ఇక.. వర్సిటీల వారీగా పీహెచ్డీ ప్రవేశాలు
పీహెచ్డీ ప్రవేశాలను ఇక నుంచి ఆయా విశ్వవిద్యాలయాలే సొంతంగా చేపట్టనున్నాయి. అందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి పచ్చజెండా ఊపింది. ఇటీవల జరిగిన ఆరు వర్సిటీల ఉపకులపతుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఆరు విశ్వవిద్యాలయాల్లో
నిర్వహణకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి పచ్చజెండా
అయిదేళ్ల తర్వాత కేయూ ప్రకటన
అదేబాటలో మిగిలిన వర్సిటీలు
ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఇప్పట్లో లేనట్లే..!
ఈనాడు, హైదరాబాద్: పీహెచ్డీ ప్రవేశాలను ఇక నుంచి ఆయా విశ్వవిద్యాలయాలే సొంతంగా చేపట్టనున్నాయి. అందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి పచ్చజెండా ఊపింది. ఇటీవల జరిగిన ఆరు వర్సిటీల ఉపకులపతుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఆరు విశ్వవిద్యాలయాల్లో పీహెచ్డీ సీట్ల భర్తీకి ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరపాలని ఉన్నత విద్యామండలి దాదాపు ఏడాది క్రితం నిర్ణయించగా.. ప్రస్తుతం దాన్ని వాయిదా వేశారు. తాజా నిర్ణయం నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) పీహెచ్డీ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఏడాదిగా చర్చించి.. చివరకు వెనుకడుగు
పీహెచ్డీ ప్రవేశాల సందర్భంగా సీట్ల కోసం ఉపకులపతు(వీసీ)లపై విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్న కారణంగా ప్రవేశాల ప్రక్రియ ప్రతిసారీ వివాదాస్పదంగా మారుతోందన్న ఉద్దేశంతో ఈసారి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావించింది. దీని వల్ల తమకూ సమస్యలు ఉండవని వీసీలు భావించారు. ఆ ఫలితంగానే ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలతోపాటు అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి కలిపి ఉమ్మడి పీహెచ్డీ ప్రవేశ పరీక్ష నిర్వహించాలని గతేడాది జులై 1న అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం విధివిధానాల రూపకల్పనకు ఓ కమిటీని నియమించి సుమారు ఏడాది పాటు పలుమార్లు చర్చించినా తుది నిర్ణయానికి రాలేకపోయారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష విధానంపై విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వర్సిటీల వారీగా పరీక్షలు నిర్వహించాలని అవి డిమాండ్ చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తే అది వివాదంగా మారి.. ఇతర అంశాలు అమలుకావని అధికారులు అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ కారణంగానే దాన్ని పక్కనపెట్టాలని నిర్ణయించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే వర్సిటీల వారీగా పీహెచ్డీ ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునేందుకు ఈ నెల 16న జరిగిన వీసీల సమావేశంలో ఉన్నత విద్యామండలి ఆమోదం తెలిపింది.
ఏళ్లుగా ఎదురుచూపులు
ఒకసారి పీహెచ్డీ ప్రవేశాలు జరిపితే మళ్లీ ఎన్నేళ్లకు నోటిఫికేషన్ వెలువడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కేయూ చివరిసారిగా 2016-17 విద్యాసంవత్సరానికి 2017లో ప్రకటన జారీ చేసింది. అప్పటి నుంచి అయిదేళ్లవుతున్నా ఆ వర్సిటీ మరో పీహెచ్డీ నోటిఫికేషన్ను విడుదల చేయకపోగా.. తాజాగా ఉన్నత విద్యామండలి ఆమోదం నేపథ్యంలో ఈ నెల 19న నోటిఫికేషన్ను వెలువరించింది. దీని ప్రకారం 26 విభాగాల్లో 212 పీహెచ్డీ సీట్ల భర్తీకి శుక్రవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ప్రవేశ పరీక్ష తేదీని తర్వాత ప్రకటించనున్నారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, రాజీవ్గాంధీ నేషనల్ ఫెలోషిప్ తదితరాలు ఉన్న వారికి కేటగిరీ-1 కింద 50 శాతం సీట్లు భర్తీ చేస్తున్నామని, మరో 50 శాతం సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని కేయూ వీసీ ఆచార్య తాటికొండ రమేష్ చెప్పారు. ఇక నుంచి ప్రతి ఆరు నెలలకోసారి నోటిఫికేషన్ జారీ చేస్తూ ఖాళీ సీట్లను భర్తీ చేయాలని నిర్ణయించామని వివరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చివరిసారి 2018లో పీహెచ్డీ నోటిఫికేషన్ జారీ అయింది. తరవాత ప్రకటన విడుదల చేయక నాలుగేళ్లు అవుతోంది. వర్సిటీల వారీగా పీహెచ్డీ ప్రవేశాలకు పరీక్ష నిర్వహించుకోవడానికి ఆమోదం రావడంతో సీపీగేట్(పీజీ ప్రవేశ పరీక్ష) తర్వాత ఆ వర్సిటీ ప్రకటన ఇవ్వనుంది. మిగిలిన విశ్వవిద్యాలయాలు కూడా అదేబాటలో నడవనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!