ఉద్యోగార్థులకు ఫీజుల భారం
ప్రభుత్వ ఉద్యోగాలకు కోటి ఆశలతో సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజులు భారంగా మారాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ).. పేదలు, రిజర్వుడు అభ్యర్థుల నుంచి కేవలం ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తుంటే, నియామక బోర్డులు అధికఫీజులు
కమిషన్లో తక్కువ.. బోర్డుల్లో ఎక్కువ
నిర్వహణ ఖర్చులకు నిధుల కొరతే కారణం
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాలకు కోటి ఆశలతో సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజులు భారంగా మారాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ).. పేదలు, రిజర్వుడు అభ్యర్థుల నుంచి కేవలం ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తుంటే, నియామక బోర్డులు అధికఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రైవేటుగా కోచింగ్ తీసుకోలేక లైబ్రరీల్లో, మొబైల్ డేటాతో యూట్యూబ్ పాఠాలు వింటూ చాలీచాలని భోజనంతో నెట్టుకొస్తున్న అభ్యర్థులకు ఈ ఫీజులు భారంగా మారుతున్నాయి. ప్రభుత్వం సత్వర ఉద్యోగ నియామకాల కోసం వివిధ బోర్డుల్ని ఏర్పాటు చేసింది. కానీ వీటికి నిధులు, వసతులు, తగినంత మంది సిబ్బంది లేరు. దీంతో ఇవి ప్రశ్నపత్రం తయారీ సహా అన్ని ప్రక్రియలను యూనివర్సిటీలు, ఇతర ఏజెన్సీలకు అప్పగిస్తున్నాయి. ఆ ఖర్చుల భారాన్ని నిరుద్యోగులపై వేస్తున్నాయి. ‘పోలీసు నియామక బోర్డు వ్యయంలో కేవలం 5 శాతమే ప్రభుత్వం నుంచి వస్తోంది. మిగతా 95 శాతాన్ని ఫీజులు, ఇతర మార్గాల్లో సర్దుబాటు చేస్తున్నాం’ అని బోర్డు వర్గాలు తెలిపాయి. ‘గురుకులాల్లో నియామకాలకు గ్రాంట్లు తక్కువగా వస్తున్నాయి. ప్రభుత్వం నియామక ఖర్చులను సర్దుబాటు చేస్తే ఫీజులు తగ్గించేందుకు వీలుంటుంది’ అని గురుకుల బోర్డు వర్గాలు వెల్లడించాయి.
ఉదాహరణకు ఇలా...
ఒక అభ్యర్థి డిగ్రీ, పీజీతో పాటు బీఈడీ అర్హతలు కలిగి ఉంటే ఆ అభ్యర్థికి ఫీజుల రూపంలో భారం ఇలా ఉండనుంది. ఇలాంటి అభ్యర్థికి పోలీసు ఉద్యోగాల్లో ఎస్సై, కానిస్టేబుల్, రవాణా, ఎక్సైజ్ పోస్టులు, గురుకులాల్లో పీజీటీ, టీజీటీ, జూనియర్ లెక్చరర్, పాఠశాల విద్యాశాఖలో స్కూల్ అసిస్టెంట్ (రెండు పోస్టులు), ఎస్జీటీ, గ్రూప్-1, 2, 3, 4 పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత ఉంటుంది. ఈ లెక్కన ఫీజులను లెక్కిస్తే కానిస్టేబుల్, ఎస్సై, రవాణా, ఎక్సైజ్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి రూ.3050 అవుతుంది. గురుకులాల్లో (గతంలో ఫీజు ప్రకారం) రూ.1200 చొప్పున 3 రకాల పోస్టులకు రూ.3600 అవుతుంది. విద్యాశాఖ పోస్టులను గతంలో టీఎస్పీఎస్సీ భర్తీ చేసింది. కమిషన్ వసూలు చేసిన ఫీజులను పరిగణనలోకి తీసుకుంటే రూ.200 చొప్పున మూడు పోస్టులకు రూ.600, గ్రూప్స్ పోస్టులకు రూ.800 ఖర్చు అవుతుంది. మొత్తం కలిపితే రూ.8050 అవుతుంది. పాఠశాల విద్యాశాఖ పోస్టులను డీఎస్సీకి అప్పగిస్తే ఈ భారం మరింత పెరుగుతుంది.
పోలీసు పరీక్ష ఒకటే.. ప్రతి పోస్టుకూ ఫీజు
ప్రస్తుతం పోలీసు నియామకబోర్డు ఆరు రకాల పోస్టులకు ప్రకటన ఇచ్చింది. వీటన్నిటికీ ప్రిలిమినరీ పరీక్ష ఒకటే. కానీ ప్రతి పోస్టుకూ దరఖాస్తు చేయాలంటే రూ.800 ఫీజుగా బోర్డు నిర్ణయించింది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేస్తే రెండో పోస్టు దరఖాస్తు ఫీజులో రూ.50 తగ్గింపు ఇస్తోంది. అంటే ఆరు రకాల పోస్టులకు దరఖాస్తు చేస్తే రూ.4550 చెల్లించాలి.
టీఎస్పీఎస్సీ ఫీజులు కొంత నయం
టీఎస్పీఎస్సీకి ఏటా ప్రభుత్వం నుంచి గ్రాంట్లు అందుతున్నాయి. దీంతో కమిషన్ పేదవర్గాలకు ఉచిత దరఖాస్తుకు అవకాశం కల్పిస్తోంది. పరీక్ష ఫీజు రూ.150గా ఉంది. పేదలు, రిజర్వుడు కేటగిరీల వారికి పరీక్ష ఫీజు మినహాయింపు ఉంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.200 చెల్లిస్తే చాలు. ఒకే పరీక్షతో వివిధ కేటగిరీల పోస్టుల భర్తీకి ఒకే దరఖాస్తు, ఒకటే ఫీజు కింద అనుమతించి, ఆప్షన్ల వారీగా పోస్టులు కేటాయించింది. కానీ ఈ పద్ధతి బోర్డుల్లో అమలు కావడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
యూటీఎస్ యాప్ పరిధి పెంపు
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు. -
ఏఈ పోస్టుల జనరల్ ర్యాంకు జాబితా వెల్లడి
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీజీపీ రవిగుప్తాకు పరిహారం చెల్లించండి
పనిచేయని రిక్లైనర్ సీటును కేటాయించి తీవ్ర అసౌకర్యం కలిగించడం, బిజినెస్(జెడ్) క్లాస్ టికెట్లో ఎకానమీ క్లాస్ సేవలందించిన నేపథ్యంలో డీజీపీ దంపతులకు రూ.2,07,500 పరిహారం చెల్లించాలని సింగపూర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3 ఆదేశించింది. -
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. -
ఖానాపూర్ అడవుల్లో చిరుత సంచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి. -
కాళేశ్వరంపై సత్వర విచారణ
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ తెలిపారు. -
మండుతున్న ఎండలు.. భగ్గుమంటున్న అడవులు
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది.