12న టెట్ యథాతథం
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) వాయిదా సాధ్యం కాదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి శనివారం స్పష్టం చేశారు. ఇతర పోటీ పరీక్షలను పరిగణనలోకి తీసుకొనే టెట్ తేదీని ఖరారు చేసినట్లు తెలిపారు. జూన్ 12న ఆర్ఆర్బీ
విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) వాయిదా సాధ్యం కాదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి శనివారం స్పష్టం చేశారు. ఇతర పోటీ పరీక్షలను పరిగణనలోకి తీసుకొనే టెట్ తేదీని ఖరారు చేసినట్లు తెలిపారు. జూన్ 12న ఆర్ఆర్బీ పరీక్ష ఉన్నందున టెట్ను వాయిదా వేయించాలని ఓ అభ్యర్థి పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్కు ట్విటర్లో విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని పరిశీలించాలని ఆయన మంత్రి సబితారెడ్డిని కోరుతూ ఆ ట్వీట్ను ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన సబితారెడ్డి వెంటనే తమ శాఖ ఉన్నతాధికారులతో ఈ అంశంపై చర్చించారు. అనంతరం ఆమె కేటీఆర్కు సమాచారాన్ని ట్వీట్ చేశారు. ‘‘టెట్పై అధికారులతో చర్చించాను. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే షెడ్యూలు ఖరారు చేశాం. సుమారు మూడున్నర లక్షల మంది టెట్కు హాజరు కానున్నారు. దీన్ని వాయిదా వేస్తే ఇతర పరీక్షలపై ప్రభావం పడుతుంది. అన్నీ పరిశీలించాకే టెట్ తేదీని నిర్ణయించి సన్నాహాలు చేపట్టాం’’ అని సబిత పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!