పిలుస్తోంది ఐటీ కొలువు
జోరుగా ఐటీ ఉద్యోగాలు.. ఆకర్షణీయ ప్యాకేజీలు.. గతంలో ఎన్నడూ లేనంతగా కళాశాల ప్రాంగణాల్లో, బయట ఎంపికలు.. ఉద్యోగార్థులకు ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోందని
ప్రాంగణ, ప్రాంగణేతర నియామకాల జోరు
ఏడాదిలో 5 లక్షల మేర కొత్త ఉద్యోగాలు
రూ. 45 లక్షల వరకు వార్షిక జీతభత్యాలు
డిజిటల్ టెక్నాలజీలతో ఉద్యోగాల్లో వృద్ధి
ఈనాడు, వాణిజ్య విభాగం: జోరుగా ఐటీ ఉద్యోగాలు.. ఆకర్షణీయ ప్యాకేజీలు.. గతంలో ఎన్నడూ లేనంతగా కళాశాల ప్రాంగణాల్లో, బయట ఎంపికలు.. ఉద్యోగార్థులకు ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోందని చెప్పొచ్చు. డిగ్రీ, కొద్దిపాటి ఐటీ నైపుణ్యం ఉంటే.. ఉద్యోగం లభించడం పెద్ద కష్టం కాదు. కొత్త టెక్నాలజీల మీద నాలుగైదేళ్లు పనిచేసిన అనుభవం ఉంటే, భారీ జీతభత్యాలు చెల్లించేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. వార్షిక జీతభత్యాలు రూ.4 లక్షల నుంచి 45 లక్షలు, ఇంకా పైన కూడా ఉంటున్నాయి. ఈ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేస్తోంది. కష్టించి పిల్లల్ని చదివిస్తే వారు మంచి వేతనంతో స్థిరపడే సానుకూలత లభిస్తోంది. కరోనా పరిణామాలతో డిజిటలీకరణ ఊపందుకోవడమే దీనికి ప్రధాన కారణం. మొత్తం ఐటీ ఉద్యోగుల్లో మహిళలు 36 శాతం. ఇది ఇంకా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
డిజిటల్కు మారాల్సిందే
ఆన్లైన్/మొబైల్ లావాదేవీలు పెరుగుతుండడంతో అన్ని వాణిజ్య సంస్థలూ డిజిటలీకరణ వైపు అడుగులు వేస్తున్నాయి. వీటి నుంచి ప్రాజెక్టులు వస్తుండడంతో ఐటీ కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. కొవిడ్కు ముందు ఐటీరంగంలో ఏటా 2-2.5 లక్షల కొత్త ఉద్యోగాలు లభించేవి. గత 12 నెలల్లోనే 4.5-5 లక్షల కొత్త ఉద్యోగాలొచ్చాయి. కృత్రిమ మేధ-యంత్ర అభ్యాసం(ఏఐ- ఎంఎల్), బ్లాక్చైన్, ఏఆర్-వీఆర్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్సెస్, ఓపెన్ టెక్నాలజీల వినియోగం పెరుగుతోంది.
ఒక్కో కేంద్రంలో 100-500 ఉద్యోగాలు
మన దేశంలో ఐటీ నిపుణులు ఎక్కువగా ఉండడంతో అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, చైనా తదితర దేశాల కంపెనీలు అభివృద్ధి, పరిశోధన కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఎన్నో కంపెనీల కేంద్రాలు ఇటీవల కూడా ఏర్పాటయ్యాయి. ఒక్కో కేంద్రంలో కనీసం 100 - 500 ఐటీ ఉద్యోగాలు లభిస్తున్నాయి.
* దేశీయ ఐటీ పరిశ్రమ ప్రస్తుతం 227 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. 2030కి 350 బిలియన్ డాలర్లకు చేరుతుంది.
* దేశంలో ఐటీ రంగం 50 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించగా, ఎనిమిదేళ్లలో ఈ సంఖ్య 70 లక్షలకు పెరుగుతుంది.
* ఇకపై ఏటా కనీసం 3- 3.5 లక్షల కొత్త ఉద్యోగాలు లభిస్తాయి.
* ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు డిజిటల్ టెక్నాలజీ ప్రాజెక్టులకు ఇటీవల 1.8 లక్షల కోట్ల డాలర్ల బడ్జెట్ కేటాయించాయి. ఇది 4 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.310 లక్షల కోట్ల)కు చేరొచ్చు. ఇందులో సింహభాగాన్ని దేశీయ కంపెనీలు దక్కించుకోవచ్చు.
కొత్త ఉద్యోగాలు ఈ విభాగాల్లోనే ఎక్కువ
* ఏఐ ఇంజినీరింగ్
* జనరేటివ్ ఏఐ
* డేటా ఫ్యాబ్రిక్
* డిస్ట్రిబ్యూషన్ ఎంటర్ప్రైజ్
* టోటల్ ఎక్స్పీరియన్స్
* క్లౌడ్ నేటివ్ ప్లాట్ఫామ్స్
* అటానమస్ సిస్టమ్స్ (సెల్ఫ్ మేనేజింగ్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్)
* డెసిషన్ ఇంటెలిజెన్స్
* హైపర్ ఆటోమేషన్
* సైబర్ సెక్యూరిటీ మెష్ (సీఎస్ఎంఏ)
డిజిటలీకరణ ఫలితమే
వి.రాజన్న, సీనియర్ ఉపాధ్యక్షుడు, గ్లోబల్ హెడ్, టీసీఎస్
2021-22 ఐటీ చరిత్రలో నిలిచిపోయే సంవత్సరం. మొదటిసారిగా భారత ఐటీ పరిశ్రమ 200 బిలియన్ డాలర్లను అధిగమించింది. 2020-21తో పోలిస్తే దాదాపు 15 శాతం వృద్ధితో 227 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో ఎగుమతుల వాటాయే 78 శాతం. 2011 తర్వాత ఇదే అధిక వృద్ధి. దీంతో ఐటీ ఉద్యోగాల సంఖ్య పెరుగుతోంది. శాప్, ఒరాకిల్, ఎంటర్ప్రైజ్ డేటా ప్లాట్ఫామ్స్, క్లౌడ్, ఆటోమేషన్, ఓపెన్ టెక్నాలజీల్లో నిపుణుల కోసం కంపెనీలు అన్వేషిస్తున్నాయి. డిజిటలీకరణ నైపుణ్యాలు మనదగ్గర బాగా పెరుగుతున్నాయి. వీటి అభివృద్ధిపై మనం దృష్టి సారించాలి. టీసీఎస్లో మేం ఈ పని చేస్తున్నాం. అకడమిక్ ఇంటర్ఫేస్ ప్రోగ్రామ్ ద్వారా విద్యా సంస్థలు- విద్యావేత్తలతో ఉమ్మడి పరిశోధన కార్యకలాపాలు చేపడుతున్నాం. డిజిటల్ టెక్నాలజీలపై 4.76 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చాం.
ఉద్యోగాలు ఇంకా పెరుగుతాయి
భరణికుమార్ అరోల్, సీఈవో, టెక్ట్రైడ్ సొల్యూషన్స్, హైసియా మాజీ అధ్యక్షుడు
ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలు డిజిటలీకరణ చెందుతుండడంతో ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ ఐటీ ప్రాజెక్టు అయినా చేసే నైపుణ్యాలు మనదేశంలో ఉన్నాయి. ఈ స్థాయిలో మరే దేశమూ లేదనే చెప్పాలి. మొత్తం ఐటీ ఉద్యోగుల్లో డిజిటల్ నిపుణులు 8 శాతం నుంచి 30 శాతానికి పెరగడం కలిసొస్తోంది. నైపుణ్యాల విస్తరణకు హైసియా చేపట్టిన కార్యక్రమాల ఫలితాలు కనిపిస్తున్నాయి. బీటెక్ పాఠ్యప్రణాళికల్లో మార్పులు చేసుకుంటే, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు సిద్ధమవుతారు.
అంకుర సంస్థల జోరూ కారణమే
కిరణ్ సీహెచ్, ఎండీ టెక్ ఎరా ఐటీ కన్సల్టింగ్
మనదేశంలో యూనికార్న్ (100 కోట్ల డాలర్ల విలువ ఉన్న సంస్థ) అంకుర సంస్థలు 100కు పైగానే ఉన్నాయి. ఇవి పెద్దఎత్తున విదేశీ పెట్టుబడులు సంపాదించాయి. నిపుణులను అధిక వేతనాలిచ్చి తీసుకుంటున్నాయి. కొవిడ్ తర్వాత అన్ని రంగాల్లోని సంస్థలు ఐటీ ప్రాజెక్టులకు కేటాయింపులు పెంచాయి. దీనికి అంకుర సంస్థల జోరు కలిసి, ఉద్యోగాలు బాగా పెరిగాయి.
వలసల వల్ల అధిక వేతనాలు
రమేష్ లోగనాథన్, ప్రొఫెసర్, ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్
ప్రాజెక్టులను దక్కించుకున్న సంస్థలు అధిక వేతనాలు ఆఫర్ చేస్తున్నందున, ఐటీ రంగంలో ఉద్యోగ వలసలు ఎక్కువయ్యాయి. నిపుణులను అట్టేపెట్టుకునేందుకు కంపెనీలు అధిక వేతనాలు ఆఫర్ చేయడంతో పాటు, నియామకాలు ఎక్కువగా జరుపుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.
తాజా వార్తలు (Latest News)
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ