తెలంగాణ సాగు విధానాలు భేష్
తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ విధానాలు భేషుగ్గా ఉన్నాయని, కేసీఆర్ రైతు అనుకూల పథకాలు దేశానికి ఆదర్శమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశంసించారు.
ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి వడ్డే ప్రశంస
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ విధానాలు భేషుగ్గా ఉన్నాయని, కేసీఆర్ రైతు అనుకూల పథకాలు దేశానికి ఆదర్శమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశంసించారు. ఆదివారం ఉదయం హైదరాబాద్లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఇంటికి వచ్చిన వడ్డే.. రాష్ట్ర, దేశ వ్యవసాయ రంగంపై ఆయనతో చర్చించారు. వడ్డే మాట్లాడుతూ పంటల వైవిధ్యీకరణ తప్పనిసరి అన్నారు. వరి తగ్గించి పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు వైపు రైతులు మళ్లాలని, ఆయిల్పామ్ సాగుకు తెలంగాణ ప్రభుత్వం రైతాంగాన్ని ప్రోత్సహించడం ఆహ్వానించదగ్గ పరిణామమని చెప్పారు. దేశంలో 1985-1989 మధ్య నూనెగింజలు - అపరాల సాంకేతిక మిషన్ పథకం అమలు తరహాలో ప్రస్తుతం అపరాలు, నూనె, పప్పుగింజల సాగుకు రైతులకు ప్రోత్సాహం అందించాల్సి ఉందన్నారు. ఇథనాల్ ఉత్పత్తిని, విదేశీ ఎగుమతులను ప్రోత్సహించేందుకు వసతులు కల్పించాలని ఆయన పేర్కొన్నారు. చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా మహిళా రైతు ఉత్పత్తి సంస్థలకు సహకరించాలని ఆయన తెలంగాణ సర్కారుకు సూచించారు. మద్దతుధరల విషయంలో కేంద్రం అవలంబిస్తున్న విధానాల మూలంగా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వడ్డే అన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు పంటలకు కనీస మద్దతుధర లభించేలా చట్టబద్ధత కల్పించినపుడే రైతులకు న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న వ్యవసాయ పథకాల గురించి మంత్రి నిరంజన్రెడ్డి ఆయనకు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. -
ఖానాపూర్ అడవుల్లో చిరుత సంచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి. -
కాళేశ్వరంపై సత్వర విచారణ
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ తెలిపారు. -
మండుతున్న ఎండలు.. భగ్గుమంటున్న అడవులు
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
భద్రాచలంలో 44 డిగ్రీలు
రాష్ట్రంలో ఎండల తీవ్రత గురువారం కొనసాగింది. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అత్యధికంగా భద్రాచలంలో 44 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. -
ఎవరి కోసం చేశారు ఇదంతా...?
రాష్ట్రంలో సంచలనం సృష్టించి ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత మరోమారు ఊపందుకునే అవకాశం ఉంది. -
నాణ్యమైన విత్తనాలనే వాడాలి
పంటల సాగుకు రైతులు నాణ్యమైన విత్తనాలను ఉపయోగించాలని, నాసిరకం విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయ అధికారులు సూచించారు. -
ఆయిల్పామ్ రైతులను చైతన్యపరచాలి
వేసవికాలంలో ఎండ తీవ్రత, వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు తగ్గునందున ఆయిల్పామ్ మొక్కల సంరక్షణపై రైతులు ఆందోళన చెందకుండా వారిని చైతన్యపరచాలని రాష్ట్ర ఉద్యాన సంచాలకుడు అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా