ఈవీ విప్లవంలో తెలంగాణ ముందంజ
ప్రపంచంలో విద్యుత్ వాహనాల(ఈవీ)దే భవిష్యత్తు అని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ విప్లవంలో తెలంగాణ ముందుందని, అత్యుత్తమ ఈవీ విధానాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు.
యూకేఐబీసీ రౌండ్టేబుల్ సదస్సులో కేటీఆర్
వివిధ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో భేటీ
ఔషధ విశ్వవిద్యాలయంపై ఒప్పందం
ఈనాడు, హైదరాబాద్: ప్రపంచంలో విద్యుత్ వాహనాల(ఈవీ)దే భవిష్యత్తు అని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ విప్లవంలో తెలంగాణ ముందుందని, అత్యుత్తమ ఈవీ విధానాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఇప్పటికే 24కి పైగా సంస్థలు తెలంగాణలో ఈవీ పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చాయని చెప్పారు. బ్రిటన్ పర్యటనలో భాగంగా గురువారం రెండో రోజు మంత్రి యూకే-ఇండియా వాణిజ్యమండలి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో మాట్లాడారు. ‘తెలంగాణ ప్రాధాన్యరంగంగా విద్యుత్ వాహనాల పరిశ్రమను గుర్తించి, భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించింది. రక్షణ రంగంలో పరిశోధన, అభివృద్ధి రంగంలో పురోగమించింది. బ్రిటన్తో కలిసి కృత్రిమ మేధ, ఆరోగ్య, వ్యవసాయ, పారిశుద్ధ్య విభాగాల్లో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉంది’ అని కేటీఆర్ వివరించారు.
అనంతరం మంత్రి లండన్లోని ప్రసిద్ధ సంస్థల అధిపతులతో భేటీ అయ్యారు. హైదరాబాద్లోని తమ ఔషధ పరిశ్రమను భారీగా విస్తరిస్తామని గ్లాక్సో స్మిత్క్లైన్ పరిశోధన, అభివృద్ధి విభాగాధిపతి ఫ్రాంక్ రాయట్ కేటీఆర్కు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్)తో పనిచేసేందుకు లండన్కు చెందిన పియర్సన్ కంపెనీ అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పనున్న వైమానిక విశ్వవిద్యాలయంలో భాగస్వామిగా చేరాలని ప్రముఖ విశ్వవిద్యాలయం క్రాన్ఫీల్డ్ ఛాన్సలర్ హాల్ఫార్డ్, వైస్ఛాన్సలర్ పొల్లార్డ్లను కేటీఆర్ కోరారు. హెచ్ఎస్బీసీ ప్రతినిధులు పాల్ మెక్ పియర్సన్, బ్రాడ్హిల్బర్న్, థామస్ లాయిడ్ గ్రూప్ ఎండీ నందిత సెహగల్ తదితరులు కేటీఆర్తో భేటీ అయ్యారు. బ్రిటన్ పారిశ్రామిక సమాఖ్య (సీబీఐ) అధ్యక్షుడు బిలిమోరియా ఇచ్చిన విందులో కేటీఆర్తో పాటు బ్రిటన్ ఎంపీలు, భారత పారిశ్రామిక సమాఖ్య ప్రతినిధులు, ఇండో బ్రిటిష్ సమాఖ్య, సీబీఐ ప్రతినిధులు పాల్గొన్నారు.
కింగ్స్ కళాశాలతో ఎంవోయూ
లండన్లోని ప్రతిష్ఠాత్మక కింగ్స్ కళాశాలతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. హైదరాబాద్లో ఔషధ విశ్వవిద్యాలయం ఏర్పాటు, అందులో ఉన్నతవిద్యాకోర్సులు, పరిశోధన, విద్యార్థుల బదలాయింపుతో పాటు పాఠ్యాంశాల తయారీలో తెలంగాణతో కళాశాల కలిసి పనిచేస్తుంది. మంత్రి కేటీఆర్ సమక్షంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, కింగ్స్ కళాశాల ఆరోగ్య, జీవశాస్త్రాల విభాగం సీనియర్ ఉపాధ్యక్షుడు రిచర్డ్ ట్రెంబాత్లు ఒప్పందంపై సంతకాలు చేశారు. ‘ఔషధ పరిశోధన, శిక్షణలో ప్రపంచంలోని అత్యంత నైపుణ్యం కల విశ్వవిద్యాలయంతో ప్రభుత్వం కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది’ అని కేటీఆర్ అన్నారు. కళాశాల అధ్యక్షుడు, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ షిట్జి కపూర్, అంతర్జాతీయ విద్యావిభాగం అధిపతి స్టీవ్స్మిత్లు మాట్లాడుతూ.. ‘ఈ ఒప్పందంతో పరిశోధన, బోధన అంశాల్లో తెలంగాణకు అంతర్జాతీయ నైపుణ్యం, సహకారం లభిస్తుంది’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
Bapatla: రహదారిపై యుద్ధవిమానాల ల్యాండింగ్
బాపట్ల జిల్లా మీదుగా వెళ్లే 16వ నంబరు జాతీయ రహదారిపై వైమానిక దళం విన్యాసాలు చేపట్టింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో అత్యవసర సమయాల్లో రహదారిపైనే ఉన్న రన్వేపై యుద్ధ విమానాలను ల్యాండ్ చేసే సామర్థ్యాన్ని మదింపు చేశారు. -
తెలంగాణ సొమ్ము దిల్లీకి
భారాస, కాంగ్రెస్ల బంధాన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాళేశ్వరం కుంభకోణంలో కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయో ఎవరికీ తెలియదు? మరోవైపు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలేదు. -
గవర్నర్ తమిళిసై రాజీనామా
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. పుదుచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) పదవికి సైతం రాజీనామా సమర్పించారు. ఈ మేరకు లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సోమవారం పంపించారు. -
దాతలూ స్పందించండి.. ఈ చిన్నారిని ఆదుకోండి
నిరుపేద తల్లిదండ్రులకు పెద్ద కష్టం వచ్చిపడింది. ఏడాది వయస్సున్న కుమారుడి తలకు ఏర్పడిన భారీ కణితి ప్రాణాంతకంగా మారింది. తల్లిదండ్రులు అప్పులు చేసి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మూడుసార్లు శస్త్రచికిత్స చేయించినప్పటికీ ఫలితం లేకపోయింది. -
ఆప్ నేతలకు రూ.100 కోట్ల చెల్లింపులో కవిత పాత్ర
దిల్లీ మద్యం విధానంలో పొందిన ప్రయోజనాలకు ప్రతిఫలంగా భారాస ఎమ్మెల్సీ కవిత ఆప్ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో భాగస్వామి అయ్యారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ సుజయ్పాల్, జస్టిస్ మౌసమీ భట్టాచార్య
-
రూ.50 వేలకు పైగా నగదు తీసుకెళ్లేవారు.. పత్రాలను వెంట ఉంచుకోవాలి
-
సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాల్లో వడగళ్లు
రాష్ట్రంలో సోమవారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాల్లో సోమవారం వడగళ్లవాన పడింది. రాజన్న సిరిసిల్ల మండలంలో విద్యుత్ స్తంభం కూలిన ఘటనలో ఓ రైతు మరణించారు. -
రూ.లక్షలు పెట్టు.. ఫ్యాన్సీ నంబరు పట్టు!
రాష్ట్రంలో నూతన రిజిస్ట్రేషన్ కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఫ్యాన్సీ నంబర్లు రవాణా శాఖకు కాసులు కురిపిస్తున్నాయి. రూ.లక్షలు పెట్టి అయినా.. వాటిని దక్కించుకునేందుకు వాహనదారులు పోటీ పడుతున్నారు. -
కవిత పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ
దిల్లీ మద్యం కేసులో తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీచేసిన సమన్లను సవాల్ చేస్తూ భారాస ఎమ్మెల్సీ కె.కవిత గత ఏడాది మార్చి 15న దాఖలు చేసిన రిట్ పిటిషన్ మంగళవారం సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది. -
తల్లీ వందనం.. తపనకు అభినందనం
దివ్యాంగుడైన కుమారుడిని పదోతరగతి పరీక్ష రాయించడానికి తల్లి పడుతున్న తపన స్ఫూర్తిదాయకం. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి(బి)కి చెందిన చరణ్కు పోలియోతో కాళ్లు చచ్చుబడగా, చేతుల కదలికలూ పరిమితంగానే ఉన్నాయి. -
యాదగిరీశుడి కల్యాణ వైభోగం
యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. గజ వాహనంపై నారసింహుడు, పల్లకినెక్కి అమ్మ లక్ష్మీదేవి.. మండపానికి చేరుకోగా, పూజారులు ఎదుర్కొని కల్యాణ తతంగాలను చేపట్టారు. -
బోరుతోనే ఊరికి పేరు.. 40 ఏళ్లుగా ఇంకని తీరు
ఆదిలాబాద్ గ్రామీణ మండలం తిప్ప పంచాయతీ పరిధిలోని బోరింగ్గూడ గ్రామంలో ఉన్న చేతిపంపు నుంచి నిరంతరం నీరు ఉబికివస్తోంది. గ్రామంలో 40 ఏళ్ల క్రితం బోరు వేసి.. ఈ చేతిపంపు ఏర్పాటు వేశారు. దీని కారణంగానే గ్రామానికి బోరింగ్గూడ అని పేరొచ్చిందని తిప్ప మాజీ సర్పంచి కిషన్ తెలిపారు. -
ఎల్లక్కపేట దసిలిపట్టు గుడ్డు.. దేశంలోనే వెరీగుడ్
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎల్లక్కపేట సమీపంలోని దసిలిపట్టు గుడ్ల తయారీ కేంద్రం దేశంలోనే నంబర్వన్గా నిలిచింది. ఐదేళ్ల నుంచి ఏటా సుమారు 2.80 లక్షలకుపైగా ఈ గుడ్లు ఉత్పత్తి చేస్తుండగా.. ఈ ఏడాది(ఫిబ్రవరితో గుడ్ల తయారీ ముగుస్తుంది) 3.27 లక్షలతో అగ్రస్థానాన్ని పొందింది. -
ఎన్నికల తర్వాతే వీసీల నియామకాలు
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతుల నియామక ప్రక్రియ లోక్సభ ఎన్నికల తర్వాతే చేపట్టనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తయింది. -
భర్తీ చేస్తున్నా.. భారీగా ఖాళీలు
ప్రభుత్వ పోటీ పరీక్షల్లో కొందరు అభ్యర్థులు విశేష ప్రతిభతో రెండు, మూడు, నాలుగు, అయిదేసి పోస్టులకు ఎంపికవడం మిగిలిన వారికి అశనిపాతంగా మారుతోంది. -
గొత్తికోయల ఆక్రమణలో 26 వేల ఎకరాలు
గొత్తికోయలు రాష్ట్రంలో 26 వేల ఎకరాల అటవీ ప్రాంతాల్ని ఆక్రమించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ వివరాల్ని కొద్దిరోజుల క్రితం నిర్వహించిన సమీక్షలో ఆ శాఖ మంత్రి కొండా సురేఖకు నివేదించారు. -
‘స్టేట్మెంట్’ దాఖలు విషయంలో అనిశ్చితి!
తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి విచారణ చేపట్టిన కృష్ణా ట్రైబ్యునల్-2 వద్ద రెండు రాష్ట్రాలూ దాఖలు చేయాల్సిన ‘స్టేట్మెంట్ ఆఫ్ కేస్’ విషయమై అనిశ్చితి నెలకొంది. ఈ నెల 20వ తేదీన దాఖలు చేయడానికి కేడబ్ల్యూడీటీ-2 రెండు రాష్ట్రాలకూ గడువు ఇచ్చింది. -
20 నుంచి మళ్లీ అయ్యర్ కమిటీ పర్యటన
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీల్లో లోటుపాట్లపై పరిశీలనకు నియమించిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్.డి.ఎస్.ఎ.) నిపుణుల కమిటీ ఈనెల 20న హైదరాబాద్కు రానుంది. -
ప్రభుత్వ ఆదేశాలనే అమలు చేస్తున్నాం
గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు వినియోగించే ఇళ్లకు జీరో బిల్లులకు విద్యుత్తు చట్ట ప్రకారం రాయితీ నిధులు ఇస్తామని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) తెలిపింది. దీనికి సంబంధించిన వివరణ పత్రాన్ని సోమవారం విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
-
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
AP News: అమ్మో.. అన్ని రోజులా?ఖర్చుల భారంపై నేతల తర్జనభర్జన..!
-
Gadchiroli: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల హతం
-
మూడు కార్లలో తాయిలాల సరకు దాటిపోయిందా...?!
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు