సంక్షిప్త వార్తలు
ప్రభుత్వ భూములను ఆక్రమించి నివాసాలు ఏర్పాటు చేసుకుని క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసిన వారిలో అర్హుల గుర్తింపునకు ప్రభుత్వం ప్రత్యేక బృందాల ఏర్పాటుకు ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం జిల్లా
టీహబ్తో ఫాల్కన్ ఎక్స్ ఒప్పందం
ఈనాడు, హైదరాబాద్: సిలికాన్ వ్యాలీలో జరిగే ‘గ్లోబల్ స్టార్టప్ ఎమర్షన్ ప్రోగ్రాం’ కోసం అమెరికాకు చెందిన ఫాల్కన్ ఎక్స్ సంస్థతో టీహబ్ ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా భారత్లోని స్టార్టప్ వ్యవస్థాపకులు అమెరికా మార్కెట్లోకి ప్రవేశించేందుకు, తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు వీలు కలగనుంది. ఐదు వారాల ప్రాజెక్టులో భాగంగా కొత్త మార్కెట్లోకి ప్రవేశించేందుకు అవకాశాలు ఉంటాయని టీహబ్ సీఈవో ఎం.ఎస్.ఆర్. తెలిపారు. సిలికాన్ వ్యాలీకి చెందిన 40 మంది వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, నిపుణులు సూచనలు, సలహాలు ఇస్తారని చెప్పారు. టెక్నాలజీ డేతో ముగిసే కార్యక్రమంలో 100 మంది పెట్టుబడిదారులు, పరిశ్రమలకు చెందిన ప్రముఖులు హాజరవుతారని ఫాల్కన్ ఎక్స్ సీఈవో మురళి చీరాల తెలిపారు. తొలిమూడు స్థానాల్లో నిలిచిన స్టార్టప్లకు ఫాల్కన్ ఎక్స్ సంస్థ నుంచి లక్ష అమెరికా డాలర్ల వ్యూహాత్మక నిధులు అందుతాయన్నారు.
‘క్రమబద్ధీకరణ’ అర్హుల గుర్తింపునకు ప్రత్యేక బృందాలు
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ భూములను ఆక్రమించి నివాసాలు ఏర్పాటు చేసుకుని క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసిన వారిలో అర్హుల గుర్తింపునకు ప్రభుత్వం ప్రత్యేక బృందాల ఏర్పాటుకు ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మండలానికో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. జీవో ఎంఎస్.58 కింద అంటే 125 చదరపు గజాల విస్తీర్ణం లోపు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న పేదల దరఖాస్తులను ఈ బృందాలు పరిశీలించనన్నాయి. విచారణ పూర్తయ్యాకా ఆ నివేదికలను రెవెన్యూ డివిజనల్ అధికారి పరిశీలించి అర్హుల తుది జాబితాను జిల్లా కలెక్టర్కు అందజేయనున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిరుపేదలకు పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిసింది.
26న తెలంగాణ సారస్వత పరిషత్తు పురస్కారాల ప్రదానం
నారాయణగూడ, న్యూస్టుడే: తెలంగాణ సారస్వత పరిషత్తు 79వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నలుగురు సాహితీవేత్తలు డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ఆచార్య బన్న అయిలయ్య, డా.కాంచనపల్లి గోవర్ధనరాజు, డా.షాజహానాలకు పురస్కారాలను ప్రకటించారు. వీటిని ఈ నెల 26 సాయంత్రం పరిషత్తులో జరిగే ఉత్సవాల్లో ప్రదానం చేయనున్నట్టు పరిషత్తు ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి, సాహితీవేత్త డా.ముదిగంటి సుజాతారెడ్డి విశిష్ట అతిథులుగా హాజరు కానున్నారు.
రాష్ట్ర పండగగా భాగ్యరెడ్డివర్మ జయంతి
ఈనాడు,హైదరాబాద్: దళితుల అభివృద్ధికి విశేష కృషి చేసిన భాగ్యరెడ్డివర్మ జయంతిని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటించింది. దీన్ని ఈ నెల 22న అధికారికంగా నిర్వహించాలని ఆదేశిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో వర్మ జయంతి ఉత్సవాలను జరపాలని ఆదేశించింది. దీనికయ్యే ఖర్చును దళిత సంక్షేమ, అభివృద్ధి శాఖ నుంచి వెచ్చించాలని సూచించింది.
డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ఫార్మా డి అభ్యర్థులు అర్హులే
ఈనాడు, హైదరాబాద్: డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ఫార్మా డి పూర్తి చేసిన అభ్యర్థులను కూడా అర్హులుగా పరిగణిస్తూ ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఇప్పటి వరకూ ఈ ఉద్యోగానికి డిగ్రీ ఇన్ ఫార్మసీ, ఫార్మాస్యూటికల్ సైన్స్, మెడిసిన్ ఇన్ స్పెషలైజేషన్ ఇన్ క్లినికల్ ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ పూర్తి చేసిన వారు అర్హులుగా ఉన్నారు.
కళాకారులు జూన్ 14లోగా దరఖాస్తు చేసుకోవాలి
ఈనాడు, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆరోగ్యం, సంక్షేమం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర కళాబృందాలు, జిల్లాలకు చెందిన కళాకారులు జూన్ 14లోగా హైదరాబాద్ రీజినల్ ఔట్రీచ్ బ్యూరో(ఆర్వోబీ)కు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ శ్రుతిపాటిల్ తెలిపారు.
ద.మ.రైల్వేకి ఐదు పతకాలు
ఈనాడు, హైదరాబాద్: వివిధ విభాగాల్లో గత సంవత్సరం పనితీరుకు గాను దక్షిణ మధ్య రైల్వేకి ఐదు జాతీయ స్థాయి పతకాలు లభించాయి. భువనేశ్వర్లోని రైల్ ఆడిటోరియంలో మే 28న జరిగే కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అందించనున్నారు. సెక్యూరిటీ షీల్డ్, సమగ్ర ఆరోగ్య సంరక్షణ షీల్డ్ (పశ్చిమ మధ్య రైల్వేతో సంయుక్తంగా), సివిల్ ఇంజినీరింగ్ షీల్డ్ (పశ్చిమ, మధ్య రెల్వేలతో కలిసి), స్పోర్ట్స్ షీల్డ్ (పశ్చిమ రైల్వేతో కలిసి), సివిల్ ఇంజినీరింగ్ కన్స్ట్రక్షన్స్ షీల్డ్(నార్త్ వెస్ట్రన్ రైల్వేతో సంయుక్తంగా)లు సాధించింది. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందిని జోన్ ఇంఛార్జి జీఎం అరుణ్కుమార్ జైన్ అభినందించారు.
‘ఈట్ రైట్ స్టేషన్’గా విశాఖ
ఈనాడు, విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వే స్టేషన్కు మరో గుర్తింపు లభించింది. రైల్వే ప్రయాణికులకు శుభ్రతతో కూడిన నాణ్యమైన ఆహారం అందించే స్టేషన్గా ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) గుర్తించింది. ‘ఈట్ రైట్ స్టేషన్’గా ధ్రువీకరించింది. దేశ మొత్తం మీద ఈ విభాగంలో 7 ఎంపికవగా... విశాఖ స్టేషన్ చోటు సంపాదించింది.
ట్రిపుల్ ఐటీలో రెండు పద్ధతుల్లో ఎంఎస్ఐటీ కోర్సు
ఈనాడు, హైదరాబాద్: మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎంఎస్ఐటీ) కోర్సును రెండు పద్ధతుల్లో అందించనున్నట్లు గచ్చిబౌలిలోని ట్రిపుల్ఐటీ ప్రకటించింది. ఇకపై ఆన్లైన్, ఆన్ క్యాంపస్ (ప్రత్యక్ష పద్ధతి)లో బోధించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసిన విద్యార్థుల నైపుణ్యాలను సానబెట్టి ఉద్యోగాలు కల్పించేందుకు ఈ కోర్సును డిజైన్ చేశారు. ఇందులో విద్యార్థులు తమకు నచ్చినపుడు పరీక్షలు రాసేందుకు అవకాశం ఉంటుంది. 3 సెమిస్టర్లు తరగతి గది బోధన, నాలుగో సెమిస్టర్ పరిశ్రమలలో ఇంటర్న్షిప్ ఉండేలా రూపొందించారు. ఈ కోర్సు ఆన్లైన్లో చేసేందుకు రూ.2 లక్షలు, ప్రత్యక్షంగా చదివేందుకు రూ.3 లక్షలుగా నిర్దేశించారు. మరిన్ని వివరాలకు ్ర్ర్ర.్ఝ(i్మ.్చ‘.i- వెబ్సైట్లో సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.
పారిశుద్ధ్యానికి దళితబంధు వాహనాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశుభ్ర పట్టణాల నేపథ్యంలో పారిశుద్ధ్యం, సెప్టిక్ట్యాంకులను శుభ్రపరిచేందుకు వాహనాల కొనుగోలుపై కార్యాచరణను రూపొందించాలని పురపాలకశాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ ఆ శాఖ కమిషనర్లను గురువారం ఆదేశించారు. దళితబంధు లేదా ఎన్ఎస్ఎఫ్కేడీసీ ద్వారా లబ్ధిదారులు వాహనాలు కొని వినియోగించడంపై దృష్టి సారించాలని తెలిపారు. వివిధ వాహనాల సమీకరణకు జూన్ 30, జులై 31, ఆగస్టు 15 తేదీలను తుదిగడువుగా నిర్దేశించారు.
ఆర్టీసీ బస్సుల కొనుగోలు టెండర్ల గడువు పొడిగింపు
నూతన బస్సులు కొనుగోలు చేసేందుకు ఆహ్వానించిన టెండరు గడువును తెలంగాణ ఆర్టీసీ ఈ నెల 28 వరకు పొడిగించింది. కాలం చెల్లిన బస్సుల స్థానంలో దశలవారీగా నూతన బస్సులను సమకూర్చుకోవాలని నిర్ణయించి.. తొలిదశలో 1,016 బస్సులు కొనుగోలు చేయనున్నట్లు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ప్రకటించిన విషయం తెలిసిందే.
కొత్తగా 47 కరోనా కేసులు
రాష్ట్రంలో గురువారం కొత్తగా 47 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,92,757కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 12,458 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, జీహెచ్ఎంసీలో అత్యధికంగా 36 మందికి పాజిటివ్ వచ్చింది. మరో 34మంది కోలుకోవడంతో కోలుకున్న వారి సంఖ్య 7,88,250గా నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
Bapatla: రహదారిపై యుద్ధవిమానాల ల్యాండింగ్
బాపట్ల జిల్లా మీదుగా వెళ్లే 16వ నంబరు జాతీయ రహదారిపై వైమానిక దళం విన్యాసాలు చేపట్టింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో అత్యవసర సమయాల్లో రహదారిపైనే ఉన్న రన్వేపై యుద్ధ విమానాలను ల్యాండ్ చేసే సామర్థ్యాన్ని మదింపు చేశారు. -
తెలంగాణ సొమ్ము దిల్లీకి
భారాస, కాంగ్రెస్ల బంధాన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాళేశ్వరం కుంభకోణంలో కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయో ఎవరికీ తెలియదు? మరోవైపు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలేదు. -
గవర్నర్ తమిళిసై రాజీనామా
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. పుదుచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) పదవికి సైతం రాజీనామా సమర్పించారు. ఈ మేరకు లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సోమవారం పంపించారు. -
దాతలూ స్పందించండి.. ఈ చిన్నారిని ఆదుకోండి
నిరుపేద తల్లిదండ్రులకు పెద్ద కష్టం వచ్చిపడింది. ఏడాది వయస్సున్న కుమారుడి తలకు ఏర్పడిన భారీ కణితి ప్రాణాంతకంగా మారింది. తల్లిదండ్రులు అప్పులు చేసి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మూడుసార్లు శస్త్రచికిత్స చేయించినప్పటికీ ఫలితం లేకపోయింది. -
ఆప్ నేతలకు రూ.100 కోట్ల చెల్లింపులో కవిత పాత్ర
దిల్లీ మద్యం విధానంలో పొందిన ప్రయోజనాలకు ప్రతిఫలంగా భారాస ఎమ్మెల్సీ కవిత ఆప్ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో భాగస్వామి అయ్యారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ సుజయ్పాల్, జస్టిస్ మౌసమీ భట్టాచార్య
-
రూ.50 వేలకు పైగా నగదు తీసుకెళ్లేవారు.. పత్రాలను వెంట ఉంచుకోవాలి
-
సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాల్లో వడగళ్లు
రాష్ట్రంలో సోమవారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాల్లో సోమవారం వడగళ్లవాన పడింది. రాజన్న సిరిసిల్ల మండలంలో విద్యుత్ స్తంభం కూలిన ఘటనలో ఓ రైతు మరణించారు. -
రూ.లక్షలు పెట్టు.. ఫ్యాన్సీ నంబరు పట్టు!
రాష్ట్రంలో నూతన రిజిస్ట్రేషన్ కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఫ్యాన్సీ నంబర్లు రవాణా శాఖకు కాసులు కురిపిస్తున్నాయి. రూ.లక్షలు పెట్టి అయినా.. వాటిని దక్కించుకునేందుకు వాహనదారులు పోటీ పడుతున్నారు. -
కవిత పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ
దిల్లీ మద్యం కేసులో తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీచేసిన సమన్లను సవాల్ చేస్తూ భారాస ఎమ్మెల్సీ కె.కవిత గత ఏడాది మార్చి 15న దాఖలు చేసిన రిట్ పిటిషన్ మంగళవారం సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది. -
తల్లీ వందనం.. తపనకు అభినందనం
దివ్యాంగుడైన కుమారుడిని పదోతరగతి పరీక్ష రాయించడానికి తల్లి పడుతున్న తపన స్ఫూర్తిదాయకం. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి(బి)కి చెందిన చరణ్కు పోలియోతో కాళ్లు చచ్చుబడగా, చేతుల కదలికలూ పరిమితంగానే ఉన్నాయి. -
యాదగిరీశుడి కల్యాణ వైభోగం
యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. గజ వాహనంపై నారసింహుడు, పల్లకినెక్కి అమ్మ లక్ష్మీదేవి.. మండపానికి చేరుకోగా, పూజారులు ఎదుర్కొని కల్యాణ తతంగాలను చేపట్టారు. -
బోరుతోనే ఊరికి పేరు.. 40 ఏళ్లుగా ఇంకని తీరు
ఆదిలాబాద్ గ్రామీణ మండలం తిప్ప పంచాయతీ పరిధిలోని బోరింగ్గూడ గ్రామంలో ఉన్న చేతిపంపు నుంచి నిరంతరం నీరు ఉబికివస్తోంది. గ్రామంలో 40 ఏళ్ల క్రితం బోరు వేసి.. ఈ చేతిపంపు ఏర్పాటు వేశారు. దీని కారణంగానే గ్రామానికి బోరింగ్గూడ అని పేరొచ్చిందని తిప్ప మాజీ సర్పంచి కిషన్ తెలిపారు. -
ఎల్లక్కపేట దసిలిపట్టు గుడ్డు.. దేశంలోనే వెరీగుడ్
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎల్లక్కపేట సమీపంలోని దసిలిపట్టు గుడ్ల తయారీ కేంద్రం దేశంలోనే నంబర్వన్గా నిలిచింది. ఐదేళ్ల నుంచి ఏటా సుమారు 2.80 లక్షలకుపైగా ఈ గుడ్లు ఉత్పత్తి చేస్తుండగా.. ఈ ఏడాది(ఫిబ్రవరితో గుడ్ల తయారీ ముగుస్తుంది) 3.27 లక్షలతో అగ్రస్థానాన్ని పొందింది. -
ఎన్నికల తర్వాతే వీసీల నియామకాలు
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతుల నియామక ప్రక్రియ లోక్సభ ఎన్నికల తర్వాతే చేపట్టనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తయింది. -
TS News: భర్తీ చేస్తున్నా.. భారీగా ఖాళీలు
ప్రభుత్వ పోటీ పరీక్షల్లో కొందరు అభ్యర్థులు విశేష ప్రతిభతో రెండు, మూడు, నాలుగు, అయిదేసి పోస్టులకు ఎంపికవడం మిగిలిన వారికి అశనిపాతంగా మారుతోంది. -
గొత్తికోయల ఆక్రమణలో 26 వేల ఎకరాలు
గొత్తికోయలు రాష్ట్రంలో 26 వేల ఎకరాల అటవీ ప్రాంతాల్ని ఆక్రమించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ వివరాల్ని కొద్దిరోజుల క్రితం నిర్వహించిన సమీక్షలో ఆ శాఖ మంత్రి కొండా సురేఖకు నివేదించారు. -
‘స్టేట్మెంట్’ దాఖలు విషయంలో అనిశ్చితి!
తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి విచారణ చేపట్టిన కృష్ణా ట్రైబ్యునల్-2 వద్ద రెండు రాష్ట్రాలూ దాఖలు చేయాల్సిన ‘స్టేట్మెంట్ ఆఫ్ కేస్’ విషయమై అనిశ్చితి నెలకొంది. ఈ నెల 20వ తేదీన దాఖలు చేయడానికి కేడబ్ల్యూడీటీ-2 రెండు రాష్ట్రాలకూ గడువు ఇచ్చింది. -
20 నుంచి మళ్లీ అయ్యర్ కమిటీ పర్యటన
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీల్లో లోటుపాట్లపై పరిశీలనకు నియమించిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్.డి.ఎస్.ఎ.) నిపుణుల కమిటీ ఈనెల 20న హైదరాబాద్కు రానుంది. -
ప్రభుత్వ ఆదేశాలనే అమలు చేస్తున్నాం
గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు వినియోగించే ఇళ్లకు జీరో బిల్లులకు విద్యుత్తు చట్ట ప్రకారం రాయితీ నిధులు ఇస్తామని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) తెలిపింది. దీనికి సంబంధించిన వివరణ పత్రాన్ని సోమవారం విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
AP News: ఈ ఎన్నికల్లో జగన్కు తగిన బుద్ధి చెప్తాం: మందకృష్ణ మాదిగ
-
Harish Rao: ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం ఇవ్వాలి: హరీశ్రావు
-
TCS: టీసీఎస్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. త్వరలో వేతన పెంపు!
-
Mallikarjun Kharge: భాజపా హామీలు.. 2004 ఫలితమే వస్తుంది: ఖర్గే
-
Flight Journey: ‘బరువు ఉన్నామని విమానం నుంచి దించేశారు’
-
YSRCP: చిలకలూరిపేట పంచాయితీ.. మల్లెల రాజేశ్కు సీఎంవో నుంచి పిలుపు