ఆశా వర్కర్లకు అరుదైన గౌరవం

భారత్‌లోని పది లక్షలకు పైగా మహిళా ఆశా వర్కర్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆదివారం ‘గ్లోబల్‌ హెల్త్‌ లీడర్‌’ అవార్డుతో సత్కరించింది.

Updated : 23 May 2022 05:23 IST

‘గ్లోబల్‌ హెల్త్‌ లీడర్‌’ పురస్కారంతో సత్కరించిన డబ్ల్యూహెచ్‌వో

ఐక్యరాజ్యసమితి/జెనీవా: భారత్‌లోని పది లక్షలకు పైగా మహిళా ఆశా వర్కర్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆదివారం ‘గ్లోబల్‌ హెల్త్‌ లీడర్‌’ అవార్డుతో సత్కరించింది. ఈ పురస్కారాన్ని ప్రపంచవ్యాప్తంగా అతికొద్దిమందికే ఇస్తారు. ఈ సారి ఆరు సంస్థలు/వ్యక్తులకు ప్రకటించారు. కొవిడ్‌-19 సమయంలో భారత ఆశావర్కర్ల సేవలు నిరుపమానమని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ ప్రశంసించారు. గ్రామీణ పేదలకు ఆరోగ్యసేవలను పొందేలా చేయడంలో, వారిని ఆరోగ్యవ్యవస్థతో అనుసంధానం చేయడంలో ఆశా సేవకులు అద్భుతమైన కృషి చేస్తున్నారని అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని