తెలంగాణకు లులూ
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తొలిరోజు పలు ప్రసిద్ధ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన లులూ
రూ. 500 కోట్లతో ఆహారశుద్ధి పరిశ్రమ స్థాపనకు అంగీకారం
రూ. వంద కోట్లతో కిమో ఫార్మా విస్తరణ
స్విట్జర్లాండ్ బ్యాంకింగ్, బీమా సంస్థ స్విస్రే పెట్టుబడి
హైదరాబాద్లో ఈ-కామర్స్ సంస్థ మీషో కార్యాలయం
దావోస్లో తొలిరోజు నాలుగు సంస్థలతో ఒప్పందాలు
ఈనాడు, హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తొలిరోజు పలు ప్రసిద్ధ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన లులూ గ్రూపు రూ.500 కోట్లతో ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. స్పెయిన్కు చెందిన కీమోఫార్మా రూ.100 కోట్లతో తమ రెండో భారీ పరిశ్రమ ఏర్పాటును ప్రకటించింది. స్విట్జర్లాండ్ బ్యాంకింగ్, బీమా సంస్థ స్వీస్రే హైదరాబాద్లో తమ కార్యాలయ ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ-కామర్స్ సంస్థ మీషో కూడా రాష్ట్ర రాజధానిలో కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. వాటిని మంత్రి కేటీఆర్ స్వాగతించారు.
హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి వాణిజ్య సముదాయం: లులూ సంస్థ
మంత్రి కేటీఆర్ను లులూ సంస్థ అధిపతి యూసుఫ్అలీ కలిసి ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటు నిర్ణయాన్ని తెలిపి, ప్రణాళిక అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అనుమతి పత్రాలను ఆయనకు అందజేశారు. మొదటి యూనిట్ పనులు చేపట్టిన వెంటనే రెండో యూనిట్కు శంకుస్థాపన చేస్తామని ఈ సందర్భంగా యూసుఫ్అలీ తెలిపారు. తెలంగాణ నుంచి యూరప్ దేశాలకు శుద్ధిచేసిన ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేస్తామన్నారు. హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయిలో అద్భుత వాణిజ్య సముదాయం నిర్మిస్తామన్నారు.
* స్పానిష్ బహుళజాతి సంస్థ కీమోఫార్మా పరిశోధన అభివృద్ధి డైరెక్టర్ జీన్ డానియల్ బోనీ కేటీఆర్ను కలిసి రూ.100 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో రెండో ఉత్పత్తి యూనిట్ను ఏర్పాటు చేస్తామన్నారు. తమ సంస్థ 2018 నుంచి జీనోమ్ వ్యాలీలో రూ.170 కోట్ల పెట్టుబడితో.. 270 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు కొనసాగిస్తోందన్నారు.
* 160 సంవత్సరాల చరిత్రగల స్విట్జర్లాండ్ బ్యాంకింగ్, ఆర్థిక నిర్వహణ, బీమా సంస్థ స్విస్ రే హైదరాబాద్లో తమ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని చెప్పింది. 250 మందికి ఉపాధి కల్పిస్తామని, దశలవారిగా విస్తరిస్తామని ప్రకటించింది. సంస్థ ఎండీ వెరోనికా స్కాట్టి, ప్రభుత్వ సంస్థల విభాగం డైరెక్టర్ ఇవో మెంజింగ్నర్ దావోస్లో మంత్రి కేటీఆర్తో సమావేశమై తమ నిర్ణయాన్ని తెలిపారు.హైదరాబాద్ కార్యాలయం ద్వారా తమ సంస్థ డాటా మరియు డిజిటల్ విభాగాలను బలోపేతం చేయడం, బీమా ఉత్పత్తులను రూపొందించడం, విపత్తుల నివారణ వంటి అంశాలపై పనిచేస్తుందన్నారు. నూతన ఆవిష్కరణల కోసం టీహబ్ భాగస్వామ్యం తీసుకుంటామన్నారు.
మీషోతో కార్యకలాపాలు
భారత్లో వేగంగా విస్తరిస్తున్న ఈ-కామర్స్ సంస్థ మీషో వ్యవస్థాపకుడు విదిత్ ఆత్రే మంత్రి కేటీఆర్ ఆహ్వానం మేరకు హైదరాబాద్లో తమ కార్యాలయ ఏర్పాటుకు అంగీకరించి ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా తెలంగాణలోని ద్వితీయశ్రేణి నగరాల్లో రిటైల్ వ్యాపారులకు సేవలందిస్తామని తెలిపారు. అంతకుముందు కేటీఆర్ను విదిత్ ఆత్రేతో పాటు మరో యువ సంచలనం నితిన్ కామత్ (ఆన్లైన్ స్టాక్ మార్కెటింగ్ బ్రోకరింగ్ సంస్థ)లు కలిశారు. వారి అనుభవాలు తెలుసుకున్నారు. హైదరాబాద్కు వచ్చి యువతకు స్ఫూర్తినివ్వాలని కోరారు. ఈ సమావేశాల్లో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, జీవశాస్త్రాల సంచాలకుడు శక్తి నాగప్పన్, సీఆర్వో అమర్నాథ్రెడ్డిలు పాల్గొన్నారు.
తెలంగాణ పెవిలియన్ ప్రారంభం
దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో జపాన్కు చెందిన ష్యుజిత్సు సంస్థ సీఈవో తకహితో తొకిట, బ్రిటిష్ మైక్రోబయాలజిస్టు పీటర్ పియోట్ తదితరులు పాల్గొన్నారు. పవర్ పాయింటు ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ విధానాలను కేటీఆర్ వారికి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు