సంక్షిప్త వార్తలు
ఆహర భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో విజిలెన్స్ కమిటీని నియమించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆహారభద్రత చట్టం అమలుకు విజిలెన్స్ కమిటీ నియామకం
ఈనాడు, హైదరాబాద్: ఆహర భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో విజిలెన్స్ కమిటీని నియమించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి పౌరసరఫరాల శాఖ మంత్రి ఛైర్మన్గా ఉంటారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ వైస్ ఛైర్మన్గా, ఆహార భద్రత చట్టం వ్యవహారాలను రాష్ట్రంలో పర్యవేక్షించే డిప్యూటీ కమిషనర్ కమిటీ కన్వీనర్గా వ్యవహరిస్తారు. మహిళాశిశు సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, వైద్యారోగ్యశాఖ, ఉన్నత విద్య, గిరిజన సంక్షేమ శాఖల కార్యదర్శులు, పౌరసరఫరాల సంస్థ వైస్ ఛైర్మన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్లు, తూనికలు-కొలతల కంట్రోలర్, రాష్ట్ర ఆహార కమిషన్ సభ్య కార్యదర్శి, చమురు సంస్థల సమన్వయకర్త, చౌకధరల దుకాణాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, పౌరసరఫరాల శాఖ ఉప కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఏటా జనవరి, జూన్ నెలల్లో విధిగా సమావేశం అవుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నేడు రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్ల కోటా విడుదల
తిరుమల, న్యూస్టుడే: తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన కోటాను శనివారం ఉదయం 9గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు ముందస్తుగా దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని కోరింది. ఆలయంలో నిజపాద దర్శనం సేవను తితిదే తాత్కాలికంగా రద్దు చేసినందున శుక్రవారం ఉదయం 8గంటలనుంచే సామాన్య భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. వేసవి రద్దీ నేపథ్యంలో తితిదే నిజపాద దర్శనాన్ని రద్దుచేసింది.
ప్రధాని పర్యటనపై సమీక్ష
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్కు ఈ నెల 26న రానున్న ప్రధాని నరేంద్రమోదీ పర్యటన ఏర్పాట్లపై సీఎస్ సోమేశ్కుమార్ సమీక్ష నిర్వహించారు. ప్రధాని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటున్నారని, వివిధ శాఖలు ఎస్పీజీతో సమన్వయం చేసుకుంటూ ప్రొటోకాల్ అనుసారంగా పటిష్ఠ ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
డిజిటల్ జీవన ప్రమాణ ధ్రువీకరణ నమోదు చేయాలి
ఈనాడు, హైదరాబాద్: ఫింఛను ఆగిపోయిన...ఈపీఎఫ్ పింఛనుదారులంతా డిజిటల్ జీవన ప్రమాణ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ ఎం.హెచ్.వార్సి ఒక ప్రకటనలో తెలిపారు.
కొత్తగా 45 కొవిడ్ కేసులు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 45 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 20న నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు శుక్రవారం వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 413 మంది కొవిడ్తో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12,870 నమూనాలను పరీక్షించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 3,48,86,577కు పెరిగింది. తాజా ఫలితాల్లో హైదరాబాద్లో 33 పాజిటివ్లు నిర్ధారణ అయ్యాయి.
హెల్త్ కేర్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ అల్లైడ్ హెల్త్ కేర్ కౌన్సిల్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర కమిషన్కు ఛైర్పర్సన్గా డాక్టర్ విజయ్కుమార్ (నిమ్స్), ఎక్స్ అఫిషియో సభ్యులుగా మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, మంచిర్యాల వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సులేమాన్, గాంధీ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ దేవోజీ మాలోత్ను నియమించారు. వీరి ఎంపిక పట్ల రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ల అసోసియేషన్ ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూన్ 8-11 మధ్య నైరుతి రుతుపవనాల ప్రవేశం
రానున్న వానాకాలంలో రాష్ట్రమంతటా సాధారణ వర్షపాతం మించి అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. -
గల్ఫ్ కార్మికులకు బోర్డు
గల్ఫ్, ఇతర దేశాలకు వెళ్లే కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నామని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
వైభవంగా సీతారాములవారి ఎదుర్కోలు ఉత్సవం
సీతారాముల కల్యాణ ఘడియలు సమీపించడంతో భద్రాచల దివ్యక్షేత్రం శోభాయమానంగా మారింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రామాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. పారాయణలతో అంతా రామమయమైంది. -
తెలంగాణ వైపు ఏనుగుల మంద!
మహారాష్ట్రలో సంచరిస్తున్న ఏనుగుల మంద తెలంగాణలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అటవీశాఖ భావిస్తోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా నుంచి రాష్ట్రంలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీ డివిజన్లో అడుగుపెట్టొచ్చని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. -
చందా సరిగా కట్టరు.. కార్మికులకు వైద్యసేవలు అందవు..!
కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) పరిధిలోకి వచ్చే కార్మికులకు వైద్యసేవల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సంస్థ చర్యలు చేపట్టింది. కార్మికుల వైద్యసేవల బీమా చందా సొమ్ము సక్రమంగా చెల్లించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోనుంది. -
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ 7కి వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు మే 7వ తేదీకి వాయిదా వేసింది. -
శిరోముండనం చేయించి.. కనుబొమలు తీయించి
ఎన్నికల్లో రిగ్గింగ్పై ప్రశ్నించడమే ఆ దళిత యువకుల పాలిట శాపమైంది. మమ్మల్నే ప్రశ్నించే అంతటివారా? అంటూ అరాచక నేతలు ఆగ్రహించారు.. పంచాయితీకి పిలిపించారు. -
బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై వేటు
జగన్ ప్రభుత్వం గత అయిదేళ్లుగా మద్యం ద్వారా కొనసాగిస్తున్న దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) ఎండీ డి.వాసుదేవరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
‘శివ అన్నపురెడ్డి’ పేరిట ఉన్న ఫేస్బుక్ ఖాతా మాయం
న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై అసభ్య దూషణల కేసులో నిందితుడైన మణి అన్నపురెడ్డి.. తన రూపం, పేరు మార్చేసుకుని ‘శివ అన్నపురెడ్డి’ పేరిట ఇన్నాళ్లూ కొనసాగిస్తున్న ఫేస్బుక్ ఖాతాను తొలగించేశారు. -
శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు శిక్ష
దళిత యువకులకు అమానవీయంగా శిరోముండనం చేసి, మీసాలు, కనుబొమలు తీసేయించిన ఘటనలో వైకాపా ఎమ్మెల్సీ, మండపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు దోషి అని విశాఖపట్నం కోర్టు తేల్చింది. -
జులై శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల రేపు
భక్తుల సౌకర్యార్థం జులై నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే ఈనెల 18న నుంచి ఆన్లైన్లో విడుదల చేయనుంది. -
వైకాపా పోస్టులను తొలగించండి
వైకాపా పెట్టిన కొన్ని పోస్టులను తొలగించాలని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. -
వివేకా హత్య కేసులో అవినాష్రెడ్డి తప్పించుకోలేరు
వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి నిందితుడని, ఇందుకు శాస్త్రీయమైన ఆధారాలున్నాయని వివేకా కుమార్తె సునీత స్పష్టం చేశారు. -
అసామాన్య అనన్య
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణ, ఏపీల నుంచి సుమారు 60 మంది విజేతలుగా నిలిచారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. -
కళాకారులకు పదవీ విరమణ ఉండదు
నాటక రంగానికి తుర్లపాటి రామచంద్రరావు విశేష సేవలు అందించారని ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు కొనియాడారు. మంగళవారం రాత్రి వంశీ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని త్యాగరాయగానసభలో జరిగిన తెలుగు రంగస్థల దినోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. -
కేసుల వివరాలు అందించిన పోలీసులు
భాజపా తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేసుల వివరాలను పోలీసులు అందజేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మంగళవారం హైకోర్టుకు నివేదించారు. -
కవిత బెయిల్ పిటిషన్పై విచారణ 22కి వాయిదా
ఈడీ తనపై నమోదుచేసిన కేసులో పూర్తిస్థాయి బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. -
భద్రాద్రి సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి
భద్రాచలం సీతారామస్వామి కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం రాత్రి అనుమతిచ్చింది. బుధవారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో అంగరంగ వైభవంగా కల్యాణం జరగనున్న విషయం తెలిసిందే. -
ప్రచార రథంపై చెప్పుల దండ
ఎన్నికల ప్రచార రథాన్ని అడ్డుకొని.. అభ్యర్థి చిత్రపటంపై చెప్పులతో దాడి చేసినందుకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. -
18 నుంచి సికింద్రాబాద్-దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు
సికింద్రాబాద్-దానాపూర్ల మధ్య ఏప్రిల్, మే నెలల్లో అన్రిజర్వుడ్ ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది. ఏప్రిల్ 18 నుంచి జూన్ 29 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
అనంత్నాగ్ నుంచి ఆజాద్ పోటీ చేయట్లేదు: డీపీఏపీ ప్రకటన
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు..!
-
జగన్.. గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు: చంద్రబాబు