పదో తరగతి పరీక్షలు ప్రారంభం
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు ప్రథమ భాష పరీక్షకు 5,08,143 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 5,03,041 (99 శాతం) మంది రాశారు
కోదాడలో మారిన ప్రశ్నపత్రం
ఈనాడు-హైదరాబాద్, న్యూస్టుడే-కోదాడ పట్టణం, ఆసిఫాబాద్ అర్బన్: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు ప్రథమ భాష పరీక్షకు 5,08,143 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 5,03,041 (99 శాతం) మంది రాశారు. ప్రైవేటు విద్యార్థులు 158 మందికి గాను 89 మంది పరీక్షకు హాజరయ్యారు. తొలి రోజు మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఓ పేపర్ బదులు మరొకటి..
సూర్యాపేట జిల్లా కోదాడలోని 11 కేంద్రాల్లో పదో తరగతి విద్యార్థులకు వారు చదివిన సబ్జెక్టు బదులు మరో ప్రశ్నపత్రం ఇచ్చారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన 35 మందిని మరో కార్పొరేట్ స్కూల్ విద్యార్థులుగా నామినల్ రోల్స్లో నమోదు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ సమయంలో వారి సబ్జెక్టుల్లో తెలుగు బదులు ‘కాంపోజిట్ తెలుగు’ అని గుర్తించారు. హాల్టికెట్లలోనూ అదే సబ్జెక్టు నమోదైంది. పరీక్ష కేంద్రంలో అధికారులు కాంపోజిట్ పేపర్ను ఇవ్వడంతో విద్యార్థులు వారి దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని కేంద్రాల్లో విద్యార్థుల నుంచి హామీపత్రం తీసుకొని తెలుగు ప్రశ్నపత్రం ఇచ్చారు. మరికొన్ని కేంద్రాల్లో కాంపోజిట్ పరీక్ష రాశారు. విద్యార్థుల హాల్టికెట్లలో నమోదైన ప్రశ్నపత్రాన్నే అధికారులు ఇచ్చారని, వారి తప్పేమీ లేదని కోదాడ ఎంఈవో సలీమ్ షరీఫ్ తెలిపారు.
ఇద్దరు చీఫ్ సూపరింటెండెంట్లకు మెమోలు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ల(సీఎస్)కు డీఈవో అశోక్ సోమవారం మెమోలు జారీ చేశారు. అదనపు కలెక్టర్ వరుణ్రెడ్డి ఉదయం 8.50 గంటలకు సందర్శించిన సమయంలో పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులు, పోషకులు, సిబ్బంది మొబైల్ ఫోన్లు తీసుకువచ్చారన్నారు. దీనికి సీఎస్ల బాధ్యతారాహిత్యమే కారణమని పేర్కొంటూ మెమోలు జారీ చేసినట్లు డీఈవో పేర్కొన్నారు.
విధికి ఎదురీది.. ‘పది’ పరీక్షలకు కదిలి
సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాలకు చెందిన నందు-సంతోషి దంపతుల కుమార్తె మానసకు విధి కన్నెర్రతో పెద్ద కష్టమొచ్చి పడింది. నాలుగేళ్ల క్రితం ప్రమాదవశాత్తు కింద పడటంతో కాళ్లు, నడుము విరిగాయి. రూ.2 లక్షల వరకు అప్పు చేసి చికిత్స చేయించినా.. నయం కాలేదు. మంచానికే పరిమితమైంది. ఆమె పరిస్థితిపై 2018 ఏప్రిల్ 8న ‘ఈనాడు’లో ‘చదువుల తల్లిని బతికించండి సారూ’ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో దాతలు స్పందించారు. విన్నర్ ఫౌండేషన్ సభ్యులు రూ.2 లక్షల వరకు వెచ్చించి హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అనంతరం ఆమె చక్రాల కుర్చీ సాయంతో చేర్యాల జిల్లా పరిషత్ పాఠశాలలో తరగతులకు హాజరై.. 9, 10 తరగతులు పూర్తి చేసింది. సోమవారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షలకు కందిలోని ఉర్దూ పాఠశాల పరీక్ష కేంద్రానికి చక్రాల కుర్చీలోనే తోటి విద్యార్థులతో పాటు వచ్చింది.
- ఈనాడు, సంగారెడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ