కొత్తగా 27 కొవిడ్‌ కేసులు

రాష్ట్రంలో కొత్తగా 27 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,92,898కి పెరిగింది. తాజాగా మరో 52 మంది కోలుకోగా ఇప్పటి వరకూ 7,88,415 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 23న సాయంత్రం

Published : 24 May 2022 05:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 27 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,92,898కి పెరిగింది. తాజాగా మరో 52 మంది కోలుకోగా ఇప్పటి వరకూ 7,88,415 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 23న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు సోమవారం వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 372 మంది కొవిడ్‌ చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12,017 నమూనాలను పరీక్షించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 3,49,19,908కి పెరిగింది. తాజా ఫలితాల్లో హైదరాబాద్‌లో 17 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మరో 13,702 కొవిడ్‌ టీకా డోసులు పంపిణీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని