బొగ్గు దిగుమతులపై వివాదం
బొగ్గు దిగుమతులపై వివాదం రాజుకుంది. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలని కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల అమలు సాధ్యం కాదని తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) తాజాగా స్పష్టం చేసింది.
రాష్ట్ర వినియోగంలో 10% దిగుమతి చేసుకోవాల్సిందేనంటున్న కేంద్రం
ఈ నెలాఖరులోగా ఆర్డరివ్వకుంటే మరో 5% కలుపుతామని స్పష్టీకరణ
సింగరేణి ఉండగా విదేశీ బొగ్గు మాకెందుకంటున్న తెలంగాణ జెన్కో
రాష్ట్రంలో కేంద్ర ఉత్తర్వుల అమలు ప్రశ్నార్థకమే!
ఈనాడు, హైదరాబాద్: బొగ్గు దిగుమతులపై వివాదం రాజుకుంది. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలని కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల అమలు సాధ్యం కాదని తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) తాజాగా స్పష్టం చేసింది. బొగ్గు వినియోగంలో 10 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందేనని రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలకు గతంలో ఉత్తర్వులిచ్చిన కేంద్రం.. ఈ నెలాఖరులోగా వాటికి అనుగుణంగా ఆర్డరివ్వకుంటే వచ్చే నెల నుంచి మరో 5 శాతం అదనంగా తీసుకునేలా పరిమితిని పెంచి జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. దీన్ని రాష్ట్రాల థర్మల్ విద్యుదుత్పత్తి సంస్థలు తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని హెచ్చరించింది. తెలంగాణ జెన్కో పరిధిలోని విద్యుత్కేంద్రాలకు రోజుకు సగటున 50 వేల టన్నుల బొగ్గు అవసరం. ఇందులో 10శాతం లెక్కన 5 వేల టన్నులు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి జెన్కో ఆర్డర్లు ఇవ్వాలి. ఇందుకోసం ముందుగా కొనుగోలుకు టెండర్లు పిలవాలి. కానీ జెన్కో ఇలాంటి ప్రయత్నాలేవీ చేయడం లేదు. ఈ క్రమంలో విదేశీబొగ్గు దిగుమతి చేసుకోవాలన్న కేంద్ర ఉత్తర్వులు రాష్ట్రంలో అమలు కావడం ప్రశ్నార్థకమే.
దిగుమతి చేసుకుంటే విద్యుత్కేంద్రాలపై ఆర్థిక భారం
సింగరేణి సంస్థకు సంబంధించి ఉత్పత్తి జరిగే బొగ్గు గనులన్నీ తెలంగాణలోనే ఉన్నాయి. వీటి నుంచే జెన్కో విద్యుత్కేంద్రాలకు బొగ్గు సరఫరా అవుతోంది. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి 51, కేంద్రానికి 49శాతం వాటాలున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ఆదేశాలను సింగరేణి అమలు చేస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ జెన్కో విద్యుత్కేంద్రాలకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే తొలుత రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. కేంద్ర నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుందా? లేదా? అనేది ఇంకా తేలలేదు. ఈ నెలాఖరులోగా తేల్చకుంటే వచ్చే నెల నుంచి బొగ్గు సరఫరా తగ్గిస్తామని కేంద్రం ప్రకటించినందున విద్యుదుత్పత్తికి ఆటంకం ఏర్పడవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. విదేశీబొగ్గు తెప్పించుకోకపోతే జూన్ నుంచి అక్టోబరు వరకు వాడే బొగ్గులో 15 శాతం విదేశీబొగ్గును కలిపి వినియోగించాలనే నిబంధన పెట్టింది. అదే జరిగితే రోజుకు 7,500 టన్నుల విదేశీ బొగ్గును తెలంగాణ విద్యుత్కేంద్రాలు వాడాలి. ప్రస్తుతం విదేశీబొగ్గు టన్ను ధర రూ.10,700 వరకూ ఉంది. కానీ సింగరేణి బొగ్గును రూ.4 వేలలోపే రాష్ట్ర జెన్కో కొనుగోలు చేస్తోంది. బొగ్గును విదేశాల నుంచి నౌకల్లో తెస్తారు. తెలంగాణకు నౌకాశ్రయాలు లేకపోవడంతో ఏపీ లేదా తమిళనాడు, కర్ణాటక తీరాలకు వచ్చే నౌకల నుంచి తెచ్చుకోవాలి. ఈ కారణంగా రవాణావ్యయం సైతం భారీగానే అవుతుంది. ఈ నేపథ్యంలోనే విదేశీబొగ్గును దిగుమతి చేసుకుంటే అదనపు ఆర్థికభారం మోయాల్సి వస్తుందని జెన్కో ఆందోళన చెందుతోంది. జెన్కో విద్యుత్కేంద్రాలకు అవసరమైన బొగ్గులో 10 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే రోజుకు సుమారు రూ.5 కోట్లు అదనంగా భారం పడుతుందని అంచనా. ఈ క్రమంలోనే విదేశీబొగ్గు కొంటే వచ్చే ఏడాది మళ్లీ కరెంటు ఛార్జీలు పెంచక తప్పదని విద్యుత్ పంపిణీ సంస్థలు తెలిపాయి. సింగరేణి బొగ్గునే తీసుకుంటామని, విదేశీబొగ్గు దిగుమతి చేసుకోవాలనే ఆలోచన లేదని తెలంగాణ జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు ‘ఈనాడు’కు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.