Telangana News: ప్రాణాధారం.. అయినా పక్కన పడేస్తాం
ఇది భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో రెండేళ్లుగా పక్కన పడేసిన రక్తం నుంచి పదార్థాలను విడగొట్టే అత్యాధునిక పరికరం. దీన్ని వైద్య పరిభాషలో ‘హెవీ డ్యూటీ కూలింగ్ సెంట్రీఫ్యూజ్ మిషన్’ అంటారు. 200 పడకలున్న ఈ ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు అత్యవసర పరిస్థితుల్లో రక్త పదార్థాలను వేర్వేరుగా అందించవచ్చనే లక్ష్యంతో ఆరేళ్ల కిందట నెలకొల్పారు. అయితే కొవిడ్ కాలం నుంచి దీన్ని వాడడం మానేశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృథాగా అత్యాధునిక వైద్య పరికరాలు
వైద్యాధికారుల నిర్లక్ష్యమే కారణం
ఇది భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో రెండేళ్లుగా పక్కన పడేసిన రక్తం నుంచి పదార్థాలను విడగొట్టే అత్యాధునిక పరికరం. దీన్ని వైద్య పరిభాషలో ‘హెవీ డ్యూటీ కూలింగ్ సెంట్రీఫ్యూజ్ మిషన్’ అంటారు. 200 పడకలున్న ఈ ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు అత్యవసర పరిస్థితుల్లో రక్త పదార్థాలను వేర్వేరుగా అందించవచ్చనే లక్ష్యంతో ఆరేళ్ల కిందట నెలకొల్పారు. అయితే కొవిడ్ కాలం నుంచి దీన్ని వాడడం మానేశారు.
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొల్పిన రక్తం నుంచి ప్లాస్మా, ప్లేట్లెట్లు, ఎర్ర రక్త కణాలను విడదీసే పరికరాలను వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం తాండవిస్తోంది. సుమారు రూ.15 కోట్లతో సూర్యాపేట, నల్గొండ, భద్రాచలం, జనగామ, జగిత్యాల, కొత్తగూడెం, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, తాండూరు, గద్వాల తదితర 20 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరేళ్ల కిందటే పరికరాలను బిగించినా.. గత రెండేళ్లుగా వాటిని సక్రమంగా వినియోగించుకోవడం లేదు. అంతకుముందు కూడా డెంగీ కేసులు పెరిగిన సందర్భాల్లో ప్లేట్లెట్ల వినియోగానికి మాత్రమే వీటిని వాడుకున్నారు. ప్రజలకు ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా ప్రాణాలను నిలిపే ఇంత ముఖ్యమైన పరికరాలను వినియోగించకపోవడానికి వైద్యాధికారుల్లో చిత్తశుద్ధి లోపించడమే ప్రధాన కారణమనే విమర్శలున్నాయి. ఇటీవల వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఉన్నతాధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో నిర్వహించిన సమీక్షలో ఈ పరికరాలు నిరుపయోగంగా పడి ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. మంత్రి సంబంధిత అధికారులపై మండిపడినట్లు తెలిసింది. తక్షణమే పరికరాలన్నింటినీ వినియోగంలోకి తీసుకురావాలని ఆయన ఆదేశించారు.
ప్రభుత్వ వైద్యంలోనే ఎందుకు?
ప్రస్తుతం ఏ ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ ‘హోల్ బ్లడ్’ను ఎక్కించడం లేదు. అంటే సేకరించిన రక్తాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎక్కించడం లేదు. ఆ రక్తం నుంచి ఎర్ర రక్త కణాలు, ప్లాస్మా, ప్లేట్లెట్లను విడగొడుతున్నారు. ఎవరికి ఏది అవసరమో అదే ఎక్కిస్తున్నారు. అరుదుగా వైద్యుల సూచనలను బట్టి సేకరించిన రక్తాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎక్కిస్తున్నారు. రక్తంలోని పదార్థాలను విడగొట్టడం వల్ల ఎక్కువ మందికి లబ్ధి చేకూరడమే కాకుండా.. నిల్వ కాలం కూడా పెరుగుతుంది. ఉదాహరణకు ఎర్ర రక్త కణాలను 35-42 రోజుల పాటు.. ప్లాస్మాను ఒక ఏడాది.. ప్లేట్లెట్లను 5 రోజులు నిల్వ ఉంచుతారు. రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఎర్ర రక్తకణాలు కావాలి. ముఖ్యంగా గ్రామీణంలో గర్భిణులకు వీటి అవసరం ఎక్కువ. డెంగీ రోగికి కొన్ని సందర్భాల్లో ప్లేట్లెట్ల అవసరం ఉంటుంది. కాలిన గాయాలతో బాధపడుతున్న వారికి, కొన్ని రకాల నరాల సంబంధిత వ్యాధుల్లోనూ ప్లాస్మా అత్యవసరమవుతుంది. ఈ చికిత్సలకు ప్రైవేటులో ఖరీదు ఎక్కువే. దీని ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ పరికరాలను నెలకొల్పింది. ఈ ప్రక్రియ కోసం అవసరమైన మానవ వనరులను సమకూర్చుకోవడానికి జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి అదనంగా 120 పోస్టులు మంజూరు చేయగా.. వీరికి తగిన శిక్షణ కూడా ఇచ్చారు. పరికరాన్ని నిర్వహించడం తెలిస్తే.. ఆటోమెటిక్గా మిషనే రక్తంలోని పదార్థాలను విడగొడుతుంది. అయినా ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. అయితే తమకు నష్టం జరుగుతుందని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఉద్దేశపూర్వకంగా కొన్నిచోట్ల ఈ ప్రక్రియకు అడ్డుతగులుతున్నాయని, ఇందుకు కొందరు ఉన్నతాధికారులు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా సర్కారు చొరవ తీసుకొని ఈ పరికరాలను వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
-
బస్సులో సీఎం... ఎండలో జనం