Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు భారీగా తిరుమలకు తరలివస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి ధర్మదర్శనం కోసం క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 25 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.

Updated : 23 May 2022 07:14 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు భారీగా తిరుమలకు తరలివస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి ధర్మదర్శనం కోసం క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 25 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి 10 గంటల్లో దర్శనం లభిస్తోంది. శనివారంతో పోల్చుకుంటే భక్తుల సంఖ్య కొంత తగ్గింది. గదులు దొరక్క భక్తులు ఇబ్బంది పడుతున్నారు. శనివారం శ్రీవారిని అత్యధికంగా 83,739 మంది దర్శించుకున్నారు. రూ.4.20 కోట్ల హుండీ కానుకలు లభించాయి. 46,187 మంది తలనీలాలు సమర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని