ఎమ్మెల్యే అండతో నా ఇల్లు కబ్జా చేశారు
బోథ్ ఎమ్మెల్యే రాఠోడ్ బాపురావు అండతో ఇచ్చోడలోని తన ఇంటిని యాకుబ్ అనే వ్యక్తి కబ్జా చేశారని జవాను మహ్మద్ అక్రమ్ ఆరోపించారు. ఈమేరకు జాతీయజెండాను చేతబట్టి ఆర్మీ దుస్తులు ధరించి ఆదిలాబాద్ కలెక్టరేట్లో
ప్రజావాణిలో జవాను ఫిర్యాదు
ఆదిలాబాద్, బోథ్-న్యూస్టుడే: బోథ్ ఎమ్మెల్యే రాఠోడ్ బాపురావు అండతో ఇచ్చోడలోని తన ఇంటిని యాకుబ్ అనే వ్యక్తి కబ్జా చేశారని జవాను మహ్మద్ అక్రమ్ ఆరోపించారు. ఈమేరకు జాతీయజెండాను చేతబట్టి ఆర్మీ దుస్తులు ధరించి ఆదిలాబాద్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి విభాగానికి వచ్చారు. అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్కు అర్జీని అందించి తన గోడును వివరించారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇదే విషయమై సదరు ఎమ్మెల్యేను సంప్రదిస్తే ఇంటిని ఇద్దరూ చెరిసగం పంచుకోవాలని, లేదంటే ఆ ఇల్లు కూడా దక్కదని తనను బెదిరించే యత్నం చేశారని ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులు ప్రస్తుతం బోథ్లో ఉంటున్నారని తెలిపారు. ఇచ్చోడలో ఇల్లు ఖాళీగా ఉండటాన్ని గమనించి కబ్జా చేశారన్నారు. తాను పుల్వామా సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశరక్షణ కోసం పనిచేస్తున్న తాను సొంత ఇంటిని రక్షించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. జవానుకు విశ్రాంత ఆర్మీ జవాన్ల సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సాజిద్ఖాన్, బోథ్ మండల నాయకుడు చంటి సంఘీభావం తెలిపారు.
ఆ వ్యక్తితో నాకు సంబంధం లేదు: ఎమ్మెల్యే
జవాను ‘ప్రజావాణి’లో ఫిర్యాదు చేసిన విషయంమై ఎమ్మెల్యే రాఠోడ్ బాపురావును ‘న్యూస్టుడే’ సంప్రదించగా.. యాకూబ్ అనే వ్యక్తితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అతను తమ కార్యకర్త కూడా కాదని స్పష్టం చేశారు. ఇంటిని కబ్జా చేయించే అవసరం తనకు లేదని, అలాంటపుడు తానెందుకు పంచాయితీ చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. -
ఖానాపూర్ అడవుల్లో చిరుత సంచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి. -
కాళేశ్వరంపై సత్వర విచారణ
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ తెలిపారు. -
మండుతున్న ఎండలు.. భగ్గుమంటున్న అడవులు
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
భద్రాచలంలో 44 డిగ్రీలు
రాష్ట్రంలో ఎండల తీవ్రత గురువారం కొనసాగింది. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అత్యధికంగా భద్రాచలంలో 44 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. -
ఎవరి కోసం చేశారు ఇదంతా...?
రాష్ట్రంలో సంచలనం సృష్టించి ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత మరోమారు ఊపందుకునే అవకాశం ఉంది. -
నాణ్యమైన విత్తనాలనే వాడాలి
పంటల సాగుకు రైతులు నాణ్యమైన విత్తనాలను ఉపయోగించాలని, నాసిరకం విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయ అధికారులు సూచించారు. -
ఆయిల్పామ్ రైతులను చైతన్యపరచాలి
వేసవికాలంలో ఎండ తీవ్రత, వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు తగ్గునందున ఆయిల్పామ్ మొక్కల సంరక్షణపై రైతులు ఆందోళన చెందకుండా వారిని చైతన్యపరచాలని రాష్ట్ర ఉద్యాన సంచాలకుడు అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా