CM KCR: దిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్
జాతీయ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయల్దేరి సాయంత్రానికి దిల్లీకి చేరుకున్నారు.
రేపు చండీగఢ్కు పయనం
ఈనాడు, హైదరాబాద్, ఈనాడు, దిల్లీ: జాతీయ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయల్దేరి సాయంత్రానికి దిల్లీకి చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, తెరాస లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు స్వాగతం పలికారు. తుగ్లక్ రోడ్లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో శనివారం ఆయన ఆర్థిక రంగ నిపుణులు, ప్రముఖ పాత్రికేయులతో భేటీకానున్నట్లు సమాచారం. దిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణ పనులపై ఎండీపీ ఇన్ఫ్రా సంస్థ ప్రతినిధులతో మాట్లాడనున్నారు. ప్రజల ఎజెండాతో జాతీయ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రూపకల్పన కోసం రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించి నేతలతో చర్చలు జరిపిన ఆయన తాజాగా విస్తృతస్థాయిలో దిల్లీ, పంజాబ్, హరియాణా, కర్ణాటక, మహారాష్ట్రలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రులు, జాతీయస్థాయి నేతలు తదితరులతో సమావేశమవుతారు. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం దిల్లీ నుంచి చండీగఢ్కు వెళతారు. గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 మంది రైతుల కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేస్తారు. దాదాపు నాలుగు రోజుల పాటు కేసీఆర్ పంజాబ్లోనే ఉంటారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి ప్రశాంత్రెడ్డి శుక్రవారం ఉదయమే దిల్లీ చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎంపీలు సంతోష్కుమార్, రంజిత్రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్లున్నారు.
తెరాస కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభం
దేశ రాజధాని దిల్లీలోని వసంత్ విహార్లో తెరాస కార్యాలయ నిర్మాణ పనులను శుక్రవారం ప్రారంభించారు. అంతకుముందు నిర్వహించిన పూజా కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, తెరాస లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం మంత్రి ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ దేశ రాజధాని నడిబొడ్డున తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే తెరాస భవన్ నిర్మాణ పనులు ప్రాంభమయ్యాయన్నారు. నిర్దేశిత గడువులోగానే కార్యాలయ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ఇంత కీలక ఘట్టంలో తనకు స్థానం కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ నిర్మాణానికి గతేడాది సెప్టెంబరులో ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేసిన విషయం విదితమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!