బాధ్యతలు స్వీకరించిన నర్సింగ్‌రావు

రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిగా నందికొండ నర్సింగ్‌రావు సోమవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వరంగల్‌ ప్రిన్సిపల్‌ జిల్లా సెషన్స్‌ జడ్జిగా వ్యవహరిస్తున్న ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం గత వారంలో న్యాయశాఖ కార్యదర్శిగా

Published : 24 May 2022 05:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిగా నందికొండ నర్సింగ్‌రావు సోమవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వరంగల్‌ ప్రిన్సిపల్‌ జిల్లా సెషన్స్‌ జడ్జిగా వ్యవహరిస్తున్న ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం గత వారంలో న్యాయశాఖ కార్యదర్శిగా నియమించిన విషయం తెలిసిందే. ఆ మేరకు బాధ్యతలు స్వీకరించిన ఆయన న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని హైదరాబాద్‌ అరణ్యభవన్‌లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని