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
పెరిగిన మద్యం ధరలతో 12 వేల కోట్ల దాకా అదనపు ఆదాయం?
అమలులోకి వచ్చిన కొత్త రేట్లు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో పెరిగిన మద్యం ధరల ప్రకారం గురువారం నుంచే విక్రయాలు ప్రారంభమయ్యాయి. ధరల పెంపుతో ప్రస్తుత ఎక్సైజ్ పాలసీలో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.10-12 వేల కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. మద్యం రకాలను బట్టి రూ.20 నుంచి రూ.160 వరకు పెంచుతూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 2019-21 మద్యం విధానం ద్వారా సుమారు రూ.30 వేల కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. దీంతో ఖజానాకు ఎక్సైజ్ పన్నుల రూపంలో దాదాపు రూ.12 వేల కోట్ల ఆదాయం వచ్చింది. 2021-23 మద్యం విధానంలో సుమారు రూ.60 వేల కోట్ల మద్యం విక్రయాలు జరుగుతాయని భావిస్తున్నారు. గతేడాది డిసెంబరు నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చింది. అయితే, ఈ విధానం అమలులోకి వచ్చిన తరవాత ఒకేసారి ఇంతమొత్తంలో ధరలను పెంచడంపట్ల వ్యాపారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువగా విక్రయాలు జరిగే ఆర్డినరీ మద్యం(చీప్ లిక్కర్) క్వార్టర్ బాటిల్ ధరలను పెంచడం వల్ల తాము మార్జిన్ కోల్పోతామని మద్యం వ్యాపారులు వాపోతున్నారు. మొత్తం మద్యం విక్రయాల్లో 40-50 శాతం వీటి అమ్మకాలే ఉంటాయి. సాధారణంగా రూ.100లోపు ధర ఉన్న(క్వార్టర్) మద్యం విక్రయాలపై వ్యాపారులకు 27 శాతం మార్జిన్ వచ్చేది. ప్రస్తుతం క్వార్టర్ బాటిల్ ధరను పెంచడంతో మార్జిన్ 20శాతానికి పడిపోయే అవకాశముందని వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం పెరిగిన ధరల్ని స్పెషల్ ఎక్సైజ్ ట్యాక్స్ పెంపుదలగా చూపిన కారణంగానూ తమకు మార్జిన్ రాకుండాపోతుందని వ్యాపారవర్గాలు వాపోతున్నాయి. ఆర్డినరీ మద్యం క్వార్టర్ బాటిల్ ధరల పెరుగుదల అమ్మకాలపై ప్రభావం చూపుతుందని వైన్స్ అసోసియేషన్ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలాఉండగా.. బుధవారం రాత్రి విక్రయాలు ముగిసిన తర్వాత సరకు నిల్వల్ని లెక్కించేందుకు ఎక్సైజ్ అధికారులు వైన్స్లు, బార్లు, పబ్లను సీజ్ చేశారు. గురువారం సరకు లెక్కింపు సందర్భంగా ఎక్సైజ్ వర్గాలు పలువురు వ్యాపారులతో బేరసారాలు సాగించాయన్న ఆరోపణలు వినిపించాయి. సరకు నిల్వల్ని తగ్గించి చూపేందుకు ప్రయత్నాలు చేశారన్న ప్రచారం సాగింది.
ఏ రకంపై ఎంత..?
* బ్రాండ్లతో నిమిత్తం లేకుండా, పరిమాణంతో సంబంధం లేకుండా బీర్లపై రూ.10 చొప్పున ధర పెరిగింది. వైన్ ఫుల్ బాటిల్ ధర రూ.40 పెంచారు.
* క్వార్టర్ బాటిల్ ధర రూ.200లోపు ఉండే ఆర్డినరీ, మీడియం మద్యంపై ఓ రకంగా, అంతకంటే ఎక్కువ ధర ఉండే ప్రీమియం మద్యం బ్రాండ్లపై మరోరకంగా ధర పెరిగింది. ఆర్డినరీ, మీడియం మద్యం క్వార్టర్పై రూ.20, హాఫ్ బాటిల్పై రూ.40, ఫుల్ బాటిల్పై రూ.80 పెంచారు. ప్రీమియం బ్రాండ్ల క్వార్టర్పై రూ.40, హాఫ్ బాటిల్పై రూ.80, ఫుల్ బాటిల్పై రూ.160 పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
Bapatla: రహదారిపై యుద్ధవిమానాల ల్యాండింగ్
బాపట్ల జిల్లా మీదుగా వెళ్లే 16వ నంబరు జాతీయ రహదారిపై వైమానిక దళం విన్యాసాలు చేపట్టింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో అత్యవసర సమయాల్లో రహదారిపైనే ఉన్న రన్వేపై యుద్ధ విమానాలను ల్యాండ్ చేసే సామర్థ్యాన్ని మదింపు చేశారు. -
తెలంగాణ సొమ్ము దిల్లీకి
భారాస, కాంగ్రెస్ల బంధాన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాళేశ్వరం కుంభకోణంలో కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయో ఎవరికీ తెలియదు? మరోవైపు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలేదు. -
గవర్నర్ తమిళిసై రాజీనామా
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. పుదుచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) పదవికి సైతం రాజీనామా సమర్పించారు. ఈ మేరకు లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సోమవారం పంపించారు. -
దాతలూ స్పందించండి.. ఈ చిన్నారిని ఆదుకోండి
నిరుపేద తల్లిదండ్రులకు పెద్ద కష్టం వచ్చిపడింది. ఏడాది వయస్సున్న కుమారుడి తలకు ఏర్పడిన భారీ కణితి ప్రాణాంతకంగా మారింది. తల్లిదండ్రులు అప్పులు చేసి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మూడుసార్లు శస్త్రచికిత్స చేయించినప్పటికీ ఫలితం లేకపోయింది. -
ఆప్ నేతలకు రూ.100 కోట్ల చెల్లింపులో కవిత పాత్ర
దిల్లీ మద్యం విధానంలో పొందిన ప్రయోజనాలకు ప్రతిఫలంగా భారాస ఎమ్మెల్సీ కవిత ఆప్ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో భాగస్వామి అయ్యారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ సుజయ్పాల్, జస్టిస్ మౌసమీ భట్టాచార్య
-
రూ.50 వేలకు పైగా నగదు తీసుకెళ్లేవారు.. పత్రాలను వెంట ఉంచుకోవాలి
-
సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాల్లో వడగళ్లు
రాష్ట్రంలో సోమవారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాల్లో సోమవారం వడగళ్లవాన పడింది. రాజన్న సిరిసిల్ల మండలంలో విద్యుత్ స్తంభం కూలిన ఘటనలో ఓ రైతు మరణించారు. -
రూ.లక్షలు పెట్టు.. ఫ్యాన్సీ నంబరు పట్టు!
రాష్ట్రంలో నూతన రిజిస్ట్రేషన్ కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఫ్యాన్సీ నంబర్లు రవాణా శాఖకు కాసులు కురిపిస్తున్నాయి. రూ.లక్షలు పెట్టి అయినా.. వాటిని దక్కించుకునేందుకు వాహనదారులు పోటీ పడుతున్నారు. -
కవిత పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ
దిల్లీ మద్యం కేసులో తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీచేసిన సమన్లను సవాల్ చేస్తూ భారాస ఎమ్మెల్సీ కె.కవిత గత ఏడాది మార్చి 15న దాఖలు చేసిన రిట్ పిటిషన్ మంగళవారం సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది. -
తల్లీ వందనం.. తపనకు అభినందనం
దివ్యాంగుడైన కుమారుడిని పదోతరగతి పరీక్ష రాయించడానికి తల్లి పడుతున్న తపన స్ఫూర్తిదాయకం. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి(బి)కి చెందిన చరణ్కు పోలియోతో కాళ్లు చచ్చుబడగా, చేతుల కదలికలూ పరిమితంగానే ఉన్నాయి. -
యాదగిరీశుడి కల్యాణ వైభోగం
యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. గజ వాహనంపై నారసింహుడు, పల్లకినెక్కి అమ్మ లక్ష్మీదేవి.. మండపానికి చేరుకోగా, పూజారులు ఎదుర్కొని కల్యాణ తతంగాలను చేపట్టారు. -
బోరుతోనే ఊరికి పేరు.. 40 ఏళ్లుగా ఇంకని తీరు
ఆదిలాబాద్ గ్రామీణ మండలం తిప్ప పంచాయతీ పరిధిలోని బోరింగ్గూడ గ్రామంలో ఉన్న చేతిపంపు నుంచి నిరంతరం నీరు ఉబికివస్తోంది. గ్రామంలో 40 ఏళ్ల క్రితం బోరు వేసి.. ఈ చేతిపంపు ఏర్పాటు వేశారు. దీని కారణంగానే గ్రామానికి బోరింగ్గూడ అని పేరొచ్చిందని తిప్ప మాజీ సర్పంచి కిషన్ తెలిపారు. -
ఎల్లక్కపేట దసిలిపట్టు గుడ్డు.. దేశంలోనే వెరీగుడ్
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎల్లక్కపేట సమీపంలోని దసిలిపట్టు గుడ్ల తయారీ కేంద్రం దేశంలోనే నంబర్వన్గా నిలిచింది. ఐదేళ్ల నుంచి ఏటా సుమారు 2.80 లక్షలకుపైగా ఈ గుడ్లు ఉత్పత్తి చేస్తుండగా.. ఈ ఏడాది(ఫిబ్రవరితో గుడ్ల తయారీ ముగుస్తుంది) 3.27 లక్షలతో అగ్రస్థానాన్ని పొందింది. -
ఎన్నికల తర్వాతే వీసీల నియామకాలు
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతుల నియామక ప్రక్రియ లోక్సభ ఎన్నికల తర్వాతే చేపట్టనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తయింది. -
భర్తీ చేస్తున్నా.. భారీగా ఖాళీలు
ప్రభుత్వ పోటీ పరీక్షల్లో కొందరు అభ్యర్థులు విశేష ప్రతిభతో రెండు, మూడు, నాలుగు, అయిదేసి పోస్టులకు ఎంపికవడం మిగిలిన వారికి అశనిపాతంగా మారుతోంది. -
గొత్తికోయల ఆక్రమణలో 26 వేల ఎకరాలు
గొత్తికోయలు రాష్ట్రంలో 26 వేల ఎకరాల అటవీ ప్రాంతాల్ని ఆక్రమించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ వివరాల్ని కొద్దిరోజుల క్రితం నిర్వహించిన సమీక్షలో ఆ శాఖ మంత్రి కొండా సురేఖకు నివేదించారు. -
‘స్టేట్మెంట్’ దాఖలు విషయంలో అనిశ్చితి!
తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి విచారణ చేపట్టిన కృష్ణా ట్రైబ్యునల్-2 వద్ద రెండు రాష్ట్రాలూ దాఖలు చేయాల్సిన ‘స్టేట్మెంట్ ఆఫ్ కేస్’ విషయమై అనిశ్చితి నెలకొంది. ఈ నెల 20వ తేదీన దాఖలు చేయడానికి కేడబ్ల్యూడీటీ-2 రెండు రాష్ట్రాలకూ గడువు ఇచ్చింది. -
20 నుంచి మళ్లీ అయ్యర్ కమిటీ పర్యటన
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీల్లో లోటుపాట్లపై పరిశీలనకు నియమించిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్.డి.ఎస్.ఎ.) నిపుణుల కమిటీ ఈనెల 20న హైదరాబాద్కు రానుంది. -
ప్రభుత్వ ఆదేశాలనే అమలు చేస్తున్నాం
గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు వినియోగించే ఇళ్లకు జీరో బిల్లులకు విద్యుత్తు చట్ట ప్రకారం రాయితీ నిధులు ఇస్తామని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) తెలిపింది. దీనికి సంబంధించిన వివరణ పత్రాన్ని సోమవారం విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
SS Rajamouli: త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం.. జపాన్లో మూవీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత
-
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
-
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?